Andhra Pradesh

News April 2, 2024

శ్రీకాకుళం: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

image

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని మన్యం జిల్లావాసిని హత్య చేసిన ఘటన ఒడిశాలోని పర్లాఖెముండిలో జరిగింది. గురండి పోలీసుల కథనం మేరకు.. భామిని మండలం బట్టిపురం గ్రామానికి చెందిన లింగరాజు(28), జయలక్ష్మి దంపతులు. ఆమెకు మన్యం జిల్లా బత్తిలికి చెందిన ఉపేంద్రతో వివాహేతర సంబంధం ఉంది. లింగరాజును గురువారం తన స్వగ్రామంలో జరిగిన వివాహానికి భార్య తీసుకెళ్లింది. పథకం ప్రకారం 53 సార్లు పొడిచి చంపారు.

News April 2, 2024

పెడన వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

పెడన-మచిలీపట్నం బైపాస్ రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. తోటమూల సెంటర్ నుంచి బైపాస్ రోడ్డులో AP39 TU 3126 నెంబర్ గల TVSపై మచిలీపట్నం వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 2, 2024

తాగునీటికి సమస్య ఉండకూడదు: కలెక్టర్

image

ప్రస్తుత వేసవిలో ఎక్కడా తాగునీటికి ఎటువంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ సిబ్బందికి ఆదేశించారు. తాగునీటి చెరువులను, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిస్థాయిలో నింపుకోవాలని, నీటి నిల్వలకు అనుగుణంగా వేసవి మొత్తం సరఫరాకు చేసేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. రానున్న రోజులలో వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలన్నారు.

News April 2, 2024

పెదకూరపాడులో 30 మంది వాలంటీర్లు రాజీనామా

image

మండల వ్యాప్తంగా సుమారు 30 మంది వాలంటీర్లు తమ వాలంటరీ పోస్టులకు రాజీనామా చేసినట్లు ఎంపీడీవో మల్లేశ్వరి తెలిపారు. మండల వ్యాప్తంగా సోమవారం పొడపాడు, హుస్సేనగరం, ముసాపురం, పెదకూరపాడు పరిసర ప్రాంతాల్లోని వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ వాలంటరీ పోస్ట్‌లకు రాజీనామా తెలిపినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని ఎలక్షన్ల సమయంలో అవ్వ తాతలకు అందించలేకపోయామనే బాధతో రాజీనామా చేస్తున్నామని తెలిపారు.

News April 2, 2024

శ్రీకాకుళం: 1210 మందితో పది మూల్యాంకనం

image

పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, సమీపంలోనే మహాలక్ష్మినగర్ కాలనీలో ఉన్న శ్రీచైతన్య పాఠశాల కేంద్రాలుగా స్పాట్ వాల్యుయేషన్ మొదలైంది. తొలిరోజు 7 సబ్జెక్టుల పేపర్ల మూల్యాంకనం చేపట్టారు. 1210 మంది హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సిబ్బంది మూల్యాంకనంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 8 రోజుల్లో పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.

News April 2, 2024

అన్న అన్నమయ్యలో.. చెల్లి కడపలో పర్యటన

image

ఇవాళ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్నారు. అలాగే వైఎస్ షర్మిల కడపలో పర్యటించనున్నారు. సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడితే.. షర్మిల కూడా ఇవాళ వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించి తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారో వెల్లడిస్తారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. షర్మిల కూడా ప్రచారాన్ని ఇడుపులపాయ నుంచే మొదలు పెట్టే అవకాశం ఉంది.

News April 2, 2024

కర్నూలు: రెండు ప్యాసింజర్ రైళ్లు రద్దు

image

గుంతకల్లు నుంచి కాచిగూడకు వెళ్లే ప్యాసింజర్ రైలు(07671) సోమవారం నుంచి రద్దైనట్లు డోన్ రైల్వే అధికారి తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు రద్దు చేసినట్లు చెప్పారు. కాచిగూడ నుంచి గుంతకల్లుకు వెళ్లే ప్యాసింజర్ రైలు (07670) మంగళవారం నుంచి మే ఒకటో తేదీ వరకు రద్దు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ డివిజన్‌లోని మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల్లో రైల్వే డబ్లింగ్ పనులు జరుగుతుండటంతో రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

News April 2, 2024

విశాఖ: ‘రేపటి నుంచి పింఛన్ల పంపిణీ’

image

సామాజిక పింఛన్లను ఈనెల మూడవ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి సామాజిక పింఛన్లు గ్రామ వార్డు సచివాలయాలు సిబ్బంది పంపిణీ చేస్తారని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వలంటీర్ల వద్ద ఉన్న ఫోన్లు బయోమెట్రిక్ పరికరాలను పంచాయతీ కార్యదర్శిలకు వెంటనే అందజేయాలన్నారు.

News April 2, 2024

ప.గో: ఎలక్షన్@2024.. పోలింగ్ శాతం పెరిగేనా..?

image

ఉమ్మడి ప.గో జిల్లాలో 2019లో పోలింగ్ శాతం ఇలా ఉంది. కొవ్వూరు-86.4%, నిడదవోలు-82.7%, ఆచంట-79.6%, పాలకొల్లు-82.2%, నరసాపురం-81.1%, భీమవరం-77.9%, ఉండి-84.7%, తణుకు-81.1%, తాడేపల్లిగూడెం-80.3%, ఉంగుటూరు-86.8%, దెందులూరు-84.8%, ఏలూరు-67.6%, గోపాలపురం-85.9%, పోలవరం-86.8%, చింతలపూడి-82.9% పోలింగ్ నమోదయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేందుకు జిల్లా అధికారులు చేపట్టిన చర్యలు ఎలా ఉన్నాయి.

News April 2, 2024

విజయవాడ: ప్రేమ పేరుతో యువతిపై అత్యాచారం

image

యువతిని ప్రేమ పేరుతో వంచించి ఆపై బెదిరించి అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై నున్న రూరల్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సుందరయ్య నగర్‌కు చెందిన యువతికి మునీంద్రా రెడ్డితో పరిచయం ఉంది. ప్రేమ పేరుతో అత్యాచారానికి పాల్పడ్డాడు. వారిద్దరూ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్ చేశారు.