India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గూడూరు ఆదిశంకర College వద్ద నిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆగి ఉన్న లారీని TATA AC ఢీకొనడంతో చిత్తూరుకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గూడూరులోని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన సమయానికి 65.43 శాతం ఓటింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని అని తెలిపారు.
డాబా గార్డెన్ వద్ద గల నీలమ్మ వేప చెట్టు సమీపంలో మెడికల్ స్టోర్ వద్ద గురువారం ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే.అతడు మందులు కొనడానికి వచ్చి అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న 108 సిబ్బంది అతడు మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి వద్ద మందుల చీటీ మాత్రమే ఉండడంతో టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టి విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలానికి చెందిన రమణ (60)గా గుర్తించారు.
రెండేళ్ల క్రితం జిల్లా వ్యాప్తంగా సంచలన రేపిన ప్రేమ వివాహం నేడు విషాదంతో ముగిసింది. పొదలకూరు(M), మర్రిపల్లికి చెందిన శివప్రియ అనే అమ్మాయిని నెల్లూరు రూరల్కి చెందిన నాగ సాయి అనే యువకుడు రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో ఆ వివాహం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిన్న భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో శివప్రియ ఆత్మహత్య చేసుకుంది. భర్త నాగసాయి పోలీసులకు తెలియజేశారు.
ముసునూరు మండలం బలివేలో మహాశివరాత్రి ఉత్సవాల్లో మరణ మృదంగం మోగుతోంది. 24 గంటల వ్యవధిలోనే ముగ్గురు మృతి చెందడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. లింగపాలెంకు చెందిన వెంకటేశ్వరరావు, అతని తమ్ముని కుమారుడు సుబ్రహ్మణ్యం మృతిచెందగా..మరుసటిరోజునే అక్కిరెడ్డిగూడేనికి చెందిన H. రాంబాబును గురువారం బలివే తమ్మిలేరు బలితీసుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జల్లుల స్నానం చేయాలని సూచించారు.
గాజువాకలో ఓ చిన్నారిపై అత్యాచారయత్నం జరిగినట్లు గాజువాక పోలీసులకు ఫిర్యాదు అందింది. ఐదు సంవత్సరాల చిన్నారికి సన్నీబాబు అనే వ్యక్తి గురువారం మాయ మాటలు చెప్పి అత్యాచారానికి యత్నించడంతో ఆ చిన్నారి కేకలు వేసి తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి నిందితుడిని గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
భీమవరం పట్టణంలోని ఓ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న యువకుడు మృతి చెందాడు. మృతుడు గోపాలపురం మండలం కరిచర్లగూడెంకి చెందిన ఖండవల్లి శ్రీనివాస్ (28)గా తెలుస్తోంది. మూడు సంవత్సరాలుగా అదే హాస్పిటల్లో పనిచేస్తుండగా.. గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు అన్న శివకు ఫోన్ ద్వారా తెలిపారు. బంధువులు అనుమానంతో ఆసుపత్రి యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
విశాఖలో విజయనగరం జిల్లా వాసి గురువారం మృతిచెందాడు. డాబా గార్డెన్ వద్ద గల నీలమ్మ వేప చెట్టు సమీపంలో మెడికల్ స్టోర్ వద్దకు వచ్చి మందులు తీసుకునే సమయంలో ఓ వ్యక్తి కుప్పకూపోయాడు. స్థానికులు 108కి సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది అతడు మృతిచెందినట్లు తెలిపారు. అతని వద్ద మందుల చీటీ మాత్రమే ఉండడంతో టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టి మెరకముడిదాం మండలానికి చెందిన రమణ (60)గా గుర్తించారు.
యాడికి మండలం చందన రెవెన్యూ గ్రామాల్లో గురువారం రీ సర్వేను జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ పరిశీలించారు. రీ సర్వే జరుగుతున్న విధానాన్ని దగ్గరుండి పరిశీలించారు. రీ సర్వేకు వెళ్లే ముందు రోజే సంబంధిత రైతులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలన్నారు. ఒకవేళ రైతులు హాజరు కాకపోతే మూడుసార్లు అవకాశం ఇవ్వాలన్నారు. రీ సర్వేను పగడ్బందీగా నిర్వహించాలన్నారు.
కార్వేటినగరం మండలం అల్లాగుంట గ్రామానికి చెందిన చొక్కలింగం(70) నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెదురుకుప్పం మండలం చవటగుంటకు చెందిన గోవర్ధన్ బైకుపై కార్వేటినగరం నుంచి పళ్లిపట్టుకు వెళుతూ చొక్కలింగంను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో చొక్కలింగం అక్కడికక్కడే మృతి చెందగా.. గోవర్ధన్కి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ చిన్నాన్నగా స్థానికులు గుర్తించారు.
Sorry, no posts matched your criteria.