Andhra Pradesh

News October 2, 2024

అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇవ్వండి: ప్రకాశం కలెక్టర్

image

రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం పిలుపునిచ్చారు. ఆ దిశగా స్వర్ణాంధ్ర- 2047 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో ప్రజలు పాల్గొనాలని సూచించారు. “https://swarnandhra.ap.gov.in” వెబ్సైట్ ఓపెన్ చేసి పేరు, వయస్సు, జిల్లా తదితర వివరాలను పూర్తిచేసిన తర్వాత వచ్చే 11 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

News October 2, 2024

కాస్త ఓపిక పట్టు కేతిరెడ్డీ.. నీ గుట్టు విప్పుతా: మంత్రి సత్యకుమార్ యాదవ్

image

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన విమర్శలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న సామెత మీకు సరిగ్గా వర్తిస్తుంది కేటురెడ్డీ.. కబ్జా కమీషన్, కలెక్షన్ కరప్షన్లకు కేరాఫ్ అడ్రస్ నువ్వు. కమీషన్లు లేక మైండ్ బ్లాక్ అయినట్లు ఉంది. కాస్త ఓపిక పట్టు నీ దారుణాలు గుట్టు విప్పుతా’ అంటూ ఘాటుగా స్పందించారు.

News October 2, 2024

ఇంద్రకీలాద్రిపై అంతరాలయ దర్శనాలు ర‌ద్దు చేశాం: EO

image

విజయవాడ ఇంద్రకీలాద్రిపై గురువారం నుంచి ద‌స‌రా ఉత్స‌వాలు ప్రారంభిస్తున్నామని ఆలయ EO కెఎస్ రామారావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఉత్స‌వాలు ముగిసే వ‌ర‌కూ అంతరాలయ దర్శనాలు ర‌ద్దు చేశామన్నారు. ఉత్స‌వాల‌కు 15 లక్షల‌ మంది వ‌ర‌కూ వ‌స్తార‌ని అంచ‌నా వేశామన్నారు. శరన్నవరాత్రులలో ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు చండీయాగం నిర్వహిస్తామన్నారు.

News October 2, 2024

విజయవాడ దసరా ఉత్సవాలకు గవర్నర్‌కు ఆహ్వానం

image

ఇంద్రకీలాద్రిపై జరిగే కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి, శ్రీశైల భ్రమరాంబికా దేవి నవరాత్రి ఉత్సవాలకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం గవర్నర్ కార్యాలయమైన రాజ్‌భవన్‌కు మంత్రి ఆనం, వేదపండితులతో చేరుకుని అమ్మవార్ల చిత్రపటం, ప్రసాదం ఇచ్చి గవర్నర్‌కు శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికలను అందజేశారు.

News October 2, 2024

బాలినేని సైలెంట్‌కు కారణం అదేనా..?

image

ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. జనసేన గూటికి చేరిన తర్వాత ఒంగోలుకు వచ్చిన బాలినేనికి ఆ పార్టీ నాయకులు కలిసి మద్దతు పలికారు. జనసేనలోకి భారీ చేరికలు ఉంటాయని బాలినేని అప్పుడు ప్రకటించినా.. సైలెంట్ అయ్యారు. పవన్ దీక్షలో ఉండటంతోనే బాలినేని సైలెంట్ అయ్యారని.. తెర వెనుక పక్కా ప్లాన్‌తో చేరికలపై అడుగులు వేస్తున్నట్లు చర్చ సాగుతోంది.

News October 2, 2024

శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సిద్ధం: కేంద్ర మంత్రి

image

శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం పాతపట్నంలో పీఎం జన్మాన్ వసతిగృహ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తిచేస్తామన్నారు.

News October 2, 2024

చుండూరు: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

image

గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సంఘటన చుండూరు రైల్వే స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. తెనాలి నుంచి చుండూరు మధ్య గల రైల్వే పట్టాలపై గూడ్స్ రైలు వెనక ఉన్న బ్రేక్ వ్యాన్ పట్టాలు తప్పడంతో రైలును నిలిపివేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News October 2, 2024

ఎన్నికల హామీలకు తూట్లు పొడుస్తున్నారు: మాజీ ఎంపీ భరత్

image

ప్రజల్లో ఎన్నో ఆశలు రేపి కూటమి అధికారంలోకి వచ్చిందని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ పేర్కొన్నారు. కానీ ఎన్నికల హామీలకు తూట్లు పొడుస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రిలో గాంధీ విగ్రహానికి ఆయన వినతిపత్రం ఇచ్చారు. అమ్మకు సున్నం.. నాన్నకు మద్యం.. అన్న విధంగా ప్రభుత్వ తీరు ఉందన్నారు. నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటాయన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు కావడం లేదని మండిపడ్డారు

News October 2, 2024

కడప: కేంద్ర కారాగారాన్ని సందర్శించిన కలెక్టర్

image

కడప జిల్లా కేంద్ర కారాగారాన్ని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ సందర్శించారు. గాంధీ జయంతి పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. జైలు జీవితం గడుపుతున్న ప్రతి ఒక్కరూ క్షణిక ఆవేశంలో తప్పులు చేసి ఉంటారని అన్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. జైలు జీవితం గడిపేవారు విడుదల అయిన తర్వాత మంచి జీవితాన్ని గడపాలని సూచించారు.

News October 2, 2024

రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

రాప్తాడు నియోజకవర్గం కక్కలపల్లి కాలనీలో ఉన్న నడిమి వంకను కలెక్టర్ వినోద్ కుమార్, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే పరిటాల సునీత.. అధికారులతో కలిసి పరిశీలించారు. వంకకు రెండువైపులా ఉన్న ఆదర్శ నగర్‌తో పాటు సుమారు 8 కాలనీల ప్రజలు వరదల సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే వివరించారు. రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.