Andhra Pradesh

News April 1, 2024

విజయనగరం: డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ఆపార్టీ ఈసారి గెలుస్తుందా?

image

విజయనగరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 1978 నుంచి 2004 మినహా 2009 వరకు పి.అశోక్ గజపతిరాజు TDP నుంచి గెలుపొందారు. ఇక్కడ తొలిసారి 2019లో టీడీపీ అభ్యర్థి అదితి గజపతిరాజుపై కోలగట్ల వీరభద్ర స్వామి 6417 ఓట్ల మెజారిటీతో పోటీ చేసి YCP జెండా ఎగురవేశారు. ఈసారి కూడా YCP,TDP నుంచి వీరే బరిలో ఉన్నారు. మరి రానున్న 2024 ఎన్నికలలో 2019 ఫలితాలు రిపీట్ అవుతాయా.. లేదా? ..కామెంట్ చేయండి.

News April 1, 2024

టెక్కలి: పోక్సో కేసు నమోదు

image

తన కుమార్తెను ఓ వ్యక్తి వేధిస్తున్నారంటూ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి సీఐ పి. పైడయ్య ఆదివారం పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భగవాన్ పురం గ్రామానికి చెందిన మహిళా డిగ్రీ కాలేజ్ కళాశాల మైదానానికి బాలిక వచ్చి వెళ్తుండగా టెక్కలికి చెందిన యువకుడు వేధిస్తుండేవాడని, దీనిపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ పైడియ్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News April 1, 2024

ప.గో: లేగ దూడకు పుట్టినరోజు వేడుకలు

image

ప.గో జిల్లాలో ఓ రైతు లేగ దూడ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిపారు. పాలకోడేరు మండలం గోరగనమూడికి చెందిన రైతు పంపన రామకృష్ణకు చెందిన లేగ దూడ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఆయన గ్రామంలోని పెద్దలను పిలిచి వారి సమక్షంలో కేక్ కట్ చేశారు. వారందరికీ పంచి పెట్టారు. ఆవు దూడ నా బిడ్డ లాంటిదని రామకృష్ణ తెలిపారు. విస్సకోడేరు సర్పంచ్ బొల్ల శ్రీనివాస్, గొరగనమూడి మాజీ సర్పంచ్ పాపారావు తదితరులు పాల్గొన్నారు.

News April 1, 2024

రాజోలు: 578 ఓట్ల తేడాతో MLA అయ్యాడు!

image

రాజోలులో 1952-2019 వరకు 15సార్లు ఎన్నికలు జరిగితే.. 3సార్లు అతి తక్కువ ఓట్ల తేడాతో MLA పీఠం దక్కించుకున్నారు. 1989లో ఎం.గంగయ్య(కాంగ్రెస్‘ఐ’) AVS నారాయణరాజు(TDP)పై 611 ఓట్ల తేడాతో గెలవగా.. 1999లో AVS నారాయణరాజు(TDP) ఏ.కృష్ణంరాజు(కాంగ్రెస్‘ఐ’)పై 578 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019లో జనసేన నుంచి బరిలో దిగిన రాపాక బి.రాజేశ్వరరావు(వైసీపీ)పై 814 ఓట్ల తేడాతో గెలిచినా.. ఆయన తర్వాత వైసీపీలో చేరారు.

News April 1, 2024

రాజంపేట: టిప్పర్, ఆటో ఢీ.. ఒకరు మృతి

image

రాజంపేట మండలం పోలి గ్రామం సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్, ఆటో ఢీకొన్న ఘటనలో వెంకటలక్ష్మి (40) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 1, 2024

నేడు కదిరిలో పర్యటించనున్న సీఎం జగన్

image

కదిరిలో సోమవారం సీఎం జగన్ పర్యటించనున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా
నేటి సాయంత్రం పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, ముస్లి సోదరులు పాల్గొనాలని కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్ కోరారు. అనంతరం పార్టీలో మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాష జగన్ సమక్షంలో చేరనున్నారు.

News April 1, 2024

YCP తొలి MLA ప్రసన్న కుమార్..!

image

కాంగ్రెస్‌తో విభేదించిన జగన్ YCPని స్థాపించారు. అదే పార్టీ నుంచి జగన్ కంటే ముందే నెల్లూరులో ఒకరు MLAగా గెలిచారు. ఆయనే ప్రసన్న కుమార్ రెడ్డి. 2009లో TDP కోవూరు MLAగా గెలిచిన ఆయన జగన్ పార్టీలో చేరారు. దీంతో 2012 మార్చిలో ఉప ఎన్నిక జరగ్గా YCP తొలి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జూన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో YCP నెల్లూరు MPగా మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు మరో 14 మంది వైసీపీ MLAలుగా గెలిచారు.

News April 1, 2024

ప్రకాశం జిల్లాలో 83 ఓట్లతో గెలిచిన MLA ఎవరో తెలుసా?

image

మార్కాపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో కే.ఎల్.పి అభ్యర్థి రామారెడ్డి 5199 ఓట్లతో గెలుపొందారు. 1978 ఎన్నికల్లో సీపీఐ నుంచి పూలసుబ్బయ్య కేవలం 83 ఓట్ల తేడాతో వి.వి నారాయణ రెడ్డి (జనతా)పై గెలుపొందారు. దీంతో జిల్లాలో తక్కువ ఓట్లతో ఓడిన, గెలిచిన వ్యక్తులుగా వీరిద్దరూ నిలిచారు.

News April 1, 2024

మద్యం మత్తులో కొడుకుని హత్య చేసిన తండ్రి

image

పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధి క్రిస్టియన్ పేటకు చెందిన తవనం మోజెస్(29) తండ్రి కవిరాజు చేతిలో హత్యకు గురయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి తండ్రీ కుమారుడు మద్యం మత్తులో గొడవ పడ్డారు. ఆ సమయంలో తండ్రి కోపంతో అందుబాటులో ఉన్న మంచం కోడుతో దాడి చేశాడు. ఈ సంఘటనలో మోజేస్ అక్కడే ప్రాణాలు విడిచాడు. మోజేస్‌కు వివాహం కాలేదు. సీఐ రమేష్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 1, 2024

తిరుపతి: గుండెపోటుతో విద్యార్థి మృతి

image

తిరుపతి జిల్లాలో విషాదం నెలకొంది. చంద్రగిరి నియోజకర్గం రామచంద్రపురం మండలం కొత్త వేపకుప్పం గ్రామానికి చెందిన మణి కుమారుడు బాలు గుండెపోటుతో చనిపోయాడు. విద్యార్థి నిన్న రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తిరుపతిలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యమలో చనిపోయాడు.