Andhra Pradesh

News February 27, 2025

Way2News ఎఫెక్ట్: గండిపాలెం గురుకులానికి అధికారుల పరుగులు 

image

ఉదయగిరి(M) గండిపాలెం గురుకులంలో 23న విద్యార్థులతో <<15553238>>వంటపనులు<<>> చేయిస్తున్న అంశంపై Way2Newsలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అధికారులు చర్యలు చేపట్టారు. విద్యాశాఖ త్రిసభ్య కమిటీ ఏర్పాటు, జునైల్ కోర్టులో ఫిర్యాదు, AP కన్జూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆరా, బాలల సంరక్షణ కమిషనర్ విచారణ చకచకా జరుగుతున్నాయి. బాలల హక్కుల కమిషనర్ ఈ ఘటనపై మూడు రోజుల్లో నివేదిక కోరింది. మరి విద్యార్థులకు న్యాయం దక్కేనా.?

News February 27, 2025

ఒంగోలు: హోంవర్క్ నెపంతో విద్యార్థికి వాత పెట్టిన టీచర్

image

ఒంగోలులోని గంటపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 20న విద్యార్థి హోంవర్క్ చేయలేదన్న కారణంతో ఆగ్రహంతో ఊగిపోయిన సాబిదా అనే ట్యూషన్ టీచర్ అట్లకాడ కాల్చి పిరుదుల మీద విచక్షణారహితంగా వాతలు పెట్టింది. ఆ విద్యార్థికి కాల్చిన చోట పుండ్లు పడటంతో నొప్పి భరించలేక తల్లికి చెప్పడంతో టీచర్ నిర్వాకం వెలుగు చూసింది. ఇదేమిటి అని ప్రశ్నించినందుకు ఆమె భర్త చంపుతామని బెదిరించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 27, 2025

గుంటూరులో యాక్సిడెంట్ ఇద్దరు దుర్మరణం.!

image

కాకానిరోడ్డులోని వాసవీ మార్కెట్ వద్ద మూడు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన సి.హెచ్ వెంకటేశ్ (15), లాలాపేట ప్రాంతానికి చెందిన అలీ (28) ఈ ప్రమాదంలో మరణించారు. మరో యువకుడు గాయపడినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 27, 2025

భోగాపురంలో చీటీల పేరుతో మోసం.. భార్యాభర్తల అరెస్ట్

image

భోగాపురంలో చీటీల పేరుతో మోసం చేసిన కేసులో భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. భోగాపురంలో ఉంటున్న భార్యాభర్తలు తులసీ, మురళీ చీటీలు నిర్వహించేవారు. చీటీ పూర్తయిన వారికి డబ్బులు చెల్లించకుండా పరారీలో ఉన్నారు. దీంతో రూ.30 కోట్ల వరకు నష్టపోయామంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దార్యాప్తు చేపట్టారు. పోలీసులు ఈనెల 25న రాజమహేంద్రవరంలో వీరిని అదుపులోకి తీసుకొని బుధవారం విజయనగరం కోర్టులో హాజరుపరిచారు.

News February 27, 2025

కృష్ణా: నేడే ఎమ్మెల్సీ పోలింగ్.. ఓటు వేశారా.?

image

కృష్ణా జిల్లాలో నేడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఈ విధంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 77 పోలింగ్ కేంద్రాలు ఉండగా 63,190 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 35,378, స్త్రీలు 27,807, ఇతరులు ఐదుగురు ఉన్నారు. నేడు ఎన్నికలు జరగగా.. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. కూటమి అభ్యర్థి అలపాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్య పోటీ ఉండనుంది. 

News February 27, 2025

ఎచ్చెర్ల : ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

image

విజయనగరంలో ఎచ్చెర్లకు చెందిన విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లోకేశ్ స్థానిక బొడ్డువారి జంక్షన్‌లో ఫ్రెండ్స్‌తో ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.

News February 27, 2025

బద్వేలు: అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

image

బద్వేలుకు చెందిన ఆరు సంవత్సరాల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లిదండ్రుల వివరాల మేరకు.. బద్వేలులోని ఓ ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతున్న మంజుల అనే బాలిక స్పృహ కోల్పోయింది. హుటాహుటిన అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 27, 2025

బ్రెయిన్ స్ట్రోక్‌తో యువకుడి మృతి

image

ఉరవకొండ మండలం వై.రాంపురం గ్రామానికి చెందిన బోయ నింబగంటి వేణు (22) అనే యువకుడు బ్రెయిన్ స్ట్రోక్‌తో బుధవారం రాత్రి మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం ఉన్నఫళంగా కళ్లు తిరిగి పడిపోవడంతో కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు కర్నూలు తీసుకెళ్లమని సూచించారు. ఈ క్రమంలోని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News February 27, 2025

రోడ్డు ప్రమాదంలో రాజమండ్రి వాసి మృతి 

image

కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా కొర్రపాటి నాగ మురళి శివప్రసాద్ (45) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో బుధవారం మృతి చెందాడు. దీంతో ఆయన నివాస ప్రాంతo అన్నపూర్ణమ్మ పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆటో డ్రైవర్‌గా ఉన్న శివప్రసాద్ గత వారం కుంభమేళాకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బీహార్‌లోని గయలో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నేడు రాజమండ్రికి ఆయన భౌతికకాయం రానుంది.

News February 27, 2025

తల్లి మందలించిందని బాలుడి సూసైడ్

image

కంచరపాలెం సమీపంలోని కేవీ స్కూల్లో 9వ తరగతిచదువుతున్న దాసరి ఎర్రినిబాబు తన ఇంట్లో మేడపై బాత్రూంలో నైలాన్ తాడుతూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్కూల్ సెలవు కావడంతో ఉదయం నుంచి ఇంటికి రాకపోవడంతో తల్లి ఎర్రినిబాబును మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు సాయంత్రం మేడ మీదకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.