Andhra Pradesh

News September 22, 2025

అర్జీలను స్వీకరించిన కలెక్టర్ ఆనంద్

image

అనంతపురంలోని కలెక్టరేట్‌లో సోమవారం PGRS కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. తీసుకున్న అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

News September 22, 2025

కడపకు చేరుకున్న యూరియా

image

కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల యూరియా కోసం అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. ఈక్రమంలో రెండు జిల్లాలకు కలిపి 2,600 టన్నుల యూరియా కేటాయించారు. గూడ్స్ రైలులు సంబంధిత యూరియా కడపకు చేరుకుందని వ్యవసాయ శాఖ అధికారి చంద్రనాయక్ వెల్లడించారు. ఇందులో కడప జిల్లాకు 2,080 టన్నులు రాగా.. ప్రైవేట్ డీలర్లకు 780 టన్నులు, మార్క్‌ఫెడ్‌కు 1300 టన్నులు కేటాయించారు.

News September 22, 2025

కోటబొమ్మాళి: హెలికాఫ్టర్ రైడ్‌కు వెళ్తున్నారా.. ఇది గమనించండి

image

కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన హెలికాఫ్టర్ రైడ్‌కు వెళ్తున్నారా? అయితే ఇది గమనించాలని నిర్వాహకులు చెబుతున్నారు. రైడ్ టికెట్ రూ.2 వేలుగా నిర్ణయించారు. టికెట్ కావాల్సిన వారు కేవలం క్యాష్ మాత్రమే తీసుకురావాలని, యూపీఐ, డిజిటల్ పేమెంట్స్ చెల్లవని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ సుధాకర్ తెలిపారు. పర్యాటకులు గమనించాలని ఆయన కోరారు.

News September 22, 2025

నెల్లూరు: రెగ్యులర్ అధికారులు లేక ఇన్‌ఛార్జులతోనే పాలన!

image

జిల్లాలో కీలక శాఖల్లో రెగ్యులర్ అధికారులు లేక ఇన్‌ఛార్జ్‌లతోనే పాలన సాగుతోంది. స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాల అమలు మందగిస్తోంది. రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్, మునిసిపల్, విజిలెన్స్ వంటి విభాగాల్లో ఫైళ్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. నుడా వీసీ, DRO, మునిసిపల్ కమిషనర్, మైనింగ్ డీడీ, స్పెషల్ కలెక్టర్ పోస్టులు ఖాళీగా ఉండగా, పలు బాధ్యతలు తాత్కాలిక అధికారులకే అప్పగించారు. ఫలితంగా నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయి.

News September 22, 2025

సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో తగ్గనున్న ధరలు

image

సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో నేటి నుంచి నూతన జి.ఎస్.టి అమలు చేయనున్నట్లు సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తెలిపారు. రూ.1000 నుంచి రూ.2500 విలువ గల వస్త్రాలపై 12%గా ఉన్న జి.ఎస్.టి 5%గా అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ నూతన జి.ఎస్.టి విధానం అమలుతో 6.25% వినియోగదారులకు లాభం చేకూరుతుందన్నారు.. వినియోగదారులు గమనించాలన్నారు.

News September 22, 2025

కోటబొమ్మాళి: జాతరలో హెలికాఫ్టర్ రైడ్ టికెట్ రూ. 2 వేలు

image

కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మ తల్లి జాతరలో హెలికాఫ్టర్ రైడ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దానికి టికెట్ రూ.2వేలుగా అధికారులు నిర్ణయించారు. అమ్మకాలు సోమవారం నుంచి ప్రారంభించారు. రోజుకు 40 టికెట్లు అమ్మకాలు జరుపుతారు. 23-25వ తేదీలలో రైడుకు సంబంధించిన టికెట్లు వంశధార కాలేజీ వద్ద విక్రయిస్తారు. వాతావరణం పరిస్థితులు బట్టి, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రిప్పులు ఉంటాయని అధికారులు తెలిపారు.

News September 22, 2025

దసరా సెలవులు ప్రకటించినా… కొన్ని పాఠశాలలు కొనసాగింపు

image

రాష్ట్రంలోని పాఠశాలలకు సెప్టెంబర్ 22 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని మంత్రి లోకేశ్ ప్రకటించారు. అయితే గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పరీక్షల పేరుతో, మరికొందరు సిలబస్ పేరుతో సెలవులు ఇవ్వకుండా స్కూల్ తరగతులు కొనసాగిస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.

News September 22, 2025

తెలుగు సినిమాకు సంగీతం అందించిన దర్శక శిఖరం

image

బొడ్డు గోపాలం (1927-2004) ఒక ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు. ఆయన గుంటూరు జిల్లా తుళ్లూరులో జన్మించారు. ప్రజా నాట్య మండలిలో చేరి “చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా” వంటి దేశభక్తి గీతాలకు స్వరకల్పన చేసి ప్రసిద్ధి పొందారు. తర్వాత ఘంటసాల దగ్గర సహాయకుడిగా పనిచేసి, “నలదమయంతి” చిత్రంతో స్వతంత్ర సంగీత దర్శకుడిగా మారారు. “రంగులరాట్నం”, “కరుణామయుడు” వంటి చిత్రాలకు ఆయన సంగీతం అందించారు.

News September 22, 2025

వరల్డ్ టాప్-2 సైంటిస్టుల జాబితాలో YVU ప్రొఫెసర్లు

image

కడప జిల్లా యోగి వేమన యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లకు అరుదైన గుర్తింపు లభించింది. వరల్డ్ టాప్-2 సైంటిస్టుల జాబితాలో చోటు దక్కింది. మెటీరియల్ సైన్స్ అండ్ నానో టెక్నాలజీ విభాగ ప్రొఫెసర్ శంకర్, మైక్రోబయాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ వీరాంజనేయరెడ్డి 2025 ఎడిషన్‌లో స్థానాన్ని దక్కించుకున్నారు. వీరికి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు.

News September 22, 2025

ప్రకాశం: ఇంటర్ కాలేజీలకు RIO వార్నింగ్

image

ప్రకాశం జిల్లాలోని ఇంటర్మీడియట్ కళాశాలలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని RIO ఆంజనేయులు అన్నారు. కలెక్టరేట్ వద్ద సర్టిఫికెట్ల కోసం నిరసన తెలిపిన విద్యార్థినికి సంబంధిత కళాశాల యాజమాన్యంతో మాట్లాడి సర్టిఫికెట్లు అందించారని చెప్పారు. ఇలాంటి చర్యలకు ఏ కళాశాల పాల్పడినా శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.