Andhra Pradesh

News September 21, 2025

ప్రకాశంకు ఆరెంజ్ అలర్ట్.. 3 గంటల్లో భారీ వర్షాలు.!

image

ప్రకాశం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం ప్రకటన జారీచేసింది. రాబోయే మూడు గంటల్లో భారీ తుఫానుతోపాటు, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని సంబంధిత అధికారులు ప్రకటించారు. ప్రజలు హోర్డింగుల వద్ద ఉండరాదని, అలాగే శిథిలావస్థకు చేరిన భవనాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. మూడు గంటలపాటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లు వారు తెలిపారు.

News September 21, 2025

పలాసలో గంజాయితో నలుగురు మహిళలు అరెస్ట్

image

కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ఒడిశాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ సూర్యనారాయణ ఆదివారం ఉదయం తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 75 కిలోల గంజాయి స్వాధీనం తీసుకొని, నలుగురు మహిళలతో పాటు ఓ వ్యక్తిని రిమాండుకు తరలిస్తామన్నారు. చెడు అలవాట్లకు బానిసై యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు.

News September 21, 2025

కళాతపస్వి కె. విశ్వనాథ్ మన గుంటూరు వాసే

image

ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన కళాతపస్వి కె. విశ్వనాథ్ ఉమ్మడి గుంటూరు జిల్లా పెదపులివర్రులో జన్మించారు. ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ప్రధామైనవి. 2016 లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. 2022లో ఏపీ ప్రభుత్వం ద్వారా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.

News September 21, 2025

కర్నూలులో రూ.100కే 45 కిలోల ఉల్లి: కలెక్టర్

image

మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన 14 వేల క్వింటాళ్ల ఉల్లిని రూ.100కే 45 కిలోలు విక్రయిస్తున్నామని, వినియోగదారులు, వ్యాపారులు వినియోగించుకోవాలని కలెక్టర్ డాక్టర్ సిరి వెల్లడించారు. ఆదివారం కర్నూలు మార్కెట్ యార్డును జేసీ నవ్యతో కలిసి ఆమె పరిశీలించారు. రైతులకు హెక్టార్‌కు రూ.50 వేలు పరిహారం ఇస్తున్నందున ఈనెల 22 నుంచి మద్దతు ధర రూ.1,200 కలిపి వేస్తున్నామన్నారు.

News September 21, 2025

కొండపిలో పొగాకు ధరలు పతనం

image

కొండపి పొగాకు వేలం కేంద్రంలో లోగ్రేడ్ ధరలు రైతులకు షాక్ ఇస్తున్నాయి. వేలం ప్రారంభంలో కేజీ రూ.250గా ఉన్న లోగ్రేడ్ పొగాకు 12వ రౌండ్ చివరకు రూ.100కి పడిపోయింది. లో గ్రేడ్ బేళ్ల తిరస్కరణ సంఖ్య సైతం ఎక్కువగా ఉంటోంది. వేలం ముగింపు దశలోనూ బేళ్లు కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు.

News September 21, 2025

మైదుకూరు: రాయితీ నగదు కోసం ఎదురుచూపులు

image

ప్రభుత్వం వాణిజ్య పంటలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రైతులకు పలు రాయితీలు కల్పిస్తోంది. అరటి పంటను సాగు చేస్తే హెక్టారుకు రూ.70 వేలు రాయితీ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు రాయితీ సొమ్ము జమ కాలేదని రైతులు వాపోతున్నారు. రాయితీ సొమ్ము కోసం ఏడాదికాలంగా ఎదురుచూడాల్సి వస్తోందన్నారు. మైదుకూరు మండలంలో 200 హెక్టార్లకు పైగా అరటిని సాగు చేశారు. మీకు డబ్బులు పడ్డాయా?

News September 21, 2025

పలాసలో గంజాయితో నలుగురు మహిళలు అరెస్ట్

image

కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ఒడిశాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ సూర్యనారాయణ ఆదివారం ఉదయం తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 75 కిలోల గంజాయి స్వాధీనం తీసుకొని, నలుగురు మహిళలతో పాటు ఓ వ్యక్తిని రిమాండుకు తరలిస్తామన్నారు. చెడు అలవాట్లకు బానిసై యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు.

News September 21, 2025

సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు: డీఈవో

image

దసరా సెలవుల్లో ప్రత్యేకత తరగతుల పేరుతో విద్యార్థులను పాఠశాలలకు పోయించుకుంటే కఠిన చర్యలు తప్పవని డీఈవో శామ్యూల్ పాల్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే పలు పాఠశాలలపై ఫిర్యాదుల వచ్చాయన్నారు. విద్యాశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, పాఠశాలను మూసివేయిస్తారని హెచ్చరించారు.

News September 21, 2025

టంగుటూరు: 80 క్వింటాళ్ల లోగ్రేడ్ పొగాకు సీజ్

image

విజిలెన్స్ అధికారి హేమంత్ కుమార్ శనివారం తెల్లవారుజామున 16 లక్షల విలువైన 80 క్వింటాళ్ల లోగ్రేడ్ పొగాకును అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు తెలిపారు. పొదిలి నుంచి చిలకలూరిపేట వెళ్తుండగా జాతీయ రహదారిపై లారీని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా పొగాకు కొనుగోలు చేసే వ్యాపారులు తీరు మార్చుకోకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో 50 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News September 21, 2025

మైదుకూరు: ఆర్టీసీ బస్ బోల్తా

image

మైదుకూరు (M) వరదాయపల్లె సమీపంలో ప్రమాదం జరిగింది. బద్వేల్ నుంచి మైదుకూరు మీదుగా కడపకు సూపర్ లగ్జరీ బస్ బయల్దేరింది. మార్గమధ్యంలో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉండగా.. కొందరికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.