Andhra Pradesh

News April 6, 2024

ఇండియా కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పి మురళి

image

ఇండియా కూటమి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి పోటీ చేయనున్నారు. మురళి పేరును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ శనివారం ప్రకటించారు. తిరుపతి అసెంబ్లీ టికెట్ తొమ్మిది మంది ఆశావహులు పోటీ పడగా చివరకు సీపీఐ టికెట్‌ను దక్కించుకుంది. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి, వైసీపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎన్నికల బరిలోకి దిగింది.

News April 6, 2024

కోవూరు: ఒకే వేదికపైకి నల్లపరెడ్డి సోదరులు

image

సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోవూరు మీదుగా వెళ్లిన సందర్భంగా నల్లపరెడ్డి సోదరులు ఒకే చోట కనిపించారు. ఇటీవల ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజేంద్రకుమార్ రెడ్డి మాట్లాడిన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ దశలో రాజేంద్ర రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం సైతం జరిగింది. ఈ క్రమంలో అందరూ కలవడంపై నల్లపరెడ్డి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News April 6, 2024

సాలూరు: యువతి అనుమానస్పద మృతి

image

అనుమానస్పద స్థితిలో యువతి మృతి చెందిన ఘటన సాలూరులో తీవ్ర కలకలం రేపింది. దండిగాంకు చెందిన యువతిని పని చేయడంలేదని తల్లి మందలించడంతో సుమురుగా 25 రోజుల కిందట ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. శనివారం గ్రామ సమీపంలో అడవిలో యువతి అస్థిపంజరాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలిపారు. వస్తువులు ఆధారంగా యువతి మృతదేహాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఎస్ఐ MV. రమణ తెలిపారు.

News April 6, 2024

తాళ్లపూడి: లోయలో పడ్డ యాసిడ్ ట్యాంకర్

image

తాళ్లపూడి మండలంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. తాళ్లపూడి నుంచి రాజమండ్రి వైపు యాసిడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి గోదావరి గట్టుపై నుంచి లోయలోకి పల్టీ కొట్టింది‌. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ట్యాంకర్‌ను బయటకు తీసి యాసిడ్‌ను మరో ట్యాంకర్ ద్వారా రాజమండ్రికి తరలించారు.

News April 6, 2024

తాళ్లపూడి: లోయలో పడ్డ యాసిడ్ ట్యాంకర్

image

తాళ్లపూడి మండలంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. తాళ్లపూడి నుంచి రాజమండ్రి వైపు యాసిడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి గోదావరి గట్టుపై నుంచి లోయలోకి పల్టీ కొట్టింది‌. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ట్యాంకర్‌ను బయటకు తీసి యాసిడ్‌ను మరో ట్యాంకర్ ద్వారా రాజమండ్రికి తరలించారు.

News April 6, 2024

పాడేరు: ఎన్నికల ఫిర్యాదులకు అదనంగా మరో 3 నంబర్లు

image

రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులకు ప్రస్తుతం ఉన్న 1950 టోల్ ఫ్రీ నంబరుతో పాటు మరో మూడు ల్యాండ్ లైన్ నంబర్లను అదనంగా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. ఎన్నికల నిభందనలు ఉల్లంఘన, బహుమతులు, నగదు పంపిణీ, అక్రమ తరలింపు, మత్తు పదార్ధాల పంపిణీ, తరలింపు, తదితర ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ప్రజలు 08935-299934, 08935-299912, 08935 -293448 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

News April 6, 2024

పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలని జిల్లా డాక్టర్ సృజన అధికారులను కోరారు. సార్వత్రిక ఎన్నికలు -2024కు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనే 33 నిత్యావసర సేవలు అందించే శాఖలకు చెందిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తోందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

News April 6, 2024

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు 

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా నాగర్‌కోయిల్(NCJ), డిబ్రుగర్ (DBRG) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నెం.06103 NCJ- DBRG రైలును ఏప్రిల్ 12, 26, మే 10, 24 తేదీలలో, నెం.06104 DBRG- NCJ రైలును ఏప్రిల్ 17, మే 1, 15, 29న నడుపుతామని చెప్పారు. ఈ ప్రత్యేక రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు ఏలూరు, రాజమండ్రి, దువ్వాడ తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు. 

News April 6, 2024

ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేసింది: ఎంపీ భరత్

image

రాజమండ్రిలో అభివృద్ధి జరగలేదని, మరోవైపు కేంద్ర నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందని ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి లోక్‌సభ అభ్యర్థి పురంధీశ్వరి అనడం విడ్డూరంగా ఉందని ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిధుల మంజూరు విషయంలో, రాష్ట్ర విభజన హామీల అమలు విషయంలో తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు‌.

News April 6, 2024

REWIND తిరుపతి: ఆరు సార్లు పోటీ.. ఐదుసార్లు విజయం

image

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 1989లో శ్రీకాళహస్తి నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందాడు. తర్వాత 1994,1999 ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఎస్సీవీ నాయడు చేతిలో ఓటమి పాలయ్యారు. మళ్లీ 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు మంత్రి వర్గంలో ఐటీమంత్రిగా, రోడ్డు- భవనాల శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సనిహితుడు.