Andhra Pradesh

News March 5, 2025

తణుకు మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు మృతి

image

తణుకు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు(86) బుధవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొలినాళ్లలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ తరపున 1983లో పోటీ చేసి వెంకటేశ్వరరావు గెలుపొందారు. ఆ తర్వాత మళ్లీ పోటీ చేయలేదు. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఈయన మృతి పట్ల తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ముళ్ళపూడి వెంకటకృష్ణారావు సంతాపం తెలిపారు.

News March 5, 2025

కృష్ణా: ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్ల సంఖ్య ఇదే

image

ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించిన విషయంలో తెలిసిందే. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు వేసిన ఓట్లు కొన్ని చెల్లలేదు. మొత్తం 26, 679 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. ప్రతి రౌండ్‌లోనూ 2 వేలకు పైగా చెల్లని ఓట్లు పడినట్లు తెలిసింది. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్‌లో కూడా 55 ఓట్లు చెల్లలేదు.

News March 5, 2025

చిన్న వయసులోనే 175 సర్టిఫికెట్ కోర్సులు

image

కోనెంపాలెంకు చెందిన బండారు ప్రవల్లిక భీమిలి మండలం గొల్లలపాలెం KGBVలో 10వ తరగతి చదువుతుంది. ఈమె చిన్న వయసులోనే 175 సర్టిఫికెట్ కోర్సులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్ఫోసిస్ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫారంలో హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, ఎలక్ట్రానిక్స్,ఏఐ వంటి వివిధ సర్టిఫికెట్ కోర్సులు చేసిందని ప్రిన్సిపల్ గంగాకుమారి తెలిపారు. ఛైర్మన్ చందపరపు కుమార్, ఇతర సిబ్బంది చిన్నారిని అభినందించారు.

News March 5, 2025

అత్తిలి: స్నేహితుల మధ్య ఘర్షణ.. హత్య

image

అత్తిలి మండలం దంతుపల్లిలో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన జుత్తిగ వీరాంజనేయులు(35), కడలి వెంకటనారాయణ స్నేహితులు కాగా మంగళవారం కలిసి మద్యం తాగారు. ఈ సమయంలో ఇరువురి మధ్య ఘర్షణ జరగగా వీరాంజనేయులు తలపై వెంకటనారాయణ రాయితో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామ శివారులోని వీరాంజనేయులు మృతదేహం లభ్యం కావడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News March 5, 2025

తాటిచెట్లపాలెంలో ఇద్దరు మృతి

image

విశాఖలోని తాటిచెట్లపాలెం వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంచరపాలెం స్టేషన్ పరిధిలోని బైక్‌పై అతివేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు అదుపుతప్పి చెట్టుని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News March 5, 2025

ఐదు నెలల క్రితమే వివాహం.. ఇంతలోనే విషాదం 

image

కార్వేటినగరం(మం)లో విషాదం నెలకొంది. ఆళత్తూరు వాసి శ్రావణ్ తన ఫ్రెండ్ చెన్నకేశవులతో కలిసి ఓ పుట్టిన రోజు వేడుకకు కొల్లాంగుట్టకు బైకు మీద వెళ్లారు. తిరిగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న బైకును కొల్లాగుంట చెక్ పోస్ట్ సమీపంలో మరో బైకు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్రావణ్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నకేశవులు తీవ్రంగా గాయపడ్డాడు. శ్రావణ్‌కు ఐదు నెలల క్రితమే వివాహం కాగా.. ఆమె గర్భిణి. 

News March 5, 2025

చిత్తూరు: మారథాన్ విజేతగా సీఐ రామకృష్ణ

image

చంద్రగిరి కళ్యాణి డ్యాం PTCలో సీఐగా పనిచేస్తున్న రామకృష్ణ ఇటీవల ఢిల్లీలో జరిగిన మారథాన్‌లో 3:26:36 గంటల్లో 42.2 కిలోమీటర్ దూరాన్ని పూర్తిచేసి పథకాన్ని సాధించారు. ప్రస్తుతం ప్రతిష్ఠాత్మకమైన బోస్టన్ మారథాన్ (USA) సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈయన గతంలో చిత్తూరులో సీఐగా పనిచేసి పలు మారథాన్‌లలో పథకాలు సాధించారు. ఈ మేరకు ఆయనకు ఉన్నత అధికారుల అభినందనలు తెలిపారు. 

News March 5, 2025

ఈ నెల చివరి వరకు రైళ్లు తిరగవు..!

image

గుంతకల్లు మీదుగా ప్రయాణం సాగించే పలు ప్యాసింజర్ రైళ్లు కుంభమేళాకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తిరిగి ఆ రైళ్లు గుంతకల్లుకు చేరుకునేందుకు ఈ నెల చివరి వరకూ పడుతుందని అధికారులు పేర్కొన్నారు. తిరుపతి-కదిరిదేవరపల్లి (57405) ప్యాసింజర్ రద్దును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించామన్నారు. కదిరిదేవరపల్లి-తిరుపతి(57406) ఈనెల 31, గుంతకల్లు-తిరుపతి(57404) 30, తిరుపతి-గుంతకల్లు(57403) 31వ తేదీ వరకు తిరగవన్నారు.

News March 5, 2025

నిడమర్రు: ఆక్వా రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళలేక ఆక్వా రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిడమర్రు(M) గుణపర్రులో జరిగింది. గ్రామంలో రొయ్యలు చెరువు సాగు చేస్తున్న నిమ్మల శ్రీను సుమారు రూ.కోటి మేర నష్టపోయాడు. అప్పులు తీర్చలేనని మనోవేదనకు గురై విషం తాగాడు. ఆ తర్వాత సోదరుడికి ఫోన్ చేయడంతో బంధువులు గాలించి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 5, 2025

రాజాం: భోజనం చేసి కుప్పకూలిపోయిన యువకుడు

image

అకస్మాత్తుగా గుండె పోటుతో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. రాజాం మున్సిపాలిటీ పరిధిలో గాయత్రీ కాలనీకి చెందిన శ్రీనివాస్(30) భోజనం చేసిన కాసేపటికే కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యువకుడు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.