Andhra Pradesh

News October 2, 2024

శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సిద్ధం: కేంద్ర మంత్రి

image

శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం పాతపట్నంలో పీఎం జన్మాన్ వసతిగృహ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తిచేస్తామన్నారు.

News October 2, 2024

చుండూరు: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

image

గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సంఘటన చుండూరు రైల్వే స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. తెనాలి నుంచి చుండూరు మధ్య గల రైల్వే పట్టాలపై గూడ్స్ రైలు వెనక ఉన్న బ్రేక్ వ్యాన్ పట్టాలు తప్పడంతో రైలును నిలిపివేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News October 2, 2024

ఎన్నికల హామీలకు తూట్లు పొడుస్తున్నారు: మాజీ ఎంపీ భరత్

image

ప్రజల్లో ఎన్నో ఆశలు రేపి కూటమి అధికారంలోకి వచ్చిందని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ పేర్కొన్నారు. కానీ ఎన్నికల హామీలకు తూట్లు పొడుస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రిలో గాంధీ విగ్రహానికి ఆయన వినతిపత్రం ఇచ్చారు. అమ్మకు సున్నం.. నాన్నకు మద్యం.. అన్న విధంగా ప్రభుత్వ తీరు ఉందన్నారు. నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటాయన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు కావడం లేదని మండిపడ్డారు

News October 2, 2024

కడప: కేంద్ర కారాగారాన్ని సందర్శించిన కలెక్టర్

image

కడప జిల్లా కేంద్ర కారాగారాన్ని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ సందర్శించారు. గాంధీ జయంతి పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. జైలు జీవితం గడుపుతున్న ప్రతి ఒక్కరూ క్షణిక ఆవేశంలో తప్పులు చేసి ఉంటారని అన్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. జైలు జీవితం గడిపేవారు విడుదల అయిన తర్వాత మంచి జీవితాన్ని గడపాలని సూచించారు.

News October 2, 2024

రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

రాప్తాడు నియోజకవర్గం కక్కలపల్లి కాలనీలో ఉన్న నడిమి వంకను కలెక్టర్ వినోద్ కుమార్, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే పరిటాల సునీత.. అధికారులతో కలిసి పరిశీలించారు. వంకకు రెండువైపులా ఉన్న ఆదర్శ నగర్‌తో పాటు సుమారు 8 కాలనీల ప్రజలు వరదల సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే వివరించారు. రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

News October 2, 2024

ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: మంత్రి కొండపల్లి

image

ఏపీలో ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమని ఏపీ MSME, NRI సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డల్లాస్‌లోNRI తెలుగుదేశం ఆధ్వర్యంలో ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో త్వరలోనే ఒక పోర్టల్ ప్రారంభిస్తున్నామని, దీని ద్వారా పెట్టుబడులు పెట్టేవారు అన్ని రకాల అనుమతులు పొందడం సులభతరం అవుతుందని వెల్లడించారు.

News October 2, 2024

జాతీయస్థాయి పోటీలకు కొయ్యలగూడెం విద్యార్థి

image

కొయ్యలగూడెం వీఎస్ఎన్ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి వై.రాహుల్ పల్నాడు జిల్లాలో జరిగిన స్టేట్ లెవెల్ క్రీడల్లో పాల్గొని, జాతీయ క్రీడా పోటీలకు ఎంపికయ్యారని కళాశాల కరెస్పాండెంట్ స్వామి తెలిపారు. బుధవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి రాహుల్‌ను అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించారు.

News October 2, 2024

3న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

image

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబ‌రు 3వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేస్తారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షిస్తారు.

News October 2, 2024

ఒంగోలు: రైలు కిందపడి వివాహిత సూసైడ్

image

వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒంగోలులో బుధవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక కేశవస్వామిపేటకు చెందిన దంపతులు శ్రుతి- ప్రసాద్ క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి శ్రుతి భర్తకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే SI అరుణకుమారి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదైంది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

News October 2, 2024

ఎమ్మిగనూరులో 4న జాబ్ మేళా.. కరపత్రాలు విడుదల చేసిన ఎమ్మెల్యే

image

ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అక్టోబర్ 4న నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మిగనూరు MLA జయ నాగేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. 10వ తరగతి, ఇంటర్, బీటెక్, డిప్లొమా చదివిన విద్యార్థులు అర్హులన్నారు. రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.