Andhra Pradesh

News April 8, 2024

REWIND.. రికార్డు సృష్టించిన గల్లా అరుణకుమారి

image

చంద్రగిరి నియోజకవర్గం నుంచి గల్లా అరుణకుమారి ఆరుసార్లు పోటీ చేసి నాలుగుసార్లు గెలిచారు. 1989 కాంగ్రెస్ నుంచి పోటీచేసి NRJ నాయుడుపై గెలిచారు. 1994లో పోటీ చేసి N రామ్మూర్తి నాయుడు చేతిలో ఓడిపోయారు. 1999,2004,2009లో మూడుసార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించి రికార్డు సృష్టించారు. 2014లో పోటీచేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈమె మూడుసార్లు మంత్రిగా పని చేశారు.

News April 8, 2024

అనంతపురంలో ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

image

అనంతపురం ఆర్టీసీ బస్టాండులోని బస్సు ప్లాట్‌ఫాం మీదకు దూసుకొచ్చింది. హిందూపురం డిపోకు చెందిన బస్సు అనంతపురం బస్టాంపు వద్దకు చేరగానే డ్రైవర్ బ్రేక్ వేసినా పడకపోవడంతో ప్లాట్‌ఫాం పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వైద్య విద్యార్థిని వీణ కాలికి స్వల్ప గాయాలయ్యాయి.

News April 8, 2024

శ్రీశైలం: కృష్ణా నదిలో నీట మునిగి వ్యక్తి మృతి

image

శ్రీశైలం డ్యాం దిగువన గల లింగాలగట్టు హై లెవెల్ పుష్కర ఘాట్ వద్ద సోమవారం ఉదయం ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందాడని మత్స్యకారులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ముగ్గురు మల్లన్న దర్శనార్థమై వచ్చి రద్దీ అధికంగా ఉండటంతో ఆలోగా కృష్ణానదిలో స్నానమాచరించేందుకు లింగాలగట్టుకు చేరుకున్నారు. ముగ్గురు నదిలో దిగి స్నానమాచరిస్తుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి నీట మునిగాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 8, 2024

ఉమ్మడి తూ.గో. జిల్లాలో ప్రారంభమైన వరి కోతలు

image

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రాజమండ్రి, అనపర్తి, కాకినాడ జిల్లా పరిధిలో సామర్లకోట, డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఆలమూరు, కొత్తపేట వ్యవసాయ సబ్‌ డివిజన్ల పరిధిలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. కోతలు జరిగిన ప్రాంతాల్లో సగటు దిగుబడి 50 బస్తాలు (బస్తా 75 కేజీలు, 37.5 క్వింటాళ్ల) వరకు వస్తోంది. కొన్నిచోట్ల 55 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. మరో 10 రోజుల్లో రబీ కోతలు జోరందుకోనున్నాయి.

News April 8, 2024

అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్న కార్తికేయ డైరెక్టర్

image

ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం ఉదయం కార్తికేయ సినిమా డైరెక్టర్ చందు మొండేటి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి దేవాలయం అధికారులు ఘనస్వాగతం పలికి.. అనంతరం స్వామి వారి దర్శనం చేయించారు. ఆలయ అర్చకులు వారికి స్వామి వారి జ్ఞాపికను, తీర్థప్రసాదాలు అందజేశారు.

News April 8, 2024

శ్రీశైలంలో నేడు ప్రభోత్సవం కార్యక్రమం

image

ఉగాది ఉత్సవాల్లో భాగంగా శ్రీశైలం క్షేత్రంలో నేటి సాయంత్రం ప్రభోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ పండితులు తెలిపారు. ఉత్సవం అనంతరం నంది వాహన సేవ ఉంటుందన్నారు. శ్రీ భ్రమరాంబికా దేవి అమ్మవారికి మహా సరస్వతి అలంకారం ఉంటుందని చెప్పారు. స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం, కళ్యాణోత్సవం, ఏకాంతసేవ పూజలు వైభవంగా జరుగుతాయన్నారు. రుద్రహోమం, చండీ హోమం పూజలు ఉంటాయని వివరించారు.

News April 8, 2024

జగ్గయ్యపేట: మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తల్లి మృతి

image

జగ్గయ్యపేట టీడీపీలో విషాదం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తల్లి  సోమవారం ఉదయం మాతృమూర్తి సక్కుబాయి (90) మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆమె మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె మృతితో జగ్గయ్యపేట టీడీపీ శ్రేణులలో తీవ్ర విషాదం నెలకొంది.  

News April 8, 2024

అనంత: ఈనెల 21న విద్యార్థలకు ప్రవేశ పరీక్ష

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 25 ఏపీ మోడల్ స్కూల్‌‌లలో ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఒక్కో పాఠశాలలో ఆరో తరగతికి 100 సీట్లు కేటాయించారు. మొత్తం 25 పాఠశాలల్లో 2500 సీట్లు గాను, 5137 దరఖాస్తులు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 21న ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి అర్హులైన వారికి సీట్లు కేటాయిస్తారు.

News April 8, 2024

విజయవాడ: ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

image

రామరాజ్యనగర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌ల మధ్య ఉన్న చెట్టుకు ఒ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని పరిశీలించారు. జన సంచారం లేని ప్రాంతంలో సుమారు రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు చేప్పారు. ఈ ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 8, 2024

కొల్లూరు: కాలి బూడిదైన రూ.3 లక్షల నగదు

image

విద్యుదాఘాతం వల్ల కౌలు రైతు కుటుంబం సర్వస్వం కోల్పోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లూరు మండలం తడికలపూడి గ్రామానికి చెందిన రావుల కిరణ్ బాబు పూరిళ్లు విద్యుదాఘాతంతో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంటితో పాటు రూ.3 లక్షల నగదు, ఆస్తి పత్రాలు, సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.7 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబం తెలిపింది.