India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొత్తమ్మ తల్లి జాతర ప్రారంభం కానుంది. దీని వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.1925లో కోటబొమ్మాళికి చెందిన చిన్నప్పలనాయుడు ఎడ్లబండిపై నారాయణవలస సంత నుంచి వస్తుండగా ఓ ముసలి ముత్తైదువు బండెక్కింది. కోటబొమ్మాళికి చేరాక గజ్జల శబ్ధంతో అదృశ్యమైంది. ఆ రాత్రి కలలో “నేనే కొత్తమ్మతల్లి, పట్నాయకుని వెంకటేశ్వరరావు తోటలో ఆలయాన్ని కట్టండి. ఏటా పోలాల అమావాస్య తర్వాత ఉత్సవాలు జరపండి” అని చెప్పినట్లు సమాచారం.
తుగ్గలి మండలంలోని గుండాల తండాకు చెందిన ట్రాన్స్జెండర్ సమీరా చెక్కభజన కళారంగంలో ప్రతిభ కనబరిచి జాతీయ అవార్డు పొందారు. ఆదివారం ఢిల్లీలో హర్యానా ఆర్థిక మంత్రి రాఘవేంద్రరావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ గౌరవం ఎంతో సంతోషం కలిగించిందని సమీరా తెలిపారు. ప్రజలు అభినందనలు తెలిపారు.
జమిలీ ఎన్నికలు సహృద్భావ వాతావరణంలో జరగాలని, ఈ అంశంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ అవసరమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. రాజమండ్రి మంజీరా హోటల్లో “వన్ నేషన్-వన్ ఎలక్షన్”కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే కేంద్ర, రాష్ట్రాలకు ఎన్నికల వ్యయం తగ్గుతుందన్నారు. ప్రజాస్వామ్యం బలపడటంతో పాటు సమగ్రాభివృద్ధి కోసం ఇది విప్లవాత్మక సంస్కరణ అన్నారు.
పెనుమూరు మండలంలోని సీఆర్. కండ్రిగ గ్రామ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి శకుంతలకు కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెన్షన్ ఆర్డర్లు జారీ చేశారు. పెనుమూరు ఎంపీడీవో ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆమె రిజిస్టర్లో సంతకం చేయకపోవడంతో పాటు బయోమెట్రిక్ హాజరు కూడా నమోదు కాలేదని అన్నారు. కారణం ఏమిటని అడగ్గా సమాధానం సక్రమంగా లేని కారణంగా చర్యలు చేపట్టారు.
మాజీ DCMS చైర్మన్ వీరి చలపతిని నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం ఆయన్ని కోవూరు ఇన్ఛార్జ్ మేజిస్టేట్ ముందు పోలీసులు హాజరు పరిచారు. న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించించారు. ఈ క్రమంలో ఆయన పరామర్శించేందుకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పోలీస్ స్టేషన్ వద్దకు, కోర్టు వద్దకు చేరుకున్నారు.
విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం PGRS జరుగుతుందని కలెక్టర్ రామ సుందర రెడ్డి ఆదివారం తెలిపారు. తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చని అన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్ను కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విశాఖ పోలీసులకు అరుదైన గౌరవం దక్కింది. రోడ్డు ప్రమాద బాధితులకు విశాఖ సీపీ ఏర్పాటు చేసిన తక్షణ సహాయ కేంద్రంకు స్కోచ్ అవార్డు లభించింది.ఈ అవార్డును సెప్టెంబర్ 20న విశాఖ పోలీసులకు ప్రధానం చేసినట్లు విశాఖ సిపి శంక బ్రత బాగ్చి ఆదివారం ప్రకటనలో విడుదల చేశారు. భారతదేశమైన మొట్టమొదటిసారిగా రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం అందించడం పట్ల అవార్డు దక్కిందని పేర్కొన్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలి గౌవనంపల్లి జర్నలిస్టు కాలనీ ఫేజ్–3లో బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు జెండా ఊపి బోనాలను ప్రారంభించారు. అనంతరం మహిళలు రంగురంగుల బతుకమ్మలను అలంకరించి పాటలతో సందడి చేశారు. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఎంపీ ప్రసాదరావు ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమానికి వచ్చే అర్జీదారులు 1100 నంబర్పై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. కలెక్టర్ మీకోసం కార్యక్రమంలో సమర్పించిన అర్జీల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 నంబర్కు అర్జీదారులు కాల్ చేయవచ్చని ఆయన తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో మీకోసం కార్యక్రమం సాగుతుందని తెలిపారు.
అనంతపురం జిల్లాలో RDT అంటే స్వచ్ఛంద సంస్థలు కాదని లక్షల మంది పేదల జీవితాలను మార్చిందని రాష్ట్ర ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచు ఫెర్రర్ అన్నారు. శనివారం అమరావతిలోని సచివాలయంలో మంత్రి నారా లోకేశ్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఆర్డీటీ సేవలు కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ను ఫెర్రర్ కోరారు. కాగా RDT సేవలపై లోకేశ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.