Andhra Pradesh

News February 28, 2025

చిత్తూరు: జర్నలిస్టుల అక్రిడేషన్ గడువు పెంపు

image

జిల్లాలో ఫిబ్రవరి 28 తో ముగియనున్న జర్నలిస్టుల అక్రిడేషన్‌ను పొడిగిస్తూ సమాచార పౌర సంబంధ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం తెలిపారు. మార్చి 1 నుంచి మే 31 వరకు లేక కొత్త కార్డులు మంజూరు చేయడం ఏది ముందు జరిగితే అప్పటివరకు కాల పరిమితిని పొడిగించినట్లు ఆయన చెప్పారు. ఫిబ్రవరి 28 నాటికి అక్రిడేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే ఈ సౌకర్యం ఉంటుందన్నారు.

News February 28, 2025

నెల్లూరుకి కేంద్రం బాధ్యతను అప్పగించింది : వీసీ

image

వికసిత్ భారత్ నేషనల్ యూత్ పార్లమెంట్ 2025ను జిల్లా స్థాయిలో నిర్వహించడానికి వీఎస్‌యూ, ఎన్ఎస్‌ఎస్‌, నెల్లూరు నెహ్రూ యువ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యతను అప్పగించిందని వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు తెలిపారు. వికసిత్ భారత్ నేషనల్ యూత్ పార్లమెంట్ 2025 కు సంబంధించిన గోడ ప్రతులను  ఆవిష్కరించారు. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వీసీ సూచించారు.

News February 28, 2025

డ్రగ్స్, సర్జికల్స్ అందుబాటులో ఉంచాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు అవసరమైన డ్రగ్స్, సర్జికల్స్ కచ్చితంగా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ వినోద్ కుమార్. ఆదేశించారు. గురువారం అనంతపురంలోని శారద నగర్‌లో ఉన్న ఏపీఎంఎస్ఐడీసీ సెంట్రల్ డ్రగ్స్ స్టోర్‌ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన మందుల సరఫరాలో ఎలాంటి లోటూ ఉండరాదన్నారు.

News February 28, 2025

కడప జిల్లాను నాటుసారా రహితంగా మార్చాలి: కలెక్టర్

image

కడప జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా మార్చడమే నవోదయం 2.0 ప్రధాన ఉద్దేశమని, ఆ దిశగా జిల్లాలో సమూలంగా నాటుసారాను నిర్మూలించాలని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలనా కార్యక్రమం నవోదయం 2.0పై జిల్లా SP అశోక్ కుమార్, DRO విశ్వేశ్వర నాయుడుతో కలిసి కలెక్టర్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.

News February 28, 2025

శ్రీకాకుళంలో మార్చి 3న మెగా జాబ్ మేళా

image

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో మార్చి 3వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ వై పోలినాయుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్న పది, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల కల్పిస్తున్నామన్నారు. ఈ మేళాలో 12 సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారని స్పష్టం చేశారు.

News February 28, 2025

తూ.గో: వచ్చేనెల 1 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు

image

తూ.గో జిల్లాలో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్‌ఐఓ ఎన్ఎస్ వీఎల్ నరసింహం గురువారం తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 20,591 మంది, ఒకేషనల్‌లో 2,226 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు చెప్పారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్‌లో 19,062 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఆయన వివరించారు.

News February 28, 2025

ఒంగోలు: ‘క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిండి’

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు గురువారం తన ఛాంబర్‌లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు పైబడిన వారికి నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌కు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఏఎన్ఎంలు క్యాన్సర్ అనుమానిత కేసులను వైద్యాధికారికి తెలపాలన్నారు.

News February 28, 2025

విశాఖ జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤ శివరాత్రి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలీసుల సేవలపై ప్రశంసలు 
➤ ప్రశాంతంగా ముగిసిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు 
➤ జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాలలో 87.30 శాతం పోలింగ్ 
➤ KGHలో శిశువులు మార్పిడి.. ప్రత్యేక విచారణ కమిటీ 
➤ అప్పికొండ బీచ్‌లో విధి నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్‌కు అస్వస్థత 
➤ కంచరపాలెంలో తల్లి మందలించిందని 9వ తరగతి విద్యార్థి మృతి

News February 27, 2025

మెరకముడదాంలో వందశాతం పోలింగ్

image

మెరకముడిదాం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. ఈ ఎన్నికలలో 100% పోలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. మెరకముడిదం మండలంలో మొత్తం 55 ఓట్లు ఉండగా మెుత్తం 55 ఓట్లు నమోదైయాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగలేదని ఓటింగ్ ప్రశాంతంగా అయిందని అధికారులు తెలిపారు.

News February 27, 2025

ప.గో జిల్లాలో: TODAY TOP HEADLINES

image

✷ ప.గో జిల్లాలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు✷ జిల్లాలో 65 శాతం పోలింగ్ ✷ శోభాయ మానంగా సోమేశ్వరుని రథోత్సవం.✷ సోమేశ్వర స్వామి రథోత్సవంలో అపశృతి ✷ భీమవరంలో యువకుడి మృతి ✷ తణుకులో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్✷ దేవాలో గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి ✷ రేలంగులో అడుగడుగున వ్యర్ధాలు ✷తణుకులో ప్రభుత్వ హామీలు అమలు చేయాలి.