India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రుషికొండ బీచ్ బ్లూఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేయడంపై భీమిలి MLA గంటా శ్రీనివాసురావు అసెంబ్లీలో ప్రస్తావించారు. విశాఖకు ముఖ్యమైన IT, టూరిజంని అభివృద్ధి చేయాలని కోరారు. ఒకసారి బ్యాడ్ రిమార్క్ వస్తే ఇంటర్నేషనల్ టూరిస్టులు వెనుకడుగు వేస్తారని అన్నారు. ఈ నాలుగైదు రోజుల్లో బ్లూఫ్లాగ్ కమిటీ వస్తుందని ఆ టైంకి పునరుద్ధరించాలన్నారు. రద్దుకు కారణం ఎవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పెండ్లిమర్రి మండలం గంగనపల్లి గ్రామం మాలవాడలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్యను కడతేర్చిన ఘటన గ్రామంలో ఆదివారం కలకలం రేపింది. సుబ్బరాయుడు తన భార్య లూర్థ్ మేరీని మద్యం మత్తులో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పెండ్లిమర్రి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నేటి నుంచి ఈనెల 13వ తేది వరకు పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గంట ముందు మండల విద్యాశాఖ కార్యాలయం నుంచి ప్రశ్న పత్రాలు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4:45 వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులకు పరీక్షలపై భయం పోవడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయని అన్నారు.
వలేటివారిపాలెం(M), అయ్యవారిపల్లి గ్రామ భూమి రికార్డులలో ఓ చిత్రమైన పరిస్థితి వెలుగు చూసింది. కనీసం రూ.1000 కోట్లు విలువ చేసే దాదాపు 6500 ఎకరాల ప్రభుత్వ భూమి ఏ శాఖది అన్న ప్రశ్న తలెత్తింది. Sno: 4, 118 కి సంబంధించిన FMB ప్రకారం కొండలు, గుట్టలు, అడవితో కూడిన 8155 ఎకరాల భూమి ఉంది. గణాంక వివరాలు తెలిపే FLR లో 1656 ఎకరాలు మాత్రమే అటవీభూమిగా ఉంది. మిగిలిన భూమి ఎవరిది.? అనేందుకు రికార్డు లేనట్లు సమాచారం.
ఏపీ అసెంబ్లీలో శ్రీకాకుళం ఎమ్మెల్యేలంతా ఐటీడీఏ ఏర్పాటుపై ముక్తకంఠంగా ప్రశ్నించారు. పాతపట్నం,పలాస,టెక్కలి, నరసన్నపేట నియోజకర్గాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సీతంపేట ఐటీడీఏ పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్లిపోయిందని తెలిపారు. జిల్లాలో ఐటీడీఏ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పాలని గౌతు శిరీష, కూన రవి, బగ్గు రమణమూర్తి, గొండు శంకర్ డిమాండ్ చేశారు.
జీవీఎంసీ మేయర్ పీఠం చేజిక్కించుకునేందుకు కూటమి కసరస్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మార్చి 18కి జీవీఎంసీ మేయర్ బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీవీఎంసీ బడ్జెట్ సమావేశం నిర్వహించకపోవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
పలాస, శ్రీకాకుళం రోడ్ మీదుగా ప్రయాణించే 2 రైళ్లకు నూతన నంబర్లు కేటాయించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు భువనేశ్వర్(BBSR)- పుదుచ్చేరి(PDY) సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకు(వీక్లి) ప్రస్తుత నంబర్లు 12898/12897 స్థానంలో 20851/20852 నంబర్లు ఉంటాయన్నారు. BBSR- PDY రైలు ఈ నెల 4 నుంచి, PDY- BBSR రైలు ఈ నెల 5 నుంచి నూతన నంబర్లతో ప్రయాణిస్తాయని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
చికెన్ పట్ల సామాజిక మాధ్యమంలో వస్తున్న అపోహలను నమ్మొద్దని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. కుప్పం టీడీపీ కార్యాలయ సమీపంలో ఆదివారం సాయంత్రం చికెన్ మేళా కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం ప్రారంభించారు. చికెన్, కోడిగుడ్లలో మంచి ప్రోటీన్లు దొరుకుతుందని, అపోహలను పక్కనపెట్టి చికెన్ తినొచ్చని అన్నారు.
➤ పీజీటీ విభాగం: హిందీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కామర్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ పోస్టులు
➤ టీజీటీ విభాగం: ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్, కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్, స్పోర్ట్ కోచ్, క్రాఫ్ట్, యోగా, నర్స్ పోస్టు
➤ ఇంటర్వ్యూ తేదీ: మార్చి 4న ఉ.8.30 నుంచి ప్రారంభం
➤ లొకేషన్: స్టీల్ ప్లాంట్ కేవీ
NOTE: పూర్తి వివరాలకు స్కూల్ వెబ్ సైట్ను సంప్రదించగలరు >Share it
రాజమండ్రి గామన్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజానగరం పోలీసుల వివరాలు.. తొర్రేడుకు చెందిన నరేంద్ర (45) పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని SI మనోహర్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.