Andhra Pradesh

News March 2, 2025

కర్నూలు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

➤ నందవరంలో అత్తింటి వేధింపులతో మహిళ సూసైడ్
➤ సీ.బెళగల్ మండలంలో చెట్టు విరిగి పడి బాలిక మృతి
➤ పెద్దకడబూరు: రైతులకు కూటమి ప్రభుత్వం మరోసారి వెన్నుపోటు
➤ బడ్జెట్‌పై ఆలూరు ఎమ్మెల్యే ఆగ్రహం
➤ కర్ణాటకలో జల చౌర్యంపై స్పందించిన కర్నూలు ఎంపీ
➤ కేంద్ర రైల్వే మంత్రికి ప్రతిష్ఠ అవార్డు ప్రదానం

News March 2, 2025

విశాఖ మీదుగా వెళ్లే పలు రైళ్ల నంబర్లు మార్పు

image

విశాఖ మీదుగా వెళ్లే పలు రైళ్లకు నంబర్లు మార్చడం జరిగిందని వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. మార్చ్ 7 నుంచి భువనేశ్వర్ – రామేశ్వరం ఎక్స్ ప్రెస్‌కు(20849/50), మార్చ్ 4 నుంచి భువనేశ్వర్-పుదుచ్చేరి ఎక్స్ ప్రెస్‌కు(20851/52), మార్చ్ 6 నుంచి భువనేశ్వర్ – చెన్నై సెంట్రల్ ఎక్స్ ప్రెస్‌కు(20853/54) గా సవరించారన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News March 2, 2025

మహిళా సిబ్బందికి యోగా తరగతులు: ఎస్పీ

image

మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో మహిళా పోలీసు సిబ్బందికి ఆదివారం ప్రత్యేకంగా యోగా తరగతులను నిర్వహించినట్లుగా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. యోగ అనేది శరీరానికి, మనస్సుకి, ఆత్మకు శాంతి కలిగించే ప్రాచీనమైన సాధన అని అన్నారు. యోగ తరగతులు మహిళాలకు ఉపయోగకరమన్నారు.

News March 2, 2025

ప్రకాశం: సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే తాటిపర్తి ఫైర్

image

సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ‘అమరావతి నిర్మాణం కోసం రూ.6 వేల కోట్ల నిధులు, రూ.50 వేల కోట్ల పనులు, రూ.15 వేల కోట్ల అప్పులు కల్పించారు. ప్రకాశం జిల్లా వాళ్లం కేవలం తాగునీరు, సాగునీరు అడుగుతున్నాం. రూ.600 కోట్లయినా నిధులు మాకు ఇస్తే గొంతు తడి చేసుకుంటాం. దప్పికకు కులం, మతం, ప్రాంతం, పార్టీలు ఉండవ్ చంద్రబాబు” అంటూ ఎమ్మెల్యే ట్వీట్ చేశారు.

News March 2, 2025

విజయనగరం వ్యాయమ ఉపాధ్యాయుల జిల్లా సంఘం ఎన్నిక 

image

వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా గోపి లక్ష్మణరావు, కార్యదర్శిగా నల్లా వెంకటనాయుడు ఎంపికయ్యారు. కార్యదర్శిగా ఎన్నికైన వెంకటనాయుడు పెంట జిల్లా పరిషత్ పాఠశాలలో పని చేస్తున్నాడు. విజయనగరంలో ఆదివారం జరిగిన జిల్లా సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరి ఎంపికపై టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యాయమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని వీరు తెలిపారు. 

News March 2, 2025

విశాఖ రేంజ్‌లో ఎస్ఐలుగా బావ బామ్మర్ది..!

image

విశాఖ రేంజ్‌లో బావ బామ్మర్దులు ఎస్‌లుగా రిపోర్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం పి.పొన్నవోలుకి చెందిన పులఖండం నాని, కొరసాల దుర్గాప్రసాద్ ఎస్ఐలుగా ఎంపికయ్యారు. రైతు కుటుంబానికి చెందిన వీరు వరుసకు బావమరుదులు అవుతారు. అనంతపురంలో 52 వారాల శిక్షణ పూర్తి చేసుకున్న వీరిద్దరూ ఆదివారం విశాఖ రేంజ్‌లో రిపోర్ట్ చేశారు. ఇద్దరూ ఒకేసారి ఎంపికవ్వడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 2, 2025

శ్రీలేఖ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా: కలెక్టర్

image

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని శ్రీలేఖ కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దురదృష్టవశాత్తూ విద్యార్థి శ్రీలేఖ ఆదివారం ఉదయం మృతి చెందిందని కలెక్టర్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం వెంటనే స్పందించి రూ.5 లక్షలు ప్రకటించిందన్నారు.

News March 2, 2025

ఏయూతో కలిసి పని చేయడానికి ఐడీఎస్ సిద్ధం: గాలబ్

image

ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధుల బృందం ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్‌తో ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.గాలబ్ ఆచార్య రొక్కం రాధాకృష్ణ ప్రసంగాలు, పరిశోధనకు సంబంధించిన పుస్తకాన్ని బహుకరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. పరిశోధన, బోధనా రంగాల్లో తాము సేవలందిస్తామన్నారు.

News March 2, 2025

కూడేరు రోడ్డు ప్రమాదం.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

image

కూడేరు మండలం కమ్మూరు వద్ద ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. సరస్వతి(32) అక్కడిక్కడే మృతిచెందగా.. ఆమె కూతురు 3 నెలల చిన్నారి విద్యశ్రీ, నీలమ్మ(42), యోగేశ్వరి(40) అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. జ్ఞానాన్షిక, అచ్చిత్ కుమార్ స్వామి, ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. పెన్నహోబిలం నుంచి అనంతపురం PVKK కళాశాల విద్యార్థులు కారులో వస్తూ ఆటోను ఢీకొట్టారు.

News March 2, 2025

భీమవరం: మావుళ్ళమ్మ సేవలో యాంకర్ ఓంకార్

image

భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారిని ప్రముఖ యాంకర్ ఓంకార్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందించారు. ఓంకార్‌తో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు.