Andhra Pradesh

News March 1, 2025

ఒంగోలు: బాలికను గర్భవతిని చేశాడు.. పరారయ్యాడు

image

తన పిన్ని కూతురు బర్త్ డే పార్టీ ఇస్తున్నట్లుగా నమ్మించి ఆరిఫ్ బాలికను తన గదికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడు. ఈ విషయం తెలియడంతో ఆ యువకుడు పరారయ్యాడు. ఒంగోలులో ఓ బాలిక తన స్నేహితుడి ద్వారా పరిచయమైంది. బాలికపై కన్నేసిన యువకుడు ఇన్స్టాగ్రామ్‌లో రోజూ చాట్ చేస్తూ పరిచయాన్ని పెంచుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News March 1, 2025

గుంటూరు: హైవేపై యాక్సిడెంట్.. దుర్మరణం

image

వెంకటప్పయ్య కాలనీ వీఐపీ రోడ్డు చివర హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందా లేక మృతిచెందిన ఇతడే వాహనాన్ని ఢీకొట్టాడా అనేది తెలియాల్సి ఉంది. 

News March 1, 2025

VZM: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు 

image

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. విజయనగరం జిల్లాలో 177 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం 20,902, ద్వితీయ సంవత్సరం 20,368మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలని ఆర్ఐఓ ఆదినారాయణ చెప్పారు.

News March 1, 2025

కర్నూలు జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

image

కర్నూలు జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 69 పరీక్ష కేంద్రాల్లో.. మొత్తంగా 23,098 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నిర్వహణకు 950 మంది ఇన్విజిలేటర్లను జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు నియమించారు.☞ విద్యార్థులకు ALL THE BEST

News March 1, 2025

ఎగుమతి పెంచేందుకు కృషి: కడప కలెక్టర్

image

కడప జిల్లాలో పారిశ్రామిక, ఉద్యాన పంటల ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు సూచనలు చేశారు.

News March 1, 2025

ప్రభాకర్ సేవలను కొనియాడిన చిత్తూరు కలెక్టర్

image

జిల్లా పశుసంవర్ధకశాఖలో ఎన్నో సంవత్సరాల పాటు పనిచేస్తూ మూగజీవాలు, రైతులకు డాక్టర్ ప్రభాకర్ చేసిన సేవలు ఎనలేనివని కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రశంసించారు. జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీ)గా పనిచేస్తున్న డాక్టర్ ప్రభాకర్ శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలో మిట్టూరులోని ఎన్పీసీ పెవిలియన్‌లో జరిగిన ప్రభాకర్ పదవీ విరమణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రభాకర్ సేవలను కొనియాడారు.

News March 1, 2025

టెన్త్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలి: కర్నూలు కలెక్టర్ 

image

మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని కలెక్టర్ పి.రంజిత్ బాషా చీఫ్ సూపరింటెండెంట్‌లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సి.ఎస్.లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. 

News March 1, 2025

సీఎస్ వీసీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ 

image

రాష్ట్ర సచివాలయంలోని CS కాన్ఫరెన్స్ హాల్ నుంచి నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. పెన్షన్లు, MSME సర్వే, ఫీడర్ స్థాయి సోలరైజేషన్ పథకానికి భూమి కేటాయింపు తదితర అంశాలపై సీఎస్ దిశానిర్దేశం చేశారు. తక్షణమే వీటిపై తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌కు సూచించారు.

News March 1, 2025

పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్: శ్రీనివాస వర్మ

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం రూ.3.2 లక్షల కోట్ల నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. తెలుగు భాష అభివృద్ధికి రూ.10కోట్లు కేటాయించడంతో పాటు సూపర్ సిక్స్ పథకాల అమలకు నిధులు కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News March 1, 2025

VZM: నేటి నుంచి జర్నలిస్టులకు రెన్యువల్ స్లిప్పులు

image

జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల కాల పరిమితిని ప్రభుత్వం మూడు నెలలు పొడిగించిందని DPRO రమేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం నుంచి కలెక్టరేట్లోని DPRO కార్యాలయంలో రెన్యువల్ స్లిప్పులు పంపిణీ చేస్తామన్నారు. రెన్యువల్ స్లిప్పులతో పాటు అక్రిడేషన్, ఆధార్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో ఆర్టీసీ కార్యాలయానికి వెళితే బస్సు పాస్ ఇస్తారని చెప్పారు.