India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 20,964మంది విద్యార్థులు రాసినట్లు ఆర్ఐఓ ఆదినారాయణ చెప్పారు. జిల్లాలో 166 పరీక్షా కేంద్రాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు 18,686మందికి 18,178మంది ఓకేషనల్ విద్యార్థులు 2980 మందికి 2786మంది హాజరయ్యారన్నారు. పరీక్షలలో ఎటువంటి చూసి రాతలు జరగకుండా ఫ్లైయింగ్ స్క్వాడ్, సిటింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు ఆదినారాయణ చెప్పారు.
ఎమ్మిగనూరు మండలం కడిమెట్లలో జరుగుతున్న భూ రీసర్వేను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా శనివారం పరిశీలించారు. ఎమ్మార్వో శేషఫణితో కలిసి రీ సర్వేలో రైతుల నుంచి వస్తున్న సమస్యలను తెలుసుకున్నారు. మండలంలో నెలకొన్న భూ, తదితర సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా సర్వేను పూర్తి చేయాలని సూచించారు.
మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై భారీగా జరిమానాలు పడుతున్నాయి. SP వకుల్ జిందల్ ఆదేశాలతో విజయనగరం పట్టణ ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 16 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. పట్టుబడ్డ వారిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి పదివేలు చొప్పున 16 మందికి రూ.1.60 లక్షల జరిమానాను విధించారని SP శనివారం తెలిపారు. ప్రమాదాలు నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు.
ఒంగోలు నగరంలోని 49వ డివిజన్లో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో శనివారం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెన్షన్ నగదును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె. ఆదిలక్ష్మి, ఆర్డీవో కె. లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనట్టు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు విద్యాశాఖాధికారి పీబీ సాల్మన్ రాజు తెలిపారు. తొలిరోజు పరీక్షకు 98.03% మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. మొత్తం 24,810 మందికి గాను 24,323 మంది పరీక్షకు హాజరయ్యారని, 487 మంది గైర్హాజరయ్యారన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు జిల్లాలో నమోదు కాలేదన్నారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు శనివారం విశాఖ జిల్లాలో 95% మంది హాజరయ్యారని ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి సుధీర్ తెలిపారు. జనరల్ పరీక్షలకు 41,945 మందికి 40,000 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 1,741 మందికి 1,635 మంది హాజరయ్యారు. అన్ని కోర్సులకు సంబంధించి 43,686 మందికి 41,634 మంది విద్యార్థులు హాజరు కాగా 2,052 గైర్హాజరు అయ్యారు. 95 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
జీడి నెల్లూరులో CM పర్యటన మొదలైంది. ఇందులో భాగంగా ఆయన పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను పంపిణీ చేశారు. అనంతరం పలువురు వారి సమస్యలను CM దృష్టికి తీసుకురాగా.. వాటిని పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ను CM ఆదేశించారు. ఆయన వెంట ఎంపీ దుగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఉన్నారు.
ఎస్.కోటకి చెందిన వ్యక్తి తల్లి చనిపోయిందనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. CI నారాయణమూర్తి వివరాల ప్రకారం.. మండలంలోని అయితన్నపేటకి చెందిన సంతోశ్ కుమార్(35) తల్లి మూడేళ్ల క్రితం మరణించింది. అప్పటి నుంచి మనస్తాపానికి గురైన సంతోశ్ ఫిబ్రవరి 25న మందులో పురుగుమందు కలుపుకొని తాగాడు. దీంతో అతడిని ఎస్.కోట ఆస్పత్రికి తరలించాడు. అక్కడి నుంచి విజయనగరం తరలించగా చికిత్స పొందతూ శుక్రవారం మృతిచెందాడు.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పేపర్ 1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 611 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 23,755 విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 23,144 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని ఆయన వివరించారు.
శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా రూ. 13.78 లక్షలు అదనపు ఆదాయం సమకూరినట్లు రాజమండ్రి ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కె. షర్మిల అశోక ప్రకటించారు. తూ. గో జిల్లా ఆర్టీసీ రీజినల్ పరిధిలో రాజమండ్రి, గోకవరం, నిడదవోలు, కొవ్వూరు డిపోల నుంచి మొత్తం 64 బస్సులు నడిపినట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.