India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కరోనా నాటు మందు సృష్టికర్త బోనిగి ఆనందయ్య మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు అతని అనుచరులు కూడా టీడీపీలో చేరారు. ఆనందయ్య వైసీపీ ఎంపీటీసీగా ఉన్నారు. ఆనందయ్య టీడీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.
గాజువాక ఆటోనగర్లో విషాదం చోటుచేసుకుంది. ఆటోనగర్ ఎస్ బ్లాక్లో టీపీఎల్ ప్లాస్టిక్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ గణేష్ (31) నేలబావిలో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందాడు. ఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
అనంత: ఎన్నికల విధులు నుంచి 431 మంది ఉద్యోగులకు మినహాయింపునిచ్చారు. విధులు కేటాయించిన ఉద్యోగుల్లో గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలున్న వారికి మినహాయింపునకు అవకాశం కల్పించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాలో ఎన్నికల విధులకు 581 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా.. విచారణకు 372 మంది గైర్హాజయ్యారు. హాజరైన 209 మందిలో 186 మందికి మినహాయింపు ఇచ్చారు.
తూ.గో. జిల్లా జగ్గంపేట నియోజకవర్గ సీనియర్ రాజకీయ నాయకులు తుమ్మలపల్లి రమేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తుమ్మలపల్లి గతంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిగా పలుమార్లు పోటీలో నిలిచారు. కాగా ఈ నెల 30వ తేదీన పిఠాపురంలో పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలిపారు.
వైసీపీపై నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ కీలక ఆరోపణలు చేశారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యేగా తన హక్కులను ఇతరులకు బదిలీ చేస్తామన్నారు. తనను స్టిక్కర్ ఎమ్మెల్యేగా ఉండమన్నారు. దీంతో గెలిచిన 4 నెలలకే రాజీనామా చేద్దామనే భావన వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరా’ అని వెల్లడించారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రస్తుత ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగుతున్న అభ్యర్థులే ఎక్కువ మంది ఉన్నారు. వీరితో పాటు సీనియర్ నాయకులూ పోటీ పడబోతున్నారు. వీరందరిలో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి. ఆయన 1983లోనే తొలిసారి నెల్లూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గాల్లో మంత్రిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో ఆయన ఆత్మకూరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు.
ఎచ్చెర్ల కూటమి సీటు ఇంకా కేటాయించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. 2014లో YCP అభ్యర్థి జి.కిరణ్ కుమార్పై,TDP అభ్యర్థి కళావెంకట్రావు గెలుపొందారు. 2019లో కూడా వీరే ప్రత్యర్థులుగా ఉండగా ఈసారి TDPపైYCP జెండా ఎగిరింది. 2024 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు YCP నుంచి గొర్ల కిరణ్ కుమార్ను అధిష్ఠానం బరిలో దింపింది. మరి కూటమి నుంచి ఎవరు పోటీ ఇస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
తాడేపల్లిగూడెంలోని నిట్ కళాశాలలో భౌతికశాస్త్ర ఆచార్యుడిగా పనిచేస్తున్న మాచవరపు రాముడు చేసిన పరిశోధనకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ‘స్పింట్రానిక్ అనువర్తనాలకు మాంగనీస్ ఆధారిత యాంటీఫేరో మ్యాగ్నెంట్ హ్యుస్లర్’ పదార్థాల అభివృద్ధిపై విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. దీనికి గాను జాతీయస్థాయి గుర్తింపు రావడంతో భారత ప్రభుత్వ ఆధీనంలోని సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డు రూ.25లక్షలు కేటాయించింది.
రాజంపేట-తిరుపతి జాతీయ రహదారి పైన బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగిన <<12933916>>విషయం తెలిసిందే.<<>> ఊటుకూరు సమీపంలోని అశోకా గార్డెన్స్ వద్ద లారీ బైకును ఢీ కొట్టింది. ఈ ఘటనలో చిట్వేలి మండలం, వడ్డిపల్లెకు చెందిన యువకుడు హరి మృతి చెందగా, శ్రీలేఖ చికిత్స పొందుతుంది. ప్రమాదానికి గురైన వీరికి మూడు నెలల కిందటే ప్రేమ వివాహం జరిగింది. ఘటనపై పోలీసులు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఒంగోలులో ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు రూ.1,79,95,000 నగదు, 214 గ్రాముల బంగారం, 1,872 లీటర్ల అక్రమ మద్యం, 80.3 గ్రాముల మాదకద్రవ్యాలలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.