India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లా కేంద్రంలో గురజాడ వెంకట అప్పారావు జయంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. గురజాడ నివాసంలో ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా, రామ్ సుందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగు వారికి ఖ్యాతి తెచ్చిన గురజాడ అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.
అనంతపురం JNTU పరిధిలోని బీఫార్మసీ, ఫార్మాడీ, ఎంఎస్సీ కోర్సుల పరీక్షా ఫలితాలు శనివారం రాత్రి విడుదలయ్యాయి. బీఫార్మసీ 2వ సంవత్సరం 1వ, 2వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, ఫార్మాడీ 2వ, 5వ సంవత్సరం, ఎంఎస్సీ 1వ, 2వ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం కాలేజీ వెబ్సైట్లో చూసుకోవచ్చు.
అనంతపురం జిల్లా బిందు సేద్యంలో జాతీయ స్థాయిలో రెండో స్థానం, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించింది. APMIP PD రఘునాథ్రెడ్డి, APD ఫిరోజ్ ఖాన్ ఢిల్లీలో జరిగిన స్కోచ్-2025 అవార్డుల కార్యక్రమంలో ఛైర్మన్ సమీర్ నుంచి అవార్డు అందుకున్నారు. వారికి జిల్లా అధికారులు పెద్దఎత్తున అభినందనలు తెలిపారు.
ఏలూరు జిల్లా నూజివీడులోని బాపునగ్లో నివసిస్తున్న పాపారావుపై శనివారం రాత్రి ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. బాధితుడి వివరాల ప్రకారం బైకుపై బయటకు వెళ్తుండగా గంజాయి మత్తులో ఉన్న ముగ్గరు వ్యక్తులు ఎదురుగా వచ్చి, వాహనాన్ని ఆపి పిడిగుద్దులతో దాడి చేశారు. అడ్డుకున్న తన అన్నపై దాడి చేశారని చెప్పాడు. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పాపారావు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు గల కారాణాలు తెలియాల్సి ఉంది.
దసరా పండుగ సీజన్ ఆగమనంతో శ్రీకాకుళంలో చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం చికెన్ ధరలు భారీగా పెరిగాయి. చికెన్ కేజీ రూ.280, స్కిన్ లెస్ రూ.290-300 పలుకుతోంది. ఇది గత వారంతో పోలిస్తే రూ.20-30 వరకు పెరిగింది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
సండే వచ్చిందంటే చాలు కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ఆర్థిక పరిస్థితిని భట్టి కొందరు మటన్ తెచ్చుకుంటే మరికొందరు చికెన్, చేపలతో సండే విందును కంప్లీట్ చేస్తుంటారు. అయితే విజయనగరంలో మటన్ కేజీ రూ.900 వరకు పలుకుతుండగా. చికెన్ (స్కీన్) రూ.200, (స్కీన్ లెస్) రూ.220, ఫిష్ రూ.170 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
మచిలీపట్నంలో ఆదివారం చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. పట్టణంలో చికెన్ విత్ స్కిన్ కిలో రూ.220, స్కిన్లెస్ కిలో రూ. 240కు విక్రయాలు జరుగుతున్నాయి. అదే ధరలు గ్రామాల్లో ఎక్కువగా ఉండి స్కిన్ ఉన్న చికెన్ కిలో రూ. 240, స్కిన్లెస్ రూ. 260కు అమ్ముతున్నారు. మటన్ ధర పట్టణంలో కిలో రూ.1000 ఉండగా, గ్రామాల్లో మాత్రం కిలో రూ.800కి విక్రయాలు జరుగుతున్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఏలా ఉన్నాయో కామెంట్ చేయండి.
మాధవధార, మురళి నగర్, మర్రిపాలెంలో ఆదివారం చికెన్, మటన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కేజీ చికెన్ లైవ్ రూ.160, స్కిన్ లెస్ రూ.280, విత్ స్కిన్ రూ.260, శొంఠ్యాం కోడి రూ.300కి విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.1,000గా ఉంది. ఆదివారం కావడంతో వినియోగదారులు అధిక సంఖ్యలో మాంసం దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు.
జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈనెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలు(మైనారిటీ పాఠశాలలు తప్ప) కచ్చితంగా దసరా సెలవులను అమలు చేయాలన్నారు. సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించరాదన్నారు. జిల్లాలోని మైనారిటీ పాఠశాలలకు ఈనెల 27 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపారు.
కోటబొమ్మాళిలో వెలసి ఉన్న శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాల జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని అధికారులకు సూచించారు. భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.