Andhra Pradesh

News February 28, 2025

రెండు రోజుల్లో 24 మందిపై కేసు: VZM ఎస్పీ

image

విజయనగరం సిటీ పరిధిలోని రెండు రోజుల్లో 24 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం తెలిపారు. పట్టణంలో పట్టుబడిన నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ రూ.10 వేలు చొప్పున మొత్తం రూ. 2.40 లక్షల జరిమానా విధించారన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 28, 2025

‘విశాఖను ప్రథమ స్థానంలో నిలపండి’

image

విశాఖలో 2024 స్వచ్ఛ సర్వేక్షన్‌లో ప్రథమ స్థానంలో నిలపాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆర్ సోమనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం జోన్ -3 ఆఫీసులో అధికారులతో సమావేశమయ్యారు. విశాఖలో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం నేరుగా ముఖాముఖిగా, స్వచ్ఛత యాప్, వెబ్సైట్ లింకు ద్వారా సేకరించడం జరుగుతుందన్నారు. విశాఖ నగర అభివృద్ధికి, నగరాన్ని దేశంలోనే ప్రథమ స్థానం లక్ష్యసాధనకు ప్రజలుకు అవగాహన కల్పించాలన్నారు.

News February 28, 2025

పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా అనుమతులు: జేసీ

image

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా అనుమతులను మంజూరు చేయాలని జేసీ కార్తీక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల పురోగతి, పిఎంఈజిపి రుణాల మంజూరు, క్లస్టర్‌ డెవలప్‌మెంటు ప్రోగ్రాం  అంశాలను జిల్లా పరిశ్రమల శాఖ జిఎం ప్రసాద్‌ వివరించారు.

News February 28, 2025

రాజమండ్రి: ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు- ఎస్పీ

image

రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన్నట్లు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ వెల్లడించారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.

News February 28, 2025

పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్: శ్రీనివాస వర్మ

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం రూ.3.2 లక్షల కోట్ల నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. తెలుగు భాష అభివృద్ధికి రూ.10కోట్లు కేటాయించడంతో పాటు సూపర్ సిక్స్ పథకాల అమలకు నిధులు కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News February 28, 2025

ప్రకాశం: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

ప్రకాశం జిల్లాలో మార్చి ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్ఐవో సైమన్ విక్టరీ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో 5 సమస్యాత్మకమైన కేంద్రాలుగా గుర్తించామని.. అక్కడ ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు.

News February 28, 2025

నిరుద్యోగుల‌కి ఉపాధి కల్పించేలా చర్యలు: క‌లెక్ట‌ర్

image

రాబోయే ఆర్థిక సంవత్సరంలో మంచి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఎక్కువ మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ స్కిల్ డెవలప్మెంట్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ 2025-26 పై సమీక్షా సమావేశం నిర్వహించారు.  

News February 28, 2025

ఏప్రిల్ 1 నాటికి మానాపురం ఫ్లైఓవర్ పూర్తి కావాలి: కలెక్టర్

image

మానాపురం ఫ్లైఓవర్ ఏప్రిల్ నాటికి ప్రారంభం అయ్యేలా పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ అంబేడ్క‌ర్ తెలిపారు. శుక్రవారం ఆయన ఛాంబర్‌లో నేషనల్ హైవే, ఆర్‌అండ్‌బి అధికారులు, కాంట్రాక్టర్‌లతో ఆర్.ఓ.బి పనులపై సమీక్షించారు. మార్చి లోపల మిగిలిన 18 శాతం పూర్తి చేసి ఏప్రిల్ 1 నాటికి ప్రారంభించడానికి సిద్ధం చేయాలనీ ఆదేశించారు. పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

News February 28, 2025

రేపు మంత్రాలయానికి నారా లోకేశ్

image

మంత్రి నారా లోకేశ్ రేపు మంత్రాలయం రానున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం ఆయన వస్తుండటంతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ ప్రాంగణం, గెస్ట్ హౌస్, ఆలయ ప్రాంగణాన్ని ఎస్పీ పరిశీలించారు. లోకేశ్ పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.

News February 28, 2025

పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తాం: కర్నూల్ కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ (DIEPC) సమావేశం జరిగింది. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రతిపాదనలను రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.