Andhra Pradesh

News March 5, 2025

విశాఖలో రేపే మద్యం దుకాణాల వేలం

image

విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో విశాఖలో గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణలకు వేలం నిర్వహించనున్నారు. మార్చి 6న ఉడా చిల్డ్రన్ ఏరినాలో ఉదయం 9 గంటలకు వేలం జరగనుంది. అయితే ఫిబ్రవరి 11న వేలం నిర్వహించాల్సి ఉండగా ఎమ్మెల్సీ కోడ్ నేపథ్యంలో వాయిదా వేశారు. జిల్లాలో 14 మద్యం దుకాణలకు గాను 316 దరఖాస్తులు వచ్చాయని గతంలో అధికారులు వెల్లడించారు. ఎక్సైజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News March 5, 2025

శ్రీకాకుళం : పరీక్షలకు 307 మంది గైర్హాజరు

image

జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ ఇంగ్లిష్ -2 పరీక్షలలో భాగంగా 307 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు తెలిపారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇంటర్ జనరల్ లో 17,623 మంది విద్యార్థులు, ఒకేషనల్‌లో 1086 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉందన్నారు. కాగా 18, 079 విద్యార్థులకు 18402 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని తెలిపారు.

News March 5, 2025

కొమ్మాదిలో దివ్యాంగుల స్పోర్ట్స్ సెంటర్.. స్థల పరిశీలన 

image

కొమ్మాదిలోని దివ్యాంగుల స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటుపై విశాఖ జేసీ మాయూర్ అశోక్ సమీక్షించారు. ఈ మేరకు కొమ్మాది ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్న స్థలాన్ని బుధవారం పరిశీలించారు. 22 ఎకరాల్లో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. మూడు నెలల్లో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయనతో పాటు విశాఖ రూరల్ తహశీల్దార్ కిరణ్ పాల్ తదితులు ఉన్నారు.

News March 5, 2025

విశాఖలో హైకోర్టు బెంచ్ కోసం అఖిలపక్ష సమావేశం

image

విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ త్వరలో ఆరు జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఇతర నాయకులతో కలిసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బెవర సత్యనారాయణ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక తేదీ ప్రకటిస్తామన్నా. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాలూ మద్దతు ఇవ్వాలని కోరారు.

News March 5, 2025

కంచిలి: జాతరలో పెళ్లి చూపులు

image

కంచిలి మండలం కుత్తుమ, కొక్కిలి పుట్టుగ గ్రామాల పరిధిలో గురువారం నిర్వహించే జామి జాతరకు సర్వం సిద్ధం చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ మేరకు ఆలయాన్ని రంగులు, పూలమాలలతో అలంకరించారు. ఒడిశా సాంప్రదాయం గల ఈ గ్రామాలలో ఈ జాతర ద్వారా పెళ్లికాని యువతీ, యువకులకు చూపులు జరుగుతాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ జాతరలో ఇష్టపడిన వారితో పెద్దల అంగీకారంతో వివాహాలు జరుగుతాయని స్థానికులు నమ్మకం.

News March 5, 2025

దువ్వాడపై విజయనగరం డీఎస్పీకి ఫిర్యాదు

image

వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన నాయకుడు, రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మిడతాన రవికుమార్ విజయనగరం DSPకి బుధవారం ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్‌పై తగిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. జనసేన పార్టీ నాయకులు రామునాయుడు, కుర్మారావు పాల్గొన్నారు.

News March 5, 2025

ఆమదాలవలస : దూసిలో 83 ఏళ్ల నాటి మహా వృక్షం

image

మహాత్మాగాంధీ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో నాటిన మొక్క మన ఆమదాలవలస మండలంలో ఉంది.1942లో దూసి గ్రామంలోని రైల్వే స్టేషన్‌లో నాటిన ఆ మొక్కకు ప్రస్తుతం 83 ఏళ్లు ఉంటాయని స్థానికులు తెలిపారు. ఆ వృక్షం  ప్రయాణికులకు , గ్రామస్థులకు వేసవి కాలంలో చల్లని నీడనిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. 

News March 5, 2025

తాటిచెట్లపాలెం యాక్సిడెంట్.. మృతుల వివరాలు ఇవే..!

image

తాటిచెట్లపాలెం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన యాక్సిడెంట్‌లో మృతుల వివరాలను కంచరపాలెం ట్రాఫిక్ సీఐ దాశరథి తెలిపారు. మృతుల్లో ఒకరు కంచరపాలేనికి చెందిన యళ్వంత్‌గా గుర్తించామన్నారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు. వీరిద్దరూ వాడపేట పండక్కి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. 

News March 5, 2025

విశాఖ మెట్రో నాలుగేళ్లలో పూర్తి చేస్తాం: మంత్రి

image

విశాఖలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నారాయణ అసెంబ్లీలో తెలిపారు. గాజువాక నుంచి భోగాపురం వయా మద్దిలపాలెం, మధురవాడ మీదుగా 34.6 కి.మీ మేర <<15657173>>మెట్రో నిర్మాణానికి <<>>ప్రతిపాదనలకు కేంద్రానికి పంపామన్నారు. పనులు ప్రారంభమయ్యాక నాలుగేళ్లలో పూర్తవుతుందన్నారు. ఏహెచ్ 45 నుంచి ఎన్‌హెచ్ 16 వరకు 6 రోడ్లు ప్లాన్ చేశామన్నారు. వీటిని ఏడాదిన్నరలోపు ఈ రోడ్డు పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

News March 5, 2025

ఏలూరు: 1000 ఓట్లు కూడా దాటని ఎమ్మెల్సీ అభ్యర్థులు

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన 35 మంది అభ్యర్థులలో చాలా మందికి మూడంకెల స్కోరు కూడా దాటలేదు. మరికొందరికైతే 100 లోపు ఓట్లే పడ్డాయి. వేణుగోపాలకృష్ణకు 1017 ఓట్లు, హేమ కుమారికి 956, వానపల్లి శివ గణేష్ 772, అసన్ షరీఫ్ 759, బండారు రామ్మోహన్ 709, చిక్కాల దుర్గాప్రసాద్ 665, కాట్రు నాగబాబు 565 ఇలా చాలా మంది అభ్యర్థులు 1000 మార్క్ కూడా టచ్ చేయలేకపోయారు.