Andhra Pradesh

News March 2, 2025

విశాఖ: రైలు ప్రయాణికుల భద్రతపై సమావేశం

image

రైళ్లలో ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక సమావేశం రైల్వే డీఎస్పీ రామచందర్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రైల్వే పోలీసులు జీఆర్పీ పోలీసులు హాజరయ్యారు. ముఖ్యమైన రైలు తనిఖీ చేయడమే కాకుండా సీసీ కెమెరాలతో  నిఘా మరింత పెంచాలని అనుమానితుల కదలికలు పరిశీలన ఎప్పటికప్పుడు చేయాలని పలు అంశాలపై చర్చ చేశారు. సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

News March 2, 2025

టీడీపీ నేత పీరయ్య మృతి బాధాకరం: నారా లోకేశ్

image

కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు పోతుగంటి పీరయ్య మృతి చెందారన్న వార్త తనను ఆవేదనకు గురిచేసిందని రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. వారి కుటుంబానికి టీడీపీ అండగా నిలుస్తుందని శనివారం Xలో తెలిపారు.

News March 2, 2025

ఒంగోలు: ‘మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి’

image

మహిళలందరూ ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. శనివారం నుంచి వారం రోజులపాటు జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించడానికి అధికార యంత్రాంగం పలు ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా.. శనివారం ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

News March 2, 2025

అనంత: చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

తాడపత్రి మండలం ఎర్రగుంట్లలో వ్యక్తిగత ఇంకుడు గుంతకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ, తడి, పొడి చెత్త విభజన వర్మి కంపోస్టు తయారీ విధానం గురించి వివరించారు. చెత్త నుంచి తయారైన ఎరువుల ప్యాకెట్ల రేట్లు తదితర వివరాలను కలెక్టర్ అడిగారు.

News March 2, 2025

SKLM: పెండింగ్ కేసులపై దర్యాప్తు వేగవంతం చేయాలి

image

శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి పోలీసు స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులు దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని ఏఎస్పీలు కెవి రమణ, పి. శ్రీనివాసరావు సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పెండింగ్లో ఉన్న కేసులు, మహిళా సంబంధిత నేరాలు, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర కేసులపై నేర సమీక్ష నిర్వహించారు. వీటిపై త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు కోర్టులో చేయాలన్నారు.

News March 2, 2025

గన్నవరం: ఎమ్మెల్యే యార్లగడ్డ దృష్టికి సమస్యలు

image

గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును విజయవాడ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు, నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు స్థానిక సమస్యలను వివరించగా, ఆయన వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

News March 2, 2025

రాయలసీమలో వలసలు నివారించడమే లక్ష్యం: లోకేష్

image

రాయలసీమలో వలసలు నివారించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శనివారం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాల్లో మంత్రి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో వలసల అధికంగా కొనసాగుతున్నాయని, వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

News March 2, 2025

మంగళగిరిలో వైసీపీకి షాక్..!

image

మంగళగిరి వైసీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు, మార్కెట్ యాడ్ మాజీ చైర్మన్ మునగాల భాగ్యలక్ష్మి వైసీపీకి రాజీనామా చేసినట్లు శనివారం ప్రకటించారు. గత 12 ఏళ్లుగా పార్టీలో పని చేస్తూ.. 2సార్లు ఆర్కేని గెలిపించామన్నారు. కనీసం గుర్తింపు లేదని, అవమానంగా భావించి పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని పరిణామాలు బాధకలిగించాయన్నారు.

News March 1, 2025

విశాఖపట్నంలో టుడే టాప్ న్యూస్

image

➤ ఏయూ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన జి.పి.రాజశేఖర్ ➤ ప్రశాంతంగా ప్రారంభమైన మొదటిరోజు ఇంటర్ పరీక్షలు➤ జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాలలో 95 % మంది మొదటిరోజు పరీక్షకు హాజరైన విద్యార్థులు➤ KGHలో శిశువులు మార్పిడి.. ఒకరు సస్పెండ్, ఇద్దరికి చార్జీ మెమోలు➤ సింహాచలం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సుబ్బారావు➤జిల్లా వ్యాప్తంగా మూడు మిస్సింగ్ కేసులు ఛేదించిన పోలీసులు

News March 1, 2025

చిత్తూరు: ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

image

జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు DIEO సయ్యద్ మౌలా తెలిపారు. తెలుగు/హిందీ/సంస్కృతం/ఉర్దూ/తమిళం పరీక్షలకు 14,480 మందికి గాను 13794 మంది విద్యార్థులు హాజరు కాగా, 686 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ కోర్సులో మొత్తం 2088 మందికి గాను 1885 మంది హాజరు కాగా 203 మంది విద్యార్థులు గైర్హాజరు అయినారని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలిపారు