India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ డివిజన్లోని కడియం ద్వారపూడి అనపర్తి రైల్వే స్టేషన్ మధ్య నాన్ ఎంటర్ లాకింగ్ పనులు నిమిత్తం మార్చి 1,2,3 తేదీల్లో గుంటూరు- విశాఖ- గుంటూరు (17239/17240 ) విశాఖ-లింగంపల్లి-విశాఖపట్నం నడిచే (12805/12806) రైళ్లను రద్దు చేసినట్లు విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ రైళ్లల్లో రిజర్వేషన్ పొందిన ప్రయాణికులకు డబ్బు వాపస్ ఇస్తామని అధికారులు తెలిపారు.
జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగు హాలులో డీఐఈపీసీ సమావేశం నిర్వహించారు. గాజువాక, ఆటోనగర్, పెదగంట్యాడ, అగనంపూడిలో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం గుర్తించాలన్నారు. ఆటోనగర్, ఐటీ హిల్స్ ప్రాంతాలకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు నడపాలని ఆదేశించారు.
ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని DM &HO డాక్టర్ టీవీ బాలమురళీకృష్ణ అన్నారు. శుక్రవారం తన పర్యటనలో భాగంగా శ్రీకాకుళంలోని ఆదివారంపేట పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగిన ఎఫ్.ఎం.ఎం కిట్లు పంపిణీలో పాల్గొన్నారు. ఫైలేరియా ( బోదకాలు) రోగులకు పలు సూచనలు చేశారు. రోగులకు ఫైలేరియా మార్బులిటి మేనేజ్మెంట్ కిట్లతో కలిగే ఉపయోగాలను ఆయన వివరించారు.
సంతబొమ్మాళి మండలం చెట్ల తాండ్ర గ్రామానికి చెందిన డొక్కరి రాజేశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డ్ ప్రకటించింది. గతేడాది జులై 15న జమ్మూకశ్మీర్ దొడా జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో డొక్కరి రాజేశ్ గాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి రూ.5 లక్షలు రివార్డును ప్రకటిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని కలెక్టర్ పి.రంజిత్ బాషా చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సి.ఎస్.లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు.
అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం మొబైల్ ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ మేళాలో జిల్లా ఎస్పీ జగదీశ్ రూ.2.95కోట్ల విలువ చేసే 1,183 ఫోన్లను బాధితులకి అందజేశారు. సాంకేతికత వినియోగించి ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ చెప్పారు. ఇప్పటి వరకు జిల్లా పోలీసు శాఖ 11,378 పోన్లు రికవరీ చేసిందని తెలిపారు. వాటి విలువ సుమారు రూ.21.08 కోట్లు ఉంటుందని వెల్లడించారు.
➤ మార్చి 2న ఉదయం నేత్రోత్సవం, పాలధార ఉత్సవం, సాయంత్రం భామా కలాపం పేరిట భాగవతం ప్రదర్శన
➤ మార్చి 2న రాత్రి 7గంటలకు రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీలు
➤ 3న సాయంత్రం క్లాసికల్ డాన్స్ ప్రోగ్రాం, ప్రముఖ సినీ గాయకులచే స్వరాభిషేకం, బాలు రైడర్స్ ఆధ్వర్యంలో డాన్స్ ఈవెంట్
➤ 4న రాత్రి ఢీ డ్యాన్సర్లతో మెగా డాన్స్ హంగామా, 11 గంటలకు భారీ మందుగుండు ప్రదర్శన, శ్రీరామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర నాటకం
అసెంబ్లీలో శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్తో సూపర్-6 పథకాలకు చిల్లు పెడుతున్నారని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ను అంకెల గారడిగా అభివర్ణించారు. రైతులు, మహిళలు, ఉద్యోగులకు బడ్జెట్లో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు మోసపూరిత విధానం బహిర్గతం అయ్యిందన్నారు.
వన్యప్రాణుల హావభావాలను మంత్రముగ్ధులు కాని వారు ఎవరూ ఉండరు. మానవ నేస్తాలుగా వన్యప్రాణులు వ్యవహరిస్తూ విశాఖ జూపార్క్లో ఒక సాంబార్ డీర్ అందరినీ ఆకట్టుకుంటుంది. కళాశాల విద్యార్థులు,సందర్శకులు దీనితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు. సెల్ఫీ ఇవ్వడానికి నేను రెఢీ.. మరి మీరు రెఢీనా అన్నట్లుగా ఏమాత్రం భయం లేకుండా ఆ సాంబార్ డీర్ సందర్శకులను ఎంతగానో అలరిస్తుంది. ఇలాంటి దృశ్యాలు ఎన్నో జూలో సాక్షాత్కరిస్తాయి.
ప్రకాశం జిల్లాలో మార్చి ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్ఐవో సైమన్ విక్టరీ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో 5 సమస్యాత్మకమైన కేంద్రాలుగా గుర్తించామని.. అక్కడ ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు.
Sorry, no posts matched your criteria.