India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మందస మండలం కొర్రాయిగేట్ సమీపంలో NH16 రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతదేహాన్ని శ్రీకాకుళం RIMS హాస్పిటల్లో మార్చురీ గది వద్ద ఆచూకీ కోసం ఉంచారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఆచూకీ తెలిసిన వారు మందస స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు.
అతిసార లక్షణాలున్న ప్రాంతాల్లో 33 బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ నెల 16 నుంచి ఇప్పటివరకు 80 కేసులు నమోదయ్యాయని చెప్పారు. జీజీహెచ్లో చికిత్స పొందుతున్నవారిలో 13 మందిని సాధారణ వార్డులకు తరలించామని, 11 మంది డిశ్చార్జ్ అయ్యారని వివరించారు.
కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం విశాఖలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.05కి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడనుండి నగరంలోని ప్రైవేట్ హోటల్కి చేరుకుని 3 నుంచి 4.30 వరకు 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సుకు హాజరవుతారు. సాయంత్రం ఐదు గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్తారు. ఈ సదస్సుకి సీఎం చంద్రబాబు కూడా హాజరవుతున్నారు.
సోమశిల జలాశయానికి భారీగా వరద పెరుగుతుంది. ఆదివారం ఎగువ ప్రాంతాల నుంచి 50,138 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి సామర్థ్యం 78 TMCలు కాగా 73.246 TMCల నీటిమట్టం నమోదైంది. జలాశయం క్రస్ట్ గేట్లు ఎత్తి పెన్నాడెల్టాకు 47,200, కండలేరుకు 10,200 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఛైర్మన్ వేలూరు కేశవ చౌదరి, అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
ప్రతి సోమవారం విశాఖ కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్ను సెప్టెంబర్ 22న రద్దు చేశారు. విశాఖలో సెప్టెంబరు 22, 23వ తేదీలలో జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు నిర్వహించనున్నారని, ఈ సదస్సులో అధికారులు పాల్గొనవలసి ఉంటుందని కలెక్టర్ హరేంద్రప్రసాద్ తెలిపారు. దీంతో పీజీఆర్ఎస్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
మార్క్ఫెడ్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన 14 వేల క్వింటాళ్ల ఉల్లిని రూ.100కే 45 కిలోలు విక్రయిస్తున్నామని, వినియోగదారులు, వ్యాపారులు వినియోగించుకోవాలని కలెక్టర్ డాక్టర్ సిరి వెల్లడించారు. ఆదివారం కర్నూలు మార్కెట్ యార్డును జేసీ నవ్యతో కలిసి ఆమె పరిశీలించారు. రైతులకు హెక్టార్కు రూ.50 వేలు పరిహారం ఇస్తున్నందున ఈనెల 22 నుంచి మద్దతు ధర రూ.1,200 కలిపి వేస్తున్నామన్నారు.
ప్రొద్దుటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక అలంకారంతో దర్శనమిస్తారు. చివరి రోజు అమ్మవారు ఊరేగింపు అంగరంగ వైభవంగా పురవీధులలో ఊరేగింపు చేయడం జిల్లాకే తలమానికంగా నిలుస్తుంది. పలు రకాల కళాకారులు నృత్య ప్రదర్శన, బాణాసంచ పేల్చడం ఒక ప్రత్యేకత సంచరించుకుంది. ఊరేగింపును తిలకించడానికి పక్క జిల్లా నుంచి కూడా భక్తులు పోటెత్తుతారు.
విశాఖలో సెప్టెంబర్ 22, 23 తేదీలలో జరగనున్న 28వ జాతీయ ఈ-గవరన్నెన్స్ సదస్సును విజయవంతం చేయాలని జాయింట్ సెక్రటరీ సరితా చౌహాన్, రాష్ట్ర ఐటీ సెక్రటరీ కాటమనేని భాస్కర్ నిర్దేశించారు. ఆదివారం విశాఖ కలెక్టరేట్లో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఇతర అధికారులతో కలిసి సమీక్షా నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
చాపాడు సమీపంలోని కుందూ నదిలో ఆదివారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహం ఇటీవల ప్రొద్దుటూరులో కిడ్నాప్కు గురైన వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి మృతదేహమే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోలీసులు బయటికి వెలికి తీశారు. వేణుగోపాల్ రెడ్డిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన తర్వాత నదిలో పడేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.
ప్రొద్దుటూరులో టీడీపీ, వైసీపీ నాయకుల నడుమ పొలిటికల్ వార్ జరుగుతోంది. ప్రభుత్వంలో హోదాలేని MLA కుమారుడు కొండారెడ్డిని ప్రభుత్వ కార్యక్రమాల్లోకి ఆహ్వానిస్తున్న అధికారుల పేర్లను బ్యాడ్ మెమోరీస్ బుక్లో రాసుకుంటున్నానని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శనివారం హెచ్చరించారు. దీనిపై ఆదివారం కొండారెడ్డి స్పందిస్తూ CM రిలీఫ్ ఫండ్ పంపిణీ, మున్సిపాలిటీ సమీక్షలో పాల్గొంటున్నానని చేతనైతే అడ్డుకోండి అంటూ సవాల్ చేశారు.
Sorry, no posts matched your criteria.