Andhra Pradesh

News March 4, 2025

ఆటో డ్రైవర్ కూతురికి ఎస్ఐ ఉద్యోగం

image

బేతంచెర్లకు చెందిన శేషాద్రి, నాగలక్ష్మి దంపతుల కుమార్తె నిర్మల ఎస్ఐగా ఎంపికయ్యారు. శేషాద్రికి ఐదుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్న శేషాద్రి.. తన మూడో కుమార్తె నిర్మలను బీటెక్ వరకు చదివించారు. ఎస్ఐగా ఎంపికై అనంతపురం పోలీస్ శిక్షణ కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకుని శ్రీ సత్యసాయి జిల్లాలో పోస్టింగ్ పొందారు. ఈ సందర్భంగా పలువురు నిర్మలను అభినందించారు.

News March 4, 2025

GNT: పాము కాటుకు యువకుడు బలి

image

కూలి పనికి వెళ్లిన యువకుడు పాముకాటుతో మృతి చెందాడు. మండలంలోని శృంగవరప్పాడు గ్రామానికి చెందిన జయమంగళ జాన్ పదో తరగతి పూర్తి చేశాడు. గుంటూరు(D) అమరావతిలో చేపల పట్టుబడికి ఆదివారం సాయంత్రం 11 మంది గ్రామస్థులతోపాటు మత్స్యకార కూలీగా అతనూ వెళ్లాడు. వీరంతా అర్ధరాత్రి సమయంలో అక్కడకు చేరుకోవడంతో పాకలో నిద్రపోయారు. నిద్రలో ఉన్న జాన్‌ను విషసర్పం కాటు వేసింది. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News March 4, 2025

కార్వేటినగరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

కార్వేటినగరం మండలం పళ్లిపట్టు మూడు రోడ్ల కూడలి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళత్తూరుకు చెందిన శ్రావణ్ కుమార్, చెన్నకేశవ అనే ఇద్దరు బర్త్‌ డే పార్టీకి వెళ్లి తిరిగి కార్వేటినగరం నుంచి బైక్‌పై వస్తూ డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ఘటనలో శ్రావణ్ కుమార్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. చెన్నకేశవ పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 4, 2025

నెల్లూరు: ధైర్య సాహసాల పోలీస్ అధికారి ఇక లేరు

image

పోలీస్ విధి నిర్వహణలో ధైర్య సాహసాలు, నిజాయితీ గల విశ్రాంత అడిషనల్ ఎస్పీ భోగాది పృథ్వీ నారాయణ తుది శ్వాస వదిలారు. గతంలో నెల్లూరు నగర సీఐగా పనిచేశారని పోలీస్ సంఘం నాయకులు శ్రీహరి తెలిపారు. విధి నిర్వహణలో నిజాయితీపరుడని, ధైర్య సాహసాలు కలిగిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఆయన మరణం వారి కుటుంబానికి తీరని లోటని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

News March 4, 2025

ఈనెల 8న మార్కాపురం రానున్న చంద్రబాబు

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ఈనెల 8న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం రానున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన సమాచారం జిల్లా కలెక్టరేట్‌కి అందింది. ఈ నేపథ్యంలో మంగళవారం పూర్తి వివరాలు అందనున్నాయి. అయితే గత సంవత్సరం కూడా ఈ వేడుకలను చంద్రబాబు మార్కాపురంలో నిర్వహించిన విషయం తెలిసిందే. దరిమడుగు లేదా ఎస్వీకేపి కళాశాలలో కానీ భారీ బహిరంగ సభ పెట్టే అవకాశం ఉంది.

News March 4, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎవరికి ఎన్ని ఓట్లంటే(పార్ట్-1)

image

◆ఆలపాటి రాజా(1,45,057)గెలుపు
◆ఉమర్ బాషా షేక్-564
◆కనకం శ్రీనివాసరావు-348
◆అన్నవరపు ఆనంద కిషోర్-860
◆ అరిగల. శివరామ ప్రసాద్ రాజా-579 ◆అహమ్మద్ షేక్-335
◆యమ్మీల వినయ్ కుమార్ తంబి-120
◆కండుల వెంకట రావ్-299
◆గునుకుల వెంకటేశ్వర్లు-34
◆ గుమ్మా శ్రీనివాస్ యాదవ్-522
◆ గౌతుకట్ల అంకమ్మరావు-26
◆గంగోలు శామ్యూల్-321
◆గంట మమత-718

News March 4, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎవరికి ఎన్నిఓట్లంటే(పార్ట్-2)

image

◆కె.ఎస్. లక్ష్మణరావు-62,737
◆జూపూడి సామ్ ప్రసాద్-642
◆దారా విక్రమ్-400
◆దీపక్ పులుగు-49
◆దుక్కిపాటి రాధాకృష్ణ-41
◆మురకొండ చంద్రశేఖర్-53
◆యార్లగడ్డ శోభారాణి-95
◆ఎండ్రెడ్డి శివారెడ్డి-108
◆డాక్టర్ రామకోటయ్య మద్దుమల-129
◆లగడపాటి వేణుగోపాల్-210
◆శారదా తిరువీధుల-291
◆సత్య బాల సుందర రామ శర్మ చుండూరు-327
చెల్లని ఓట్లు-26,909
మొత్తం ఓట్లు-2,41,774

News March 4, 2025

ఉత్తరాంధ్ర టీచర్ల MLC.. ఎవరికి ఎన్ని ఓట్లంటే..? 

image

➤ గాదె శ్రీనివాసులు నాయుడు: 12,035(గెలుపు)
➤ పాకలపాటి రఘువర్మ : 8,527
➤ కోరెడ్ల విజయ గౌరీ : 5,900
➤ నూకల సూర్యప్రకాశ్ : 89
➤ పోతల దుర్గారావు : 68
➤ సుంకర శ్రీనివాసరావు : 39
➤ రాయల సత్యనారాయణ : 32
➤ కోసూరు రాధాకృష్ణ : 31
➤ సత్తలూరి శ్రీరంగ పద్మావతి : 15
➤ పెదపెంకి శివప్రసాద్ : 15
➤ ఇన్ వ్యాలీడ్ : 656

News March 4, 2025

తక్కువ పేదరికం ఉన్న జిల్లాలో చిత్తూరుకు ఐదో స్థానం

image

సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం రాష్ట్రంలోనే ఉమ్మడి చిత్తూరు (39 శాతం) జిల్లా తక్కువ పేదరికం ఉన్న జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. అలాగే అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంది. ఆ తర్వాత కడప, గుంటూరు, కృష్ణ జిల్లాలు నిలిచాయి. గిరిజనులు నివసించే అన్ని ప్రాంతాల్లో పేదరికం ఉన్నట్లు తెలిపింది.

News March 4, 2025

అత్యంత పేదరిక జిల్లాల్లో ప్రకాశం జిల్లాకు 4వ స్థానం

image

సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోనే అత్యంత పేద జిల్లాల లిస్ట్‌లో ప్రకాశం జిల్లా 4వ స్థానంలో ఉంది. ఈ జిల్లా హెడ్‌కౌంట్ రేషియో 6.28%గా ఉండగా.. తీవ్రత విషయంలో 43.60%గా ఉంది. MPB స్కోర్ యాత్రం 0.027గా ఉంది. అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాల్లో ఉమ్మడి ప.గో జిల్లా మొదట ఉంది. ఆ తర్వాత గుంటూరు, కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, తూ.గో, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి.