Andhra Pradesh

News October 2, 2024

జాతీయస్థాయి పోటీలకు కొయ్యలగూడెం విద్యార్థి

image

కొయ్యలగూడెం వీఎస్ఎన్ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి వై.రాహుల్ పల్నాడు జిల్లాలో జరిగిన స్టేట్ లెవెల్ క్రీడల్లో పాల్గొని, జాతీయ క్రీడా పోటీలకు ఎంపికయ్యారని కళాశాల కరెస్పాండెంట్ స్వామి తెలిపారు. బుధవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి రాహుల్‌ను అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించారు.

News October 2, 2024

3న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

image

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబ‌రు 3వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేస్తారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షిస్తారు.

News October 2, 2024

ఒంగోలు: రైలు కిందపడి వివాహిత సూసైడ్

image

వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒంగోలులో బుధవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక కేశవస్వామిపేటకు చెందిన దంపతులు శ్రుతి- ప్రసాద్ క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి శ్రుతి భర్తకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే SI అరుణకుమారి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదైంది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

News October 2, 2024

ఎమ్మిగనూరులో 4న జాబ్ మేళా.. కరపత్రాలు విడుదల చేసిన ఎమ్మెల్యే

image

ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అక్టోబర్ 4న నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మిగనూరు MLA జయ నాగేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. 10వ తరగతి, ఇంటర్, బీటెక్, డిప్లొమా చదివిన విద్యార్థులు అర్హులన్నారు. రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News October 2, 2024

నల్లజర్ల: జీవో ఇచ్చి మరీ మోసం చేశారు: ప్రసాద్

image

రాజమండ్రి ఎంపీ పురందీశ్వరితో పారామెడికల్ కాంట్రాక్టు ఉద్యోగులు బుధవారం నల్లజర్లలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తమ వేతనాల విషయంలో జీవో ఇచ్చి మరీ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల కుటుంబ పోషణ భారంగా ఉందన్నారు. న్యాయం చేయాలని ఎంపీకి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

News October 2, 2024

చేజర్ల ఎమ్మార్వో నుంచి రూ.3.5 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

image

చేజర్ల తహశీల్దార్‌‌ను బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.3.5 లక్షలు దొచేశారు. సైబర్ నేరగాళ్లు చేజర్ల తహశీల్దార్‌ వెంకటరమణకు కాల్ చేసి అదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు బెదిరించారు. అనంతరం వారు ఐదు లక్షలు డిమాండ్ చేయగా తహశీల్దార్ మూడున్నర లక్షలు నగదు ఇచ్చారు. అనుమానం వచ్చి సంగం సీఐ వేమారెడ్డికి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News October 2, 2024

సిద్దవటం: పెన్నా నదిలో పడి బాలుడు మృతి

image

సిద్దవటంలోని పెన్నా నదిలో బుధవారం పుల్లంపేట గ్రామానికి చెందిన ఇస్మాయిల్ (6) అనే బాలుడు ప్రమాదశాత్తు నీట మునిగి మృతి చెందాడు. తన బంధువులతో కలసి విహారయాత్రకు వచ్చిన ఇస్మాయిల్ ప్రమాదశాత్తు నీట మునిగాడు. ఒంటిమిట్ట సీఐ కృష్ణంరాజు నాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని ఈతగాళ్ల సాయంతో బాలుడిని బయటికి తీసుకొచ్చారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

News October 2, 2024

గాంధీ ఆలోచనలు, సంస్కరణలు అందరికీ ఆదర్శం: ఎస్పీ

image

మహాత్మ గాంధీ ఆలోచనలు, సంస్కరణలు అందరికీ ఆదర్శమని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో మహాత్మ గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. అహింసనే ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ వారిని ఎదిరించి, శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్ర్యాన్ని అందించి చరిత్రలో జాతిపితగా నిలిచారన్నారు.

News October 2, 2024

షెడ్యూల్లో మార్పు.. బందరు పోర్టుకు బయల్దేరిన చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు షెడ్యూల్లో మార్పులు జరిగాయి. కొద్దిసేపటి కిందటే ఆయన బందరు పోర్టుకు బయల్దేరారు. మచిలీపట్నం పర్యటన పూర్తి చేసుకున్న చంద్రబాబు.. తాడేపల్లి వెళ్లాల్సి ఉంది. కాగా, షెడ్యూల్లో మార్పులు చేసుకొని పోర్టుకు బయల్దేరారు. కాగా, మచిలీపట్నం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. పోర్టు పనులను వేగవంతం చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

News October 2, 2024

కడప పోలీస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

image

గాంధీ జయంతి సందర్భంగా కడప నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింసే ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ వారిని ఎదిరించి, శాంతియుతంగా పోరాడి దేశానికి స్వతంత్ర్యం అందించిన మహానీయుడు గాంధీజీ అని కొనియాడారు.