Andhra Pradesh

News March 4, 2025

ఎన్నికల కోడ్ ఎత్తివేత: కలెక్టర్ అంబేడ్కర్

image

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డించ‌డంతో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి ఎత్తివేస్తూ ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాలు జారీచేసిన‌ట్లు విజయనగరం క‌లెక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఇకపై అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.

News March 4, 2025

EVM అయినా.. బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే: లోకేశ్ 

image

EVM అయినా.. బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే అని మంత్రి లోకేశ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 9 నెలల్లో అధికారంలోకి రావడమైనా, 9 నెలల్లో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించినా ఒక్క టీడీపీకే సాధ్యమని అన్నారు. ఈ విజయం ఒక చరిత్ర అని అభివర్ణించారు. 

News March 4, 2025

SKLM: నియోజకవర్గాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయండి

image

నియోజకవర్గాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా అధికారులతో కలిసి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ అధికారులతో నిర్వహించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా సెలవుపై వెళ్లిన సెక్రటేరియట్ సిబ్బంది సెలవులను సంబంధిత జిల్లా అధికారులు రెగ్యులరైజ్ చేయరాదన్నారు.

News March 4, 2025

కృష్ణా: తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

రానున్న వేసవిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్, ఇరిగేషన్, ఐసీడీఎస్ తదితర శాఖల అధికారులతో వేసవిలో తాగునీటి సమస్యకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 

News March 4, 2025

దేశం కోసం ప్రకాశం జిల్లా వాసి ప్రయత్నం!

image

ఒక నినాదం కోసం వేల మైళ్లు సైకిల్ యాత్ర చేపట్టాడు ప్రకాశం జిల్లా వాసి. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ అంటూ రుద్రవరం వాసి సుభాశ్ చంద్రబోస్ ప్రజలను చైతన్య పరుస్తున్నాడు. ఏకంగా 50 వేల కి.మీ యాత్రలో భాగంగా 28 రాష్ట్రాలను చుట్టేశాడు. 41,223 కి.మీ సైకిల్ తొక్కి విశాఖ చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆయన చొరవతో రాష్ట్రపతికి ‘ఫ్యూచర్ ఆఫ్ ఇండియా’ డాక్యుమెంటరీ అందజేయడం తన లక్ష్యమంటున్నాడీ కుర్రాడు.

News March 4, 2025

VZM: ఇంటర్ పరీక్షకు 922 మంది గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ పరీక్షను 22,114 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 21,192 మంది హాజరయ్యారని రీజనల్ ఇన్‌స్పెక్టర్ మజ్జి ఆదినారాయణ తెలిపారు. మొత్తం 922 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 90 మంది ఇన్విజిలేటర్లు, 6 సిట్టింగ్ స్క్వాడ్‌లు, 3 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు నియమించారు. జిల్లాలో ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆయన చెప్పారు.

News March 4, 2025

నెల్లూరు: ఇంటర్ పరీక్షకు 921 మంది గైర్హాజరు

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లిష్ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా జరిగినట్లు ఆర్‌ఐవో డాక్టర్ ఎ.శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం 79 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 27,613 మంది విద్యార్థులకుగాను 26,893 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 921 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్‌లో 1394 మంది విద్యార్థులకు 164 మంది విద్యార్థులు గైర్హజరయ్యారని ఆర్‌ఐవో తెలిపారు.

News March 4, 2025

తూ.గో: ఇంటర్ పరీక్షకు 23,655 మంది విద్యార్థుల హాజరు

image

తూ.గో జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్-1 పరీక్షకు 23,655 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆర్‌ఐఓ ఎల్ నరసింహం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 51 కేంద్రాలలో ఈ పరీక్షను నిర్వహించగా జనరల్, ఒకేషనల్ విభాగాల్లో 795 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఆర్‌ఐఓ, డీవీఈఓ, ఫ్లయింగ్, సెన్సింగ్ స్క్వాడ్లు, కస్టోడియన్లు ఈ పరీక్షలను పర్యవేక్షించారన్నారు.

News March 4, 2025

SKLM: కంటి వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

image

గ్రామ స్థాయిలో కంటి వ్యాధులపై ఆప్తాల్మీక్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య DM&HO టీవీ బాలమురళీకృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా DM&HO కార్యాలయంలో ఆప్తాల్మిక్ అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ప్రతి ఒక్క ఆప్తాలమిక్ అధికారి వారి పరిధిలో ఎన్జీవో ఆసుపత్రి వారు నిర్వహించే క్యాటరాక్ట్ క్యాంపులను సందర్శించి అంధత్వంతో బాధపడుతున్న వారికి రిఫర్ చేయాలన్నారు.

News March 4, 2025

అంగన్వాడీల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం

image

పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతూ జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణికి అంగన్వాడీలు వినతి పత్రాన్ని మంగళవారం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 42 గంటల్లో సమస్యలు పరిష్కరించాలన్నారు. 10వ తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.