India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతలోని రూడ్సెట్ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు ఉచితంగా టైలరింగ్, బ్యూటీ పార్లర్ శిక్షణ కల్పిస్తున్నట్లు డైరెక్టర్ ఎస్. విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 20 నుంచి 30 రోజుల పాటు శిక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజన, వసతి కల్పిస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలు చెందిన వారు 19 నుంచి 45 సం. వయస్సు ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ఇరువురికి గాయాలైన సంఘటన వినుకొండ మండల పరిధిలోని కొత్తపాలెం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఆదివారం వినుకొండ కర్నూలు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరువురికి గాయాలు కాగా స్థానికులు వారిని వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పర్యటించిన టీడీపీ అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. క్రీడాకారులతో పాటు వాకర్స్ వారిని చప్పట్లతో ప్రోత్సహించారు.
కర్నూలు పశుసంవర్ధక శాఖ, ఆరోగ్య సేవ వెటర్నరీ అంబులేటరీ సర్వీస్ (1962)లలో డ్రైవర్(పైలెట్) పోస్టులు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఖాళీగా ఉన్నాయని జీవీకే ఈఎంఆస్ఐ జిల్లా మేనేజర్ రామకృష్ణగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. డ్రైవర్ పోస్టులకు 10వ తరగతి చదివి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి, 36 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు www.ahd.gov.in సంప్రదించాలన్నారు.
అనకాపల్లి ఎన్డీఏ MP అభ్యర్థి సీఎం రమేశ్కు పోలీసులు శనివారం రాత్రి 41ఏ నోటీసులు ఇచ్చారు. ఇటీవల చోడవరంలోని ఓ టైల్స్ షాప్లో డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టగా.. సీఎం రమేశ్ అక్కడికి చేరుకుని అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈనెల 9న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. సీఎం రమేశ్, చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి రాజుతో పాటు ఆరుగురి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు.
వేసవి కాలం ఆరంభం కావడంతో వంశధార నీటి జలాలు అడుగంటి పోతున్నాయి. దీనికితోడు కొంత కాలంగా వర్షాలు లేకపోవడంతో నదులు జల కళను కోల్పోతున్నాయి. తీర గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. వంశధార ప్రాజెక్టుకు సైతం నీటి జాడలు తగ్గిపోతోంది. ప్రస్తుతం నిల్వ ఉన్న దాంట్లో 150 క్యూసెక్కులు ఎడమ కాలువ ద్వారా అధికారులు విడిచిపెడుతున్నారు.
చిత్తూరు జిల్లాలోని తవణంపల్లె మండలంలో శనివారం అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పులిచెర్లలో 43.6, ఎస్ఆర్ పురం 42.9, విజయపురం, నగరి, నిండ్ర 42.8,పుంగనూరు, బంగారుపాళ్యం 41.5,సోమల 41.4,చిత్తూరు, సదుం 41.2,పాలసముద్రం, గుడిపల్లె 41,కుప్పం 40.9,చౌడేపల్లె, యాదమరి,రొంపిచెర్ల, ఐరాల 40.8, జీడీనెల్లూరు, వెదురుకుప్పం 40.7,కార్వేటినగరం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్ర రాజకీయాల్లో పులివెందుల ప్రత్యేకం. ఇక్కడ మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 13 సార్లు YS కుటుంబానిదే పెత్తనం. YS కుటుంబంపై 5 సార్లు పోటీచేసిన సతీశ్ రెడ్డి వైసీపీలో చేరడంతో జగన్ మెజారిటీ మరింత పెరుగుతుందని పార్టీ శ్రేణులు అంచనా వేసుకుంటున్నారు. TDP అభ్యర్థి బీటెక్ రవి గెలుపుపై ధీమాగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేసే అవకాశం ఉంది. మరి ఎవరు గెలుస్తారు?
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని కొవ్వూరు కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం మండలంలోని మలకపల్లిలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆయన ఓ టిఫిన్ సెంటర్లో గారెలు, బజ్జీలు వేశారు.
కృష్ణా వర్సిటీ పరిధిలో డిసెంబర్ 2023లో నిర్వహించిన బీటెక్ 5, 7వ సెమిస్టర్ పరీక్షలకు(2022- 23 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 10వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని యూనివర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ చూడవచ్చన్నారు.
Sorry, no posts matched your criteria.