India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు సమయానికి 27.28% శాతంగా నమోదైందన్నారు. పట్టభద్రులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు.
విశాఖలోని డాబా గార్డెన్ వద్ద గల నీలమ్మ వేప చెట్టు సమీపంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు మెడికల్ స్టోర్ వద్దకు వచ్చి మందులు తీసుకునే సమయంలో కుప్పకూలి పడిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న టూ టౌన్ పోలీసులు మృతుని వివరాలపై ఆరా తీశారు. అతని వద్ద కేవలం మందుల చీటీ తప్ప మరే ఆధారం లేకపోవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH)లో శిశువుల మార్పిడి ఘటన కలకలం రేపింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శివానంద్ దీనిపై స్పందించారు. ఈ మార్పిడి ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఏడుగురు అధికారులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే సీసీ ఫుటేజీ ఆధారంగా అసలు విషయం వెలుగులోకి వస్తుందన్నారు.
కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 1 2గంటలకు 30.59% ఓట్లు పోలయ్యాయి. జిల్లాలో మొత్తం 63,144 ఓట్లు ఉండగా ఇప్పటి వరకు 19,306 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలెక్టర్ డీకే బాలాజీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మచిలీపట్నం సెయింట్ జాన్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో కలెక్టర్ ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా పోలీసులు పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు కృష్ణాజిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు 7,859 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.12.45 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు సూచించారు. ఓటు హక్కు ప్రజల బాధ్యత అన్నారు.
శ్రీకాకుళంలో జరుగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు 23.93 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లా అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్న ఓటింగ్ తీరును పర్యవేక్షిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
నోరుంది కదా అని నీచంగా వాగేవాళ్లకు ఏ గతి పడుతుందో పోసాని ఉదంతమే నిదర్శమని MLA సోమిరెడ్డి తెలిపారు. పోసాని అరెస్టుపై స్పందిస్తూ.. ఈ ఘటనను తెలుగు ప్రజలందరూ స్వాగతిస్తున్నారన్నారు. CM చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రి లోకేశ్పై ఆయన వాడిన భాషకు 111 సెక్షన్ చాలదేమో అని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఓ డైరెక్టర్ను మాత్రం అరెస్ట్ చేయకపోవడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు సోమిరెడ్డి పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చే నెల మొదటి వారంలో ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. 5, 6, 7వ తేదీల్లో ఆయన జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన యర్రగొండపాలెం, దోర్నాల మండలాల్లో పర్యటించి ఉపాధి పనులను, పంట కుంటలను పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. కాగా ఇప్పటికే అందుకు సంబందించిన ఏర్పాట్లలో డ్వామా అధికారులు నిమగ్నమయ్యారు.
పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో గల పెద్ద చెరువులో ఇద్దరు వ్యక్తులు పడి గల్లంతైన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన జుజ్జువరపు వెంకటేశ్వరరావు (58)చెరువులో మునిగిపోతున్న క్రమంలో.. కాపాడేందుకు యత్నించిన తమ్ముడి కుమారుడు సుబ్రహ్మణ్యం (32) మృతి చెందాడు. వారి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Sorry, no posts matched your criteria.