Andhra Pradesh

News March 2, 2025

చిత్తూరు జిల్లాలో 96% పింఛన్ల పంపిణీ

image

చిత్తూరు జిల్లాలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అధికారులు 96 శాతం పంపిణీ చేశారు. 2,64,899 మంది లబ్ధిదారులకుగాను 2,54,375 మందికి (96.03) పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. జీడి నెల్లూరులో జరిగిన పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్న విషయం తెలిసిందే. 

News March 2, 2025

కందుకూరు: కూలీలతో వెళ్తున్న ట్రాలీ బోల్తా

image

గుడ్లూరు మండలం బసిరెడ్డిపాలెంకు చెందిన 30 మంది మహిళా కూలీలు ఆదివారం పొన్నలూరు మండలం ఎదురువారిపాలెంలో శనగ కోతకు ట్రాలీ ఆటోలో బయలుదేరారు. ఆటో పొన్నలూరు, నాగిరెడ్డి పాలెం మధ్యలోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ఐదుగురికి స్వల్ప గాయాలు కాగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్యం కోసం 108 వాహనంలో కందుకూరుకు తరలించారు.

News March 2, 2025

గరివిడి: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

విజయనగరం జిల్లాలో చుట్ట వలన మహిళ ప్రాణం పోయింది. గరివిడి మండలం గొట్నింద గ్రామానికి చెందిన బొడ్డు బండమ్మ(70) పడుకునే ముందు తను కాల్చిన చుట్టను మంచంపై పెట్టింది. దీంతో అగ్నిప్రమాదం జరగ్గా ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. ఈ ఘటనపై గరివిడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 2, 2025

GNT: రేపు ఉదయం 8గంటలకు కౌంటింగ్

image

ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉ.8గంటలకు మొదలవుతుంది. సుదీర్ఘంగా సాగే కౌంటింగ్ ప్రక్రియ కావడంతో సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. కాగా ఉమ్మడి GNT, కృష్ణా జిల్లాల్లోని గ్రాడ్యుయేట్లు ఎవరికి పట్టం కట్టారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. TDP అభ్యర్థి ఆలపాటి, PDF అభ్యర్థి లక్ష్మణరావు మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. గెలుపు ఎవరిని వరిస్తుందనే దానిపై ఇరు వర్గాల్లో టెన్షన్ నెలకొంది.

News March 2, 2025

గోరంట్లలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

గోరంట్ల మండలం బూచేపల్లి గ్రామంలో శనివారం విద్యుత్ షాక్ తగిలి రైతు శివప్ప (33) అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. వ్యవసాయ పొలంలో విద్యుత్ తీగలు నేలపై ఉండడంతో వాటిని ఎత్తులో కట్టేందుకు కట్టెలు నాటుతుండగా చేతికి విద్యుత్ తీగల తగిలి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు సీఐ శేఖర్ తెలిపారు.

News March 2, 2025

సంతబొమ్మాళి: మాజీ ఎంపీపీ కుమారుడి మృతి

image

సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కర్రి కృష్ణవేణి కుమారుడు కర్రి నాగిరెడ్డి(33) శనివారం రాత్రి మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా కృష్ణవేణి 2014-2019 ఏడాదిలో సంతబొమ్మాళి ఎంపీపీగా ఉన్నారు. కృష్ణవేణి భర్త విష్ణుమూర్తి సంతబొమ్మాళి టీడీపీ సీనియర్ నాయకుడు. ఈ మేరకు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 2, 2025

నెల్లూరులో చికెన్ ధరలు ఇవే

image

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. బ్రాయిలర్ లైవ్ ధర దాదాపు రూ.111గా ఉండగా, లేయర్ లైవ్ ధర రూ.80గా ఉంది. స్కిన్‌లెస్ ధర. రూ.220గా ఉండగా, బ్రాయిలర్ చికెన్ ధర రూ.200గా ఉన్నట్లు సమాచారం. లేయర్ చికెన్ ధర రూ.136గా ఉంది. బర్డ్ ఫ్లూ భయంతో తగ్గిన కొనుగోళ్లు ఇప్పుడు కాస్త పెరిగాయని వ్యాపారులు తెలిపారు. మీ ఊరిలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 2, 2025

శ్రీశైల మల్లన్న టికెట్ల గోల్‌మాల్

image

శ్రీశైల మల్లన్న సన్నిధిలో సర్వదర్శనం టికెట్ల వ్యవహారంలో గోల్‌మాల్ జరిగిన విషయం తెలిసిందే. గత నెల 14న దళారులు నకిలీ టికెట్లురూ .900కు అమ్మారు. పాత టికెట్లపై తేదీలను మార్చి రబ్బరు స్టాంపులతో విక్రయించారు. దీనిని గుర్తించిన కొందరు అధికారులు ఈవో ఎం. శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆలయ సీఎస్ఓ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 2, 2025

2 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు: CM

image

చిత్తూరు జిల్లాలో త్వరలోనే 2 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు CM చంద్రబాబు హామీ ఇచ్చారు. శనివారం GDనెల్లూరులో పర్యటించిన ఆయన.. NTR జలాశాయంతోపాటూ ఇక్కడే బాలుర గురుకులాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో మామిడి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు CM తెలిపారు. వాటితో సాగు, తాగు నీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

News March 2, 2025

కంచరపాలెంలో బీటెక్ యువకుడి ఆత్మహత్య

image

కంచరపాలెంలోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న ఎం అజయ్ సంపత్ సాయి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. బీటెక్ చదువుతున్న సాయి గత నెల 9న రాంబిల్లి బీచ్‌లో ఇద్దరు స్నేహితులు చనిపోగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. సంపత్ సాయి ఇంటి పక్కనే స్నేహితులు నివాసం ఉంటున్నారు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.