India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుత్వం వాణిజ్య పంటలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రైతులకు పలు రాయితీలు కల్పిస్తోంది. అరటి పంటను సాగు చేస్తే హెక్టారుకు రూ.70 వేలు రాయితీ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు రాయితీ సొమ్ము జమ కాలేదని రైతులు వాపోతున్నారు. రాయితీ సొమ్ము కోసం ఏడాదికాలంగా ఎదురుచూడాల్సి వస్తోందన్నారు. మైదుకూరు మండలంలో 200 హెక్టార్లకు పైగా అరటిని సాగు చేశారు. మీకు డబ్బులు పడ్డాయా?
కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ఒడిశాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ సూర్యనారాయణ ఆదివారం ఉదయం తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 75 కిలోల గంజాయి స్వాధీనం తీసుకొని, నలుగురు మహిళలతో పాటు ఓ వ్యక్తిని రిమాండుకు తరలిస్తామన్నారు. చెడు అలవాట్లకు బానిసై యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు.
దసరా సెలవుల్లో ప్రత్యేకత తరగతుల పేరుతో విద్యార్థులను పాఠశాలలకు పోయించుకుంటే కఠిన చర్యలు తప్పవని డీఈవో శామ్యూల్ పాల్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే పలు పాఠశాలలపై ఫిర్యాదుల వచ్చాయన్నారు. విద్యాశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, పాఠశాలను మూసివేయిస్తారని హెచ్చరించారు.
విజిలెన్స్ అధికారి హేమంత్ కుమార్ శనివారం తెల్లవారుజామున 16 లక్షల విలువైన 80 క్వింటాళ్ల లోగ్రేడ్ పొగాకును అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు తెలిపారు. పొదిలి నుంచి చిలకలూరిపేట వెళ్తుండగా జాతీయ రహదారిపై లారీని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా పొగాకు కొనుగోలు చేసే వ్యాపారులు తీరు మార్చుకోకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో 50 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
మైదుకూరు (M) వరదాయపల్లె సమీపంలో ప్రమాదం జరిగింది. బద్వేల్ నుంచి మైదుకూరు మీదుగా కడపకు సూపర్ లగ్జరీ బస్ బయల్దేరింది. మార్గమధ్యంలో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉండగా.. కొందరికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ మీదుగా సంబల్పూర్ – నాందేడ్ (20809) వెళ్లే నాగావళి ఎక్స్ప్రెస్ ఆదివారం రీ షెడ్యూలు అయింది. సంబల్పూర్లో ఆదివారం ఉదయం 10.50 గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలు మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు విశాఖలోని రైల్వే అధికారులు తెలిపారు. నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రీ షెడ్యూలు జరిగినట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఇది గమనించి సహకరించాలని కోరారు.
కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ఒడిశాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ సూర్యనారాయణ ఆదివారం ఉదయం తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 75 కిలోల గంజాయి స్వాధీనం తీసుకొని, నలుగురు మహిళలతో పాటు ఓ వ్యక్తిని రిమాండుకు తరలిస్తామన్నారు. చెడు అలవాట్లకు బానిసై యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు.
దసరా సెలవుల్లో ప్రైవేటు విద్యాసంస్థలు సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని కడప DEO శంషుద్దీన్ హెచ్చరించారు. ప్రైవేట్ యాజమాన్యాలు ప్రత్యేక తరగతులు, ట్యూషన్ల పేరుతో క్లాస్లు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనన్నారు.
ప్రకాశం జిల్లాలో 24 గంటల్లో భారీ వర్షం కురిసింది. ఎక్కడ ఎంత వర్షపాతం(మిల్లీ మీటర్లలో) నమోదైందంటే..
➤హనుమంతునిపాడు: 69 ➤తాళ్లూరు:66 ➤తర్లపాడు: 64.2
➤పుల్లలచెరువు-60.4 ➤దర్శి-46.2 ➤ టంగుటూరు: 46.2
➤త్రిపురాంతకం-39.4 ➤పెద్దారవీడు-38.6➤ కనిగిరి-34
➤మర్రిపూడి-32.8 ➤జరుగుమల్లి: 32.4
➤ చీమకుర్తి-45 ➤ఒంగోలు: 30.6
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లీగల్ అడ్వైజర్గా ప్రముఖ న్యాయవాది రంగారావును నియమిస్తూ కమిషనర్ నందన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన మూడేళ్ల పాటు పదవిలో ఉండనున్నారు. ఈయన గతంలో ఇంటి పన్నులతో పాటు పలు అంశాల్లో మున్సిపల్ కార్పొరేషన్కు ₹ 3.70 కోట్లు జమ కావడానికి కారకులు కావడంతో ఈయన సేవలను గుర్తించి ఈ పదవి ఇచ్చేందుకు తీర్మానం చేశారు.
Sorry, no posts matched your criteria.