Andhra Pradesh

News July 4, 2025

విశాఖ జిల్లాలో 636 పాఠశాల్లో వైద్య పరీక్షలు

image

DMHO జగదీశ్వరరావు ఆదేశాల మేరకు విశాఖలో పాఠశాల విద్యార్థులకు జూలై 3నుంచి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పలు పాఠశాలు, అంగన్వాడీ కేంద్రాలలో మెడికల్ ఆఫీసర్, ఎఎన్ఎమ్‌లు ఆరోగ్య పరీక్షలు చేశారు. పిల్లల్లో పుట్టుకతో వచ్చే శారీరక ,మానసిక లోపాలను గుర్తించి సరైన వైద్యసేవలను ఇవ్వనున్నారు. జిల్లాలో 636 పాఠశాలల్లో 96,159 మంది, 914 అంగన్వాడీలలో 56,371 మందికి పరీక్షలు చేస్తారు.

News July 4, 2025

విశాఖ జిల్లా టీచర్లకు గమనిక

image

జాతీయ స్థాయి ఉత్తమ ఉపాద్యాయ అవార్డులు 2025‌కు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రభుత్వ/ ప్రైవేటు/ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ప్రేమ్ కుమార్ శుక్రవారం తెలిపారు. http://nationalawardstoteacher.education.gov.in వెబ్‌సైట్ ద్వారా జులై 13లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అర్హత, వివరాలకు వెబ్ సైట్‌లో చెక్ చేసుకోవాలని తెలిపారు.

News July 4, 2025

కడప: ‘బాలల పరిరక్షణకు కృషి చేయాలి’

image

బాలల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బి.పద్మావతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సభ్యురాలు బి.పద్మావతి అధ్యక్షతన బాలల హక్కుల పరిరక్షణ గురించి వివరించారు. వారి కోసం ఉద్దేశించిన చట్టాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

News July 4, 2025

బ్యాంకర్లకు విశాఖ కలెక్టర్ కీలక ఆదేశాలు

image

సామాన్యుల ఆర్థిక ల‌క్ష్యాల‌కు అనుగుణంగా బ్యాంకర్లు స‌హ‌కారం అందించాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల ప్ర‌తినిధులతో క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో శుక్ర‌వారం సమావేశమయ్యారు. స్వ‌యం స‌హాయ సంఘాల స‌భ్యుల‌కు అందించే రుణాల‌ను స‌కాలంలో రెన్యువ‌ల్ చేయాల‌ని, వారి పొదుపు ఖాతాలోని 50శాతం సొమ్మును ఆటోమేటిక్‌గా ఎఫ్.డి. చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.

News July 4, 2025

విశాఖ CPT పరీక్ష ఏర్పాట్లపై సమీక్ష

image

ఏపీ పీసీబీలో నియమితులైన గ్రూప్-2, గ్రేడ్-2 ఉద్యోగుల సీపీటీ పరీక్ష శనివారం మూడు సెషన్లలో జరగనున్నది. 186 మంది అభ్యర్థులు గాజువాక ఎస్.ఎస్. సొల్యూషన్స్ కేంద్రంలో జరిగే పరీక్షకు హాజరవుతారు. ఏర్పాట్లను డీఆర్వో భవానీ శంకర్ సమీక్షించారు. అభ్యర్థులు గంట ముందే రాగలరని, ఐడీ కార్డ్ తీసుకురావాలని సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం.

News July 4, 2025

ఆమదాలవలస: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

ఆమదాలవలస ( శ్రీకాకుళం రోడ్డు) రైల్వే స్టేషన్ కు సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ మధుసూదన రావు తెలిపారు. మృతుని వయసు 45 ఏళ్లు ఉండి, ఎర్రని బనియన్, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 9493474582 నంబరును సంప్రదించాలన్నారు.

News July 4, 2025

అల్లూరి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేద్దాం: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

పోరాట యోధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రజలకు సేవలు చేయాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య సూచించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా యువజన సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అల్లూరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెట్కూరు సీఈవో వేణుగోపాల్, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

News July 4, 2025

మహనీయుల సేవలను స్మరించుకోవాలి: కలెక్టర్

image

మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో
శుక్రవారం నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జయంతి, పింగళి వెంకయ్య వర్ధంతి కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఇరువురి మహనీయుల చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

News July 4, 2025

మార్కాపురం జిల్లాపై మాటెత్తని పవన్..!

image

మార్కాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మార్కాపురాన్ని ఎప్పుడు జిల్లా చేస్తామనే దానిపై ఆయన ప్రకటన చేస్తారని ఆశగా చూశారు. కానీ మార్కాపురం జిల్లాపై ఆయన ఏం మాట్లాడలేదు. వెలిగొండ ప్రాజెక్టు భూనిర్వాసితులకు నిధుల కేటాయింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇవాళ ప్రారంభించిన జలజీవన్ మిషన్ పనులను తానే పర్యవేక్షిస్తూ 20నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పడం కాస్త ఊరటనిచ్చే అంశం.

News July 4, 2025

తణుకులో అత్యధిక వర్షపాతం నమోదు

image

గడచిన 24 గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 34.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా తణుకు మండలంలో 12.2, ఆచంట 5.2, పెంటపాడు 4.2, పోడూరు 3.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. యలమంచిలి, పాలకొల్లు, నరసాపురం, మొగల్తూరు, కాళ్ల, భీమవరం, వీరవాసరం మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని వెల్లడించారు.