Andhra Pradesh

News April 2, 2024

బైరెడ్డిపల్లి: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై డీఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఈశ్వర్ (33) అదే గ్రామానికి చెందిన బాలిక(17)ను ప్రేమ పేరుతో గత నెల 19న అపహరించాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో అప్పట్లో అదృశ్యం కేసు నమోదు చేశామని చెప్పారు. విచారణలో బాలికపై బలవంతంగా అత్యాచారం చేసినట్లు తెలిసిందన్నారు.

News April 2, 2024

అద్దంకి: చికిత్స పొందుతూ యువకుడు మృతి

image

అద్దంకి మండలం కుంకుపాడుకు చెందిన చెరుకుపల్లి శ్రీకాంత్ గత నెల 19వ తేదీన బైక్‌పై తాళ్లూరు వైపు వెళుతూ కిందపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలవ్వడంతో స్థానికులు 108లో ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ యువకుడు సోమవారం మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 2, 2024

ఉమ్మడి జిల్లాలో నిలకడగా వర్జీనియా పొగాకు ధర

image

ఉమ్మడి జిల్లాలో వర్జీనియా పొగాకు ధర నిలకడగా కొనసాగుతోంది. సోమవారం నాటికి 20 రోజులు వేలం నిర్వహించగా.. ఇప్పటి వరకూ ₹.50.24 కోట్ల విలువైన 21.10 లక్షల కిలోల పొగాకు కొనుగోలు చేశారు. దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం 1,2 పొగాకు వేలం కేంద్రాల్లో కిలో పొగాకు రూ.240తో వేలం ప్రారంభం కాగా.. ప్రస్తుతం కిలో గరిష్ట ధర రూ.241 పలుకుతోంది. అయితే ఇది గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు.

News April 2, 2024

గురజాల: ఒకప్పటి శత్రువులు ఇప్పుడు మిత్రులవుతున్నారు

image

గురజాలలో ఒకప్పుడు ఒకరిపై ఒకరు శాసనసభ్యులుగా పోటీ చేసిన ఎరపతినేని శ్రీనివాసరావు, జంగా కృష్ణమూర్తులు ఇప్పుడు మిత్రులు కాబోతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ జంగా ఎట్టకేలకు చంద్రబాబును కలిశారు. గురజాలలో జరిగే ప్రజాగళం బహిరంగ సభలో జంగాతో పాటు గురజాల నియోజకవర్గంలో ఆయన అనుచరులు వేలాదిమంది టీడీపీలో చేరనున్నారు. గురజాల వైసీపీ టికెట్ కోసం జంగా ప్రయత్నించగా.. కాసుకు జగన్ టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే.

News April 2, 2024

ఏలూరు: UPDATE.. ఆ ‘కిల్లర్ డాక్టర్’ అరెస్ట్

image

మత్తు ఇంజక్షన్స్ ఇస్తూ చోరీలకు అలవాటు పడి ఓ <<12965125>>వ్యక్తి ప్రాణం<<>> తీసిన వైద్యుడి బాగోతం తెలిసిందే. ఆ దొంగ డాక్టర్‌ అరెస్ట్ అయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సత్రంపాడుకు చెందిన కొవ్వూరి భానుసుందర్ MBBS చదువుతున్నప్పటి నుంచి బెట్టింగ్స్‌కు అలవాటు పడి అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు ఇలా మత్తు ఇంజక్షన్లు ఇస్తూ చోరీలకు పాల్పడుతున్నాడు. సోమవారం భానుసుందర్‌ను అరెస్టు చేసినట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.

News April 2, 2024

దారుణం.. దివ్యాంగురాలిపై అత్యాచారయత్నం

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓ నీచుడు దివ్యాంగురాలిపై అత్యాచారానికి యత్నించాడు. ఆత్రేయపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన దివ్యాంగురాలు(30) తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లగా ఒక్కతే ఇంట్లో ఉంది. సోమవారం అదే గ్రామానికి చెందిన అంజి అనే యువకుడు ఇంట్లోకి వెళ్లి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. కేకలు వేయడంతో పారిపోయాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చాక యువతి వారికి చెప్పడంతో ఆత్రేయపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News April 2, 2024

అన్నమయ్య: చిన్నారిని చితకబాదిన టీచర్

image

యూకేజీ చదువుతున్న చిన్నారిని టీచర్ చితకబాదిన ఘటన సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వెలుగు చూసింది. విద్యార్థి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పట్టణంలోని కురవంకలో ఉంటున్న మస్తాన్ కొడుకు మహమ్మద్ ఆలీ వారీస్ (6) సొసైటీ కాలనీలోని స్కూలులో చదువుతున్నాడు. సక్రమంగా చదవడం లేదని టీచర్ చితకబాదింది. తల్లిదండ్రులు బిడ్డ వంటిపై వాతలు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

News April 2, 2024

కర్నూలు: విద్యుత్ నియంత్రికలతో ఇబ్బందులు

image

కర్నూలులో సుమారు 1,900 విద్యుత్ నియంత్రికలు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో నియంత్రికలు తక్కువ ఎత్తులో ఉండటం, ఫ్యూజులకు రక్షణ కవచం లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సీతారాంనగర్ మార్కెట్ యార్డు సమీపంలోని ప్రధాన రహదారి అనుకుని విద్యుత్ నియంత్రిక ఉంది. దీనిచుట్టూ కంచె ఏర్పాటు చేయలేదు. నిత్యం వేలాది మంది ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

News April 2, 2024

బిట్రగుంట: SIకి జైలు శిక్ష

image

బోగోలుకు చెందిన వెంకటేశ్వరరావు గతంలో ఎస్సై వెంకటరమణ తీరుపై పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 2016 జూన్ 24న బిట్రగుంటలో టీ తాగుతుండగా ఎస్సై అకారణంగా కొట్టి మానవ హక్కులకు భంగం కలిగించారని బాధితుడు కోర్టును ఆశ్రయించారు. విచారణలో నేరం రుజువు కావడంతో ఎస్సై వెంకటరమణకు ఆరు నెలల జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కబర్థి తీర్పు చెప్పారు.

News April 2, 2024

ఈ నెల 9నుంచి దుర్గగుడి వసంత నవరాత్రోత్సవాలు

image

ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఈ నెల 9 నుంచి 18 వరకు, వసంత నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో రామారావు సోమవారం తెలిపారు. ఈ నెల 9న స్నపనాభిషేకం అనంతరం దుర్గమ్మ దర్శనానికి ఉదయం 8 గంటల నుంచి భక్తులను అనుమతిస్తారన్నారు. ఉదయం 8.15 గంటలకు లక్ష్మీగణపతి మందిరం వద్ద వసంత నవరాత్రోత్సవాలు కలశస్థాపన, అనంతరం దుర్గమ్మకు పుష్పార్చన ప్రారంభిస్తారన్నారు.