Andhra Pradesh

News March 1, 2025

సిబ్బంది సమస్యల పరిష్కారమే ధ్యేయం: కడప SP

image

కడప జిల్లాలో పోలీసు శాఖలో సిబ్బంది సమస్యల పరిష్కారం ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్టు ఎస్పీ అశోక్ శుక్రవారం స్పష్టం చేశారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సిబ్బంది నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది, వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఆరోగ్యరీత్యా, వయసు రీత్యా ఉన్న ఇబ్బందులను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి పరిశీలించి పరిష్కరించాలన్నారు.

News March 1, 2025

రూ.45లక్షలతో జీజీహెచ్‌లో మౌలిక వసతులు – కలెక్టర్

image

కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులు రూ.45 లక్షలతో మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని తన ఛాంబర్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. జీజీహెచ్‌లో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు.

News March 1, 2025

బడ్జెట్‌పై కాకాణి ఫైర్

image

వ్యవసాయ బడ్జెట్‌పై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. నెల్లూరులో శుక్రవారం ఆయన  మాట్లాడుతూ.. ఇది వ్యవసాయం రంగాన్ని నిర్వీర్యం చేసే బడ్జెట్‌ అన్నారు. ఆశలు పెట్టుకున్న రైతులకు నయ వంచన తప్ప మరేమీ లేదన్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో మరోసారి రైతు దగా పడ్డారన్నారు. ధరల స్థిరీకరణ నిధికి కేవలం రూ.300 కోట్లు కేటాయించడంతో రైతులు మద్దతు ధర మీద ఆశలు వదిలేయాల్సిందేనన్నారు.

News March 1, 2025

గుంటూరు ఛానల్‌కు నిధుల కేటాయింపు హర్షణీయం: పెమ్మసాని

image

గుంటూరు ఛానల్ విస్తరణకు బడ్జెట్లో నిధులు కేటాయించడం సంతోషంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఛానల్ పొడిగిస్తే అదనంగా 30వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించ వచ్చన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదలకు కృష్ణా బోర్డు అధికారులతో మాట్లాడామన్నారు. సమర్థవంతమైన పరిపాలన ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందనేందుకు ఇదే నిదర్శనమన్నారు. రూ. 500 కోట్లతో భూములు డిజిటలైజేషన్ చేస్తామన్నారు.

News March 1, 2025

ప.గో జిల్లా TODAY TOP HEADLINES

image

✷భీమవరంలో కన్నుల పండుగగా సోమేశ్వర స్వామి తెప్పోత్సవం ✷ పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్: కేంద్ర సహాయ మంత్రి వర్మ ✷ బడ్జెట్ నిరుత్సాహపరిచేలా ఉంది: టీచర్ ఎమ్మెల్సీ గోపి మూర్తి ✷ రాయకుదురులో అగ్ని ప్రమాదం ✷ నరసాపురంలో గోవా మద్యం కేసులో నలుగురు అరెస్ట్✷ ఇరిగేషన్‌కు అధిక నిధులు: మంత్రి నిమ్మల ✷ ఆచంటలో కుంకుమ భరిణీల కోసం బారులు తీరిన జనం

News March 1, 2025

విశాఖలో TODAY TOP NEWS

image

➤ KGHలో నకిలీ డాక్టర్.. రూ.లక్షతో పరార్..!
➤ ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా సంధ్యాదేవి
➤ సింహాద్రి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లు రద్దు
➤ బాధ్యతలు స్వీకరించనున్న AU వీసీ జి.పి రాజుశేఖర్
➤ ప్రత్యేక అలంకరణలో చంద్రంపాలెం దుర్గాలమ్మ
➤ ఆటోనగర్, ఐటీ హిల్స్ ప్రాంతాలకు ప్రత్యేక RTC సర్వీసులు నడపాలి: కలెక్టర్
➤ విశాఖలో చిట్టీల పేరుతో ఘరానా మోసం
➤ జిల్లాలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు రాయనున్న 83,001 మంది

News February 28, 2025

చిత్తూరు జిల్లాలో ఇవాళ్టి ముఖ్య ఘటనలు

image

✒ రోడ్డు ప్రమాదంలో MLA థామస్ బాబాయ్ మృతి
✒ కుప్పం: అంధ యువతి పెళ్లికి CM చంద్రబాబు రూ.5 లక్షల సాయం
✒ కత్తెరపల్లి ZP ఉన్నత పాఠశాలలో సైన్స్ డే వేడుకలు
✒ SRపురం: బెల్లంపాకంలో పడి వ్యక్తి మృతి
✒ పలమనేరులో ఏడుగురు అరెస్ట్
✒ కుప్పంలోని హోటళ్లలో అధికారుల తనిఖీలు

News February 28, 2025

బాధ్యతలు స్వీకరించనున్న ఏయూ వీసీ

image

ఆంధ్ర యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్‌గా జి.పి.రాజశేఖర్ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఏయూ రిజిస్ట్రార్ ధనుంజయరావు శుక్రవారం తెలిపారు. శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన అనంతరం యూనివర్సిటీ విభాగాల అధిపతులను కలుస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి సందర్శకులను కలవనున్నట్లు తెలిపారు. ఇన్నాళ్లు ఏయూ ఇన్ ఛార్జ్ వీసీగా ఉన్న శశిభూషణరావు రేపు బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. 

News February 28, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤ టెన్త్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్➤ అశేష జనవాహిని నడుమ సిద్ధరుఢ స్వామి రథోత్సవం➤మంత్రాలయం శ్రీ మఠంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి➤ రేపు మంత్రాలయానికి మంత్రి నారా లోకేశ్ రాక➤ ఎమ్మెల్యేపై వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ ఫైర్➤ దేవనకొండ: తాను చదువుకున్న పాఠశాలకు రిటైర్డ్ ఐపీఎస్ విరాళం➤ పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తాం: కర్నూల్ కలెక్టర్

News February 28, 2025

మరింత అప్రమత్తంగా ఉంటాం: విశాఖ కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం -2 పథకం అమల్లో మరింత అప్రమత్తంగా ఉంటామని,సబ్సిడీ నగదు వెనువెంటనే లబ్దిదారుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాల స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.