Andhra Pradesh

News March 1, 2025

తూ.గో : ఒక్క నిమిషం వారి కోసం..!

image

తూ.గో జిల్లాలో 51 కేంద్రాలలో 43,754 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులను ఉదయం గం.8.30 ని.ల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.

News March 1, 2025

శ్రీకాకుళం : ఒక్క నిమిషం .. వారి కోసం..!

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 75 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులను ఉదయం గం.8.30 ని.ల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.

News March 1, 2025

తణుకు : ‘చికెన్, గుడ్లు అమ్ముకోవచ్చు’

image

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కీలక ప్రకటన చేశారు. జిల్లాలోని వేల్పూరు గ్రామంలోని కృష్ణా నందం కోళ్ల ఫారం నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో, పెదతాడేపల్లిలోని రామలక్ష్మి కోళ్ల ఫారం నుంచి కి.మీ పరిధిలో మినహా జిల్లాలో గుడ్లు, చికెన్ అమ్మకాలకు ఆంక్షలు కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఏ విధమైన అపోహలు లేకుండా ఉడికించిన గుడ్లు, కోడి మాంసం తినొచ్చని సూచించార.

News March 1, 2025

విద్యార్థులపై కూలిన వృక్షం.. ఏడుగురికి గాయాలు

image

కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామంలో సైన్స్ దినోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. జిల్లా పరిషత్ హైస్కూల్‌లో శుక్రవారం సాయంత్రం ఓ భారీ వృక్షం కూలి విద్యార్థులపై పడింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థినులు గాయపడ్డారు. వారికి స్థానికంగా ప్రథమ చికిత్స అందించిన అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై ఎంపీడీవో రాణెమ్మ ఆరా తీశారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News March 1, 2025

అనంతపురం జిల్లా మహిళలకు శుభవార్త

image

టైలరింగ్‌లో మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ నిరుద్యోగ మహిళలు అర్హులన్నారు. 18-45ఏళ్ల వారు ఆధార్, రేషన్ కార్డుతో అనంతపురంలోని ఆకుతోటపల్లి వద్ద ఉన్న రూట్ సెట్ సంస్థ ఆఫీసులో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మార్చి 2లోపు పేర్లు నమోదు చేసుకోవాలని, 30 రోజుల పాటు శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు.

News March 1, 2025

రోడ్డుప్రమాదంలో విశాఖ వాసి మృతి

image

అల్లూరి జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖ వాసి మృతి చెందాడు. విశాఖ న్యూ పోర్టు కాలనీకి చెందిన రామ్మోహన్, సోమనాథ్ పాడేరు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం అరకులోయ వైపు వెళుతుండగా డుంబ్రిగుడ మండలం నారింజవలస వద్ద స్కూటీ డివైడర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోమనాథ్ మృతిచెందాడు. రామ్మోహన్‌కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు అంబులెన్స్‌లో అరకు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

News March 1, 2025

‘కృష్ణా’లో ఇంటర్ పరీక్షలకు 45,430 మంది

image

జిల్లాలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 63 కేంద్రాల్లో పరీక్షలు జరగనుండగా 45,430 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో జనరల్ విద్యార్థులు 43,795 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1635 మంది ఉన్నారు. ఫస్టియర్‌కు సంబంధించి జనరల్ విద్యార్థులు 23,630, ఒకేషనల్ విద్యార్థులు 927 మంది, సెకండియర్‌కు సంబంధించి జనరల్ విద్యార్థులు 20,175, ఒకేషనల్ విద్యార్థులు 708 మంది ఉన్నారు.

News March 1, 2025

నేడు GD నెల్లూరు రానున్న CM

image

CM చంద్రబాబు నేడు(శనివారం) చిత్తూరు జిల్లా GD నెల్లూరులో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 11.50కు రామానాయుడు పల్లెకు రానున్న ఆయన మ.1 నుంచి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం 3.30కు తిరిగి ప్రయాణం కానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

News March 1, 2025

గోపాలపురం : వైసీపీ నుంచి టీడీపీలోకి

image

టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో ద్వారకా తిరుమలకు చెందిన వైసీపీ నేత, జెడ్పీటీసీ శామ్యూల్ టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ లంకా సత్యనారాయణ, శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం, మాజీ సొసైటీ అధ్యక్షులు తూమపాటి సత్యనారాయణ పాల్గొన్నారు. టీడీపీ విధానాలు నచ్చి పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు ఆయన తెలిపారు.

News March 1, 2025

VZM: ప్రేమ వ్యవహారమే మృతికి కారణం..!

image

తోటపాలెం సమీపంలో బొండపల్లి జనార్ధన్ అనే యువకుడు ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జనార్ధన్ డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడని, డిగ్రీ చదివిన సమయంలో ప్రేమ విఫలమైన కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తండ్రి కుమార్ తెలిపారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.