India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జలదంకి మండలం బ్రాహ్మణక్రాకకు చెందిన దేవరకొండ విజయ్ కుమార్ అనే నిందితుడికి పోక్సో, కిడ్నాప్ కేసులలో 15 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.22 వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్పును వెలువరించారు. 2017లో మండలానికి చెందిన ఓ బాలిక(14)ను ప్రేమ పేరుతో వేధించి, కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేశాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి శిక్ష పడేలా చేసిన సిబ్బందిని SP కృష్ణకాంత్ అభినందించారు.
దేవనకొండ మండలంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య ధోరణిపై సీపీఎం నాయకుడు బీ.వీరశేఖర్ తహశీల్దార్ కార్యాలయంలో బైఠాయించారు. తెర్నేకల్ గ్రామానికి చెందిన మాబాషా అనే రైతుకు 7 ఎకరాల వ్యవసాయ పొలంలో 27 సెంట్లు హంద్రీనీవా కాలువ కింద పోయిందని, మిగిలిన 6 ఎకరాల 63 సెంట్లు పట్టాదారు పాసు బుక్కులో ఎక్కించాల్సి ఉండగా రీ సర్వే పేరుతో ఆలస్యం చేస్తున్నారనిధ్వజమెత్తారు.
ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ వాహనాలు నడపాలని నెల్లూరు నగర డీఎస్పీ సింధు ప్రియా తెలిపారు. నెల్లూరు నగరంలోని రంగనాయకుల గుడి సమీపంలోని ఫంక్షన్ హాల్లో 200 మంది ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రహదారి భద్రత మనందరి బాధ్యతని, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా వాహనదారులు ప్రజలకు ఇబ్బందు లేకుండా వాహనాలు నడపాలని సూచించారు.
కుప్పం నియోజకవర్గ పరిధిలో జల్లికట్టు, ఎద్దుల పండుగ (మైలారు)ను నిషేధించినట్లు డీఎస్పీ పార్థసారధి స్పష్టం చేశారు. ఎక్కడైనా జల్లికట్టు, ఎద్దుల పండగను నిర్వహిస్తే వారు జంతు సంరక్షణ చట్టం క్రింద శిక్షార్హులన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని DSP హెచ్చరించారు.
కర్నూలు జిల్లాలో నాటుసారాను పూర్తిగా నిర్మూలించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్లో జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలన కార్యక్రమం నవోదయం-2.0పై రూపొందించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్ వెంకట నారాయణమ్మ, జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ కుమార్ పాల్గొన్నారు.
వాట్సప్ గవర్నర్స్పై విస్తృత అవగాహన కల్పించాలని, పారదర్శకమైన పరిపాలన అందించాలని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొన్నారు. త్వరలో వాట్సప్ గవర్నర్పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 5000 హెక్టార్ల లక్ష్యానికి 2821 హెక్టార్ల ప్రగతి సాధించడం జరిగినదని, మిగిలిన లక్ష్యాన్ని మార్చి నెల ఆఖరికి పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా సూక్ష్మ సేద్య శాఖ, ఆసియాన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శాఖల పనితీరుపై జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడుతో కలిసి సమీక్షించారు.
టెక్కలి పోలీస్ స్టేషన్లో సోమవారం జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వరరెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా తొలుత స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. నూతన మోటార్ వెహికల్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ సిబ్బందికి చెప్పారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ మోసాలు, అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
మార్చి 8న నిర్వహించే మహిళా దినోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఏర్పాట్లపై కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సుమారు 4 వేల మంది మహిళలతో విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు.
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు విశాఖలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను ప్రకటించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ సోమవారం తెలిపారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10వ తేదీ లోపు తన కార్యాలయంలో అభ్యంతరాల వివరాలు నమోదు చేసి అందజేయాలన్నారు.10వ తేదీ తర్వాత అభ్యంతరాలు స్వీకరించమన్నారు.
Sorry, no posts matched your criteria.