India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు నగరం ములుముడి వీధికి చెందిన మూడేళ్ల బాలిక ఆరుబయట ఆడుకుంటూ కనిపించకుండా వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు చిన్న బజార్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్పీ చిన్న బజార్ సీఐ ఆదేశానుపారం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గంట వ్యవధిలోనే తప్పిపోయిన ఆ బాలికను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.
నెల్లూరు విద్యుత్ భవన్లోని స్కాడా బిల్డింగ్లో లైన్మెన్ దినోత్సవ వేడుకలను మంగళవారం రాత్రి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టౌన్ ఎం.శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ఎస్ఈ వి.విజయన్ మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థకు లైన్మెన్, సిబ్బంది ఫిల్లర్ లాంటి వారని కొనియాడారు. విద్యుత్ సిబ్బంది ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణ కోసం ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. 8న నగరంలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు సూచించారు.
జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మండల స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం తాగునీటి పరిస్థితి, MSME సర్వే, PGRS, రెవెన్యూ సర్వీస్లు, NREGS తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, RWS ఇంజినీర్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
కొండేపిలో బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థిని పి.కీర్తి APAMT మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ -2024లో స్టేట్ మొదటి ర్యాంక్ సాధించినట్లు ప్రిన్స్పల్ ఎస్.అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది నవంబర్ 30న 51వ రాష్ట్ర అసోషియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ అధ్వర్యంలో నిర్వహించగా గతవారం విడుదల చేసిన ఫలితాల్లో మొదటి స్థానం సాధించినట్లు చెప్పారు. కీర్తిని ఈసందర్భంగా ఉపాధ్యాయులు అభినందించారు.
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడించడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎత్తివేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసినట్లు విజయనగరం కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఇకపై అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.
మార్చి 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. గురజాడ కళాక్షేత్రం వేదికగా జరుగనున్న ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల తరఫున చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.
తూ.గో జిల్లా పరిధిలో చేపల వేట ద్వారా జీవనోధారంతో పాటు, పర్యటక అభివృద్ది పరంగా బోటింగ్, నది విహారం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. వీటికి సంబంధించిన నియమనిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. ఈ సమావేశంలో టూరిజం ఇన్ఛార్జ్ ప్రాంతీయ సంచాలకులు పవన్ కుమార్ అధికారులు పాల్గొన్నారు.
నియోజకవర్గాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా అధికారులతో కలిసి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ అధికారులతో నిర్వహించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా సెలవుపై వెళ్లిన సెక్రటేరియట్ సిబ్బంది సెలవులను సంబంధిత జిల్లా అధికారులు రెగ్యులరైజ్ చేయరాదన్నారు.
ఈనెల 7వ తేదీన గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో స్వర్ణ పంచాయితీ వెబ్ సైట్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ, కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.