India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తన పర్యటన సందర్భంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడంపై ఎస్పీ దామోదర్ను డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేకంగా అభినందించారు. మార్కాపురం పర్యటన అనంతరం హెలిప్యాడ్ వద్ద ఎస్పీని పవన్ ప్రత్యేకంగా షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. అలాగే జిల్లాలో శాంతి భద్రతల స్థితిగతులు సైతం మెరుగ్గా ఉన్నాయని పవన్ చెప్పడం విశేషం.
భీమవరం పట్టణంలో చెత్త నిర్మూలనకు ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో పారిశుద్ధ్యానికి తీసుకోవలసిన చర్యలపై భీమవరం ఆర్డీవో మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. పారిశుద్ధ్యం మెరుగుదలకు ఎన్ని చర్యలు చేపట్టినా నామ్ కే వాస్తే అనే చందంగా ఉందని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.
పీఎం ఫసల్ బీమా యోజన సార్వా పంటకు నమోదు ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైందని DAO ఎస్ మాధవరావు తెలిపారు. జిల్లాలో వరి, మినుము, అరటిపంటను నోటిఫై చేసినట్లు వివరించారు. వరి ఎకరాకు రూ.570, మినుము రూ.300, అరటి ఎకరాకు రూ.3వేల చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉందన్నారు. ఆగస్టు 15 వరకు మినుము, ఈనెల 15లోపు అరటి పంటకు ప్రీమియం చెల్లించాల్సి ఉందన్నారు. రైతులు ఈ-క్రాఫ్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు.
జిల్లాలో 75,556 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. 181 కుటుంబాల్ని దత్తత తీసుకున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జులై 15లోగా మిగతా కుటుంబాలకు దత్తత లక్ష్యాన్ని సాధించేందుకు చర్యలు ముమ్మరం చేస్తామని అన్నారు. పాతపట్నంలో అత్యధికంగా నమోదయ్యారన్నారు.
విశాఖలో ఆభరణాల వ్యాపారులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (B.I.S.) హాల్ మార్కింగ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. నిబంధనలు గురించి ఆభరణాల వ్యాపారులకు వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చిక్కుడు తప్పవని B.I.S. దక్షిణ ప్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ ఖన్నా హెచ్చరించారు. B.I.S. కేర్ మొబైల్ యాప్ గురించి వివరించారు. విశాఖ నుంచి 100 మంది గోల్డ్ వ్యాపారులు హాజరయ్యారు.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది కంటే ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గడం ఆందోళన కలిగించే విషయమని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జడ్పీ సర్వ సభ్య సమావేశంలో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఒక్క మెరకముడిదాం మండలంలోనే 1100 మంది విద్యార్థులు తగ్గిపోయారని, జిల్లాలో చూస్తే ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటుందన్నారు. పాఠశాలల అభివృద్ధికి నిధులు ఎప్పుడు కేటాయిస్తారని ప్రశ్నించారు.
గత ఏడాది కన్నా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల నమోదు తగ్గుదలపై శాస్త్రీయంగా విశ్లేషణ జరగాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జడ్పీ సర్వసభ్య సమావేశంలో శుక్రవారం జరిగిన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిపైన సుమారు రూ.70 వేలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని, అయినప్పటికీ నమోదు తగ్గడానికి గల కారణాలను విశ్లేషించుకోవాలన్నారు. విద్యార్థుల తగ్గుదలపై కారణాలు గుర్తించాలని డీఈఓకు ఆదేశించారు.
జీవితంలో ఒక ఉన్నత లక్ష్యం ఎంచుకొని దానికి అనుగుణంగా కష్టపడి సాధన చేసి అక్కడికి చేరుకోవాలని కలెక్టర్ బాలాజీ పిల్లలకు ఉద్బోధించారు. కలెక్టరేట్లో PM కేర్ పథకం కింద కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి గుర్తించిన పిల్లలతో కలెక్టర్ శుక్రవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి బాగోగులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
విజయనగరం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రెండు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. ప్రిన్సిపల్ డాక్టర్ పద్మ లీల మాట్లాడుతూ.. ఎంబీబీఎస్ విద్యార్థులకు నైపుణ్యాల ఆధారిత వైద్య విద్యను బోధించేందుకు అధ్యాపకులను సిద్ధం చేయడమే లక్ష్యంగా శిక్షణ తరగతులు కొనసాగాయన్నారు. విభిన్న విభాగాలకు చెందిన 30 మంది అధ్యాపకులచే శిక్షణ కొనసాగిందన్నారు.
* నరసన్నపేట: టైర్ పేలి విద్యార్థుల ఆటో బోల్తా
* జిల్లాలో అల్లూరి జయంతి
* శ్రీకాకుళం, ఎల్.ఎన్ పేట, పొందూరు, రణస్థలంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు
* ఆమదాలవలస: రైలు ఢీకొని వ్యక్తి మృతి
* హిరమండలం: నిండు కుండల వంశధార నది
* అక్రమ సంబంధం రెండు హత్యలకు దారితీసింది: డీఎస్పీ
* టెక్కలి: విద్యుత్ మీటర్ల సమస్యతో తల్లికి వందనం ఇబ్బందులు
* సారవకోట: అంగన్వాడీ కార్యకర్తల ధర్నా నోటీసు
Sorry, no posts matched your criteria.