India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ కలెక్టరేట్లో శుక్రవారం డీఆర్సి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్ మంత్రి డోలా బాల వీరాంజనేయులు దృష్టికి పలు సమస్యలు తీసుకువెళ్లారు. పరిపాలనాపరమైన అంశాల్లో అధికారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని, కాలయాపన చేయరాదని పేర్కొన్నారు. నగరంలో పలు ప్రాంతాల్లోని అవసరాలకు సరిపడా సామర్థ్యం కలిగిన వీధి దీపాలు వేయాలని, దీని కోసం ముందుగా ఆడిట్ చేయాలని సూచించారు.
రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తిపై దాడి చేసి సెల్ఫోన్ అపహరించి, బెదిరించిన కేసులో ఇద్దరు నిందితులను తెనాలి జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిడుబ్రోలుకు చెందిన దేవర సాయి, యర్రంశెట్టి వంశీ కాకినాడ- తిరుపతి రైలులో ప్రయాణిస్తున్న సంతోష్ కుమార్ను కొట్టి సెలోఫోన్ దొంగిలించారు. ఈ కేసులో టెక్నాలజీ పరంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. అనంతరం రాజమండ్రి జైలుకి తరలించారు.
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఉన్న పాత వాహనాల పరికరాలను శనివారం సాయంత్రం 4 గంటల నుంచి వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కార్యాలయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వాడిన పరికరాలు వేలంలో ఉంచుతున్నామన్నారు.
సికింద్రాబాద్ గోపాలపురం PS పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపట్నం(M) చాకిపల్లికి చెందిన యువకుడు మృతి చెందాడు. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాలు.. మేడ్చల్ హనుమాన్ నగర్లో ఉంటున్న సీహెచ్ నవీన్ (27) శుక్రవారం ఓ వేడుకకు వెళ్లాడు. తిరిగి బైక్పై ఇంటికి వెళుతుండగా సికింద్రాబాద్ YMCA ఫ్లై ఓవర్ వద్ద ఇనుప స్తంభాన్ని ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా నవీన్కు ఈ నెల 13న వివాహం జరిగింది.
స్నేహితులకు పార్టీ ఇవ్వాలని దొంగతనానికి పాల్పడ్డ ఓ విద్యార్థి జైలు పాలయ్యాడు. భీమవరానికి చెందిన జి.వాసవి గురువారం ఇంటికి వస్తుండగా అలెగ్జాండర్ సూర్యపాల్ ఆమె మెడలో సూత్రాల తాడు లాక్కుని పారిపోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇంటర్ పాసైన సందర్భంగా ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చేందుకు డబ్బు కోసం దొంగతనానికి పాల్పడినట్లు సూర్యపాల్ కోర్టులో చెప్పాడు. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించింది.
భారత ప్రభుత్వం జారీ చేసిన పాకిస్థాన్ వీసాలను రద్దు ఉత్తర్వులు విశాఖ అధికారులకు అందాయి. ఈ నేపథ్యంలో జిల్లా రెవిన్యూ అధికారి పేరున ఒక ప్రకటన విడుదలైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య దీర్ఘకాలిక దౌత్య వీసాలు మినహా మిగతా అన్నిటిని భారత ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలో ఎవరైనా పాకిస్థాన్కు చెందిన వారు ఉంటే వెంటనే విడిచి వెళ్లిపోవాలని సూచించారు.
గోకవరం మేజర్ గ్రామపంచాయతీ శివారులో వ్యభిచారం జరుగుతున్న గృహంపై ఎస్ఐ పవన్ కుమార్ శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో రైడ్ చేశారు. ఈ రైడ్లో వ్యభిచారం చేస్తున్న ముగ్గురు మగవాళ్లు, ఆడవాళ్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వ్యభిచార నిర్వాహకురాలు బదిరెడ్డి పద్మావతిని అదుపులో తీసుకున్నారు. గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా ఆ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే జైలుకు పంపిస్తానని SI తెలిపారు.
నెల్లూరులో వ్యభిచార గృహాలపై శుక్రవారం పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకులు, విటులు, అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నట్లు నవాబుపేట SI సాంబశివరావు వెల్లడించారు. అల్లీపురానికి చెందిన పొట్టెయ్య ముగ్గురు మహిళలతో మధురానగర్లో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. పలు ప్రాంతాల నుంచి సెక్స్ వర్కర్లను రప్పించి వ్యభిచారం మొదలు పెట్టాడు. దాడులు చేసి సెక్స్ వర్కర్లను హోమ్కు తరలించినట్లు SI వెల్లడించారు.
హాలహర్వి మండలం అమృతాపురం గ్రామానికి చెందిన వైసీపీ నేత వెంకటేశ్(55) హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం పొలం పనులకు వెళ్లిన ఆయన సాయంత్రం మృతదేహమై కనిపించాడు. కుటుంబీకుల సమాచారంతో సీఐ రవిశంకర్ రెడ్డి, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్ర మెడికల్ కళాశాలలో నిర్మించిన క్యాబ్ బిల్డింగ్ను సీఎం చంద్రబాబు శనివారం ప్రారంభించనున్నారు. శ్రీకాకుళంలో పర్యటించనున్న నేపథ్యంలో శనివారం సా.6 గంటలకు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పూర్వ విద్యార్థుల నిధులతో ఈ క్యాబ్ బిల్డింగ్ నిర్మించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారి యంత్రాంగం, ఏఎంసి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.