India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజానగరం నియోజకవర్గంలో ఈ నెల 12న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తారని కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ తెలిపారు. కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ధర్మవరం నియోజకవర్గంలో జి.నాగిరెడ్డి ప్రత్యేకస్థానంగా చెప్పవచ్చు. 1983 నుంచి 1989 వరకు వరుసగా మూడుసార్లు ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 ఎన్నికల్లో నియోజకవర్గ చరిత్రలోనే 40421అత్యధిక ఓట్ల మెజార్టీ, 1983లో 30605 రెండవ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన రికార్డు ఉంది. ఈ ఎన్నికలలో ధర్మవరంలో ఈ రికార్డును బద్దలు కొడతారా కామెంట్ చేయండి.
పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏసీ వ్యాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను కేజీహెచ్కి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా వాసులు మృతి చెందారు. టాటా ఏస్ వ్యాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను కేజీహెచ్కి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వరుస రాజీనామాలతో YCP సతమతం అవుతోంది. తనకు పార్టీలో అవమానం జరిగిందంటూ కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి YCPని వీడారు. తర్వాత ఆమె అడుగులు ఎటు వైపు అనేది తెలియాల్సి ఉంది. మరో YCP సీనియర్ నేత, రణస్థలం వ్యవసాయ సలహా మండలి సభ్యుడు పైడి శ్రీనివాసరావు పార్టీపై ధిక్కార స్వరం వినిపించారు. ఏకంగా ఎచ్చెర్ల ఇండిపెండెంట్ MLA అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించడం ప్రకంపనలు రేపుతోంది.
పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏసీ వ్యాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను కేజీహెచ్కి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పెద్దవడుగూరు మండలం భీమునిపల్లి శివారులోని కొండలో బుధవారం ఓ చిరుతపులి మృతి చెందింది. స్థానికులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని చిరుత మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం పశువైద్యశాలకు తరలించారు. అనారోగ్యం కారణంగా మృతి చెందిందా..? లేక ఇతర కారణాలవల్ల మృతి చెందిందా..? అనే కోణంలో విచారణ చేపట్టారు.
రోజు రోజుకు ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలను ఒంటి పూట నిర్వహించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఐసీడీఎస్ పీడీ హేనా సుజన్ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించాలని పీడీ ఆదేశించారు.
కొండాపురం మండలం కె.సుగుమంచిపల్లె చెక్ పోస్ట్ వద్ద బుధవారం సాయంత్రం పోలీసులు రూ.10 లక్షల నగదును సీజ్ చేశారు. తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా ఈ నగదును స్వాధీన పరచుకున్నారు. అనంతపురం నుంచి ప్రొద్దుటూరుకు కారులో ఓ మహిళ వెళుతుండగా ఆమె నుంచి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో అన్ని రకాల పింఛన్లకు సంబంధించి మొత్తం 3,21,662 మందికి సొమ్ము విడుదల చేశారు. బుధవారం 93,669 మందికి(29.12శాతం) పింఛన్ నగదు అందించారు. ఇంకా 2,27,993 మందికి డబ్బులను అందించాల్సి ఉంది. పింఛన్ల పంపిణీ ప్రాంతాల్లో టెంట్లు, నీటి వసతి సౌకర్యాలు లేకపోవడంతో లబ్ధిదారులు అసౌకర్యానికి గురయ్యారు.
Sorry, no posts matched your criteria.