India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటనపై మంత్రి పయ్యావుల కేశవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం తన మనసును కలిచి వేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు. కాగా ఈ విషాద ఘటనలో ముగ్గరు అక్కాచెల్లెళ్లు, మూడు నెలల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే.
విశాఖ ముడసర్లోవ పార్కు వద్ద రోడ్డు పక్కన ఆదివారం ఒక గుర్తు తెలియని వ్యక్తి(48) మృతి చెంది పడి ఉన్నట్లు ఆరిలోవ ఎస్ఐ రామదాసు పేర్కొన్నారు. మృతదేహంపై ఏవిధమైన గాయాలు లేకపోవడతో అనారోగ్యంతో మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేసి సీఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బాపులపాడు మండలంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. ఏలూరు జిల్లా గుండుగొలనుకి చెందిన నాగరాజు కుటుంబం బైక్పై గుడివాడ వెళ్తుండగా ఆరుగొలను వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలతో ఉన్న క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలు కానున్నాయి. అయితే ఈరోజు నుంచి మార్చి 15వ తేదీ వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. విశాఖ జిల్లాలో మొత్తం 87 పరీక్ష కేంద్రాలలో 40,744 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వీరిలో బాలురు 21,464 ఉండగా బాలికలు 19,280 మంది ఉన్నారు. 15 నిమిషాలు ముందుగా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలన్నారు.
పూజల పేరిట డబ్బులు వసూలు చేసిన ఘటన GNTలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రాజేశ్వరరావు కాలనీకి చెందిన నాగేశ్వరరావుకు ఇంట్లో అమ్మవారి అనుగ్రహం ఉందని, పూజలు చేస్తే పైసలు వస్తాయని వెంకాయమ్మ అనే మహిళ నమ్మించింది. సిద్ధాంతితో ప్రాణగండం ఉందని చెప్పి భయపెట్టింది. పూజల కోసం విడతల వారీగా రూ. 15 లక్షలు తీసుకుంది. ఫలితం లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
ఇంటర్ సెకండియర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మ.12 వరకు ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష జరగనుంది. అనంతపురం జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 22,960 మంది ఉండగా జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 గంటలకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
☛ All The Best Students
సాగర్ నగర్లోని ఇస్కాన్ మందిరంలో ఆదివారం రాత్రి నిర్వహించిన వామన దేవుని అవతారం అంతర్జాతీయ నాటకంలో కళాకారుల ప్రదర్శన అబ్బురపరిచింది. విదేశాలకు చెందిన కళాకారులు భారతీయ సాంప్రదాయాన్ని, ఇతిహాసాలను అద్భుతంగా ప్రదర్శించిన ఈ నాటకం ప్రేక్షకులను ఆద్యంతం అలరించింది. దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా నుంచి వచ్చిన కళాకారుల బృందం కెనడాకు చెందిన స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఆదివారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ నెల 13వ తేదీలోపు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 18వ తేదీ నుంచి 25 మధ్య పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇంటర్ సెకండియర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మ.12 వరకు ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష జరగనుంది. కర్నూలు జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 22,227 మంది ఉండగా జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 గంటలకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
☛ All The Best Students
నేటి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. విజయనగరం జిల్లాలో 177 అన్ని యాజమాన్య కళాశాలల నుంచి 20,368 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 166 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు శనివారం ప్రారంభం అయ్యాయి.
Sorry, no posts matched your criteria.