India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం.. అత్యంత పేద జిల్లాల లిస్ట్లో YSR జిల్లా 12వ స్థానంలో ఉంది. ఈ జిల్లా హెడ్కౌంట్ రేషియో 3.34%గా ఉండగా.. తీవ్రత విషయంలో 38.51%గా ఉంది. MPB స్కోర్ యాత్రం 0.013గా ఉంది. అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొదట ఉంది. గుంటూరు, కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి.
వెంకటాచలం మండలం జోసఫ్ పేట వద్ద సర్వేపల్లి రిజర్వాయర్లో బాగా ఉబ్బిపోయిన మహిళ మృతదేహం లభ్యమైంది. పది రోజుల కిందట గొలగమూడి సమీపంలోని సర్వేపల్లి కాలువలో కొట్టుకు వచ్చిన సుమారు 35 ఏళ్ల మహిళా మృతదేహంగా గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పది రోజులుగా మహిళ మృతదేహం కోసం సర్వేపల్లి కాలువ, రిజర్వాయర్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి 48,923 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకు 16,806 ఓట్లు పోలయ్యాయి. 28 టేబుళ్లలో 3వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి 76,345 ఓట్లు చెల్లినవి కాగా, 7,655 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. రాజశేఖరం, వీర రాఘవులు మధ్య 32,117 ఓట్ల వ్యత్యాసం ఉంది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి 48,923 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకు 16,806 ఓట్లు పోలయ్యాయి. 28 టేబుళ్లలో 3వ రౌండ్ ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి 76,345 ఓట్లు చెల్లినవి కాగా, 7,655 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. రాజశేఖరం, వీర రాఘవులు మధ్య 32,117 ఓట్ల వ్యత్యాసం ఉంది.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులునాయుడు ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి హరేంధిర ప్రసాద్ అధికారికంగా ప్రకటించారు. ఆయనకు ఎన్నికల సంఘం ధ్రువపత్రాన్ని అందజేశారు. ఎలిమినేషన్ ప్రక్రియలో పదో రౌండ్లో పాకలపాటి రఘువర్మకు లభించిన ఓట్లలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించి విజేతను ప్రకటించారు. శ్రీనివాసులు నాయుడికి 12,035 ఓట్లు వచ్చాయి.
చిత్తూరు నగరంలోని వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. రామ్నగర్ కాలనీలో కొద్దిరోజులుగా వ్యభిచారం జరుగుతున్నట్లు సమచారం రావడంతో 2టౌన్ CI నెట్టికంటయ్య తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం చేయిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని, ముగ్గురు మహిళలతోపాటు ముగ్గురు విటులను స్టేషన్కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ స్థాపకులు ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితులు. ఆయన తండ్రి శివరామకృష్ణ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయనకు ఎన్టీఆర్ అంటే ఇష్టంతో పార్టీ కోసం తన సొంత ఇంటిని, ఆయన పింఛన్లు కూడా పార్టీకి విరాళంగా ఇచ్చారని చెబుతారు. ఆయన కూడా తన తండ్రి బాటలో నడిచి టీడీపీలో అనేక హోదాలలో పనిచేశారు. ఆయన రాజకీయాలకు ముందు హైదరాబాదులో ఎన్టీఆర్, టీడీపీ కేసులన్నీ వాదించే టీంలో లాయర్గా పనిచేశారు.
తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్న గూడెంలోని డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మహారాష్ట్రలోని జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ కంపెనీతో సోమవారం అవగాహన ఒప్పందం చేసుకుంది. జైన్ ఇరిగేషన్ సిస్టం నిర్వహిస్తున్న అత్యధిక టిష్యూ కల్చర్ ల్యాబ్ సదుపాయాలను, రీసెర్చ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విభాగాలను ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉపయోగించుకునేందుకు వీలుగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు ఉపకులపతి కే. గోపాల్ తెలిపారు.
విజయనగరం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా తాగు నీటి సమస్య తలెత్తితే టెలిఫోన్ ద్వారా 9100120711 నంబర్కు తెలియజేయవచ్చునని కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్.డబ్ల్యు.ఎస్ ఆధ్వర్యంలో ఈ నంబర్ పని చేస్తుందని, తాగు నీటి సమస్యల పరిష్కారానికి నిత్యం సిబ్బంది అందుబాటులో ఉంటారని కలెక్టర్ స్పష్టం చేశారు. >Share it
శుభకార్యానికి వెళ్లే విషయమై ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఓ వివాహత ఆత్మహత్య చేసుకున్న ఘటన పెనుగొండ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటాపురం గ్రామానికి చెందిన ఉప్పలపాటి శ్రీదేవి ఆదివారం శుభకార్యానికి హాజరయ్యే విషయమై ఇంట్లో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె గోదావరిలో దూకింది. కాగా సోమవారం దొంగరావిపాలెం వద్ద ఆమె మృతదేహాన్ని కనుగొన్నట్లు పెనుగొండ ఎస్ఐ కే.గంగాధర్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.