India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పార్వతీపురంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతనతో వైసీపీ మేమంతా సిద్ధం సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మన్యం జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు, ఎంపీ అభ్యర్థి తనుజ పాల్గొన్నారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవారిని లక్షాధికారులుగా చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను అన్నారు

ఆస్తి తగాదాలతో కన్నతల్లి గొంతు కోసి చంపిన ఘటన పిచ్చాటూరు మండలంలోని అడవి కొడియంబేడు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. రాజమ్మ (80) రెండో కొడుకు కృష్ణారెడ్డి, అతని కొడుకులు కలిసి రాజమ్మతో గొడవ పడి గొంతు కోసి చంపి పరారైనట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

విశాఖలో ఈనెల 3న జరగనున్న ఐపీఎల్ టీ-20 మ్యాచ్ సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి రాత్రి 12:00 వరకు భారీ వాహనాలకు మధురవాడ స్టేడియం వైపు అనుమతి లేదు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే వాహనాలు సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా వెళ్ళాలి.

మొబైల్లు, బయోమెట్రిక్ డివైజ్లు పోగొట్టుకుంటే వాలంటీర్లు కొత్త IRIS, బయోమెట్రిక్ డివైజ్ను కొనుగోలు చేసి సంబంధిత సెక్రటరీకి అప్పగించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు. ఏదైనా నష్టం, మొబైల్కు డ్యామేజ్ జరిగితే వాలంటీర్లు రూ.8 వేలు చెల్లిస్తే కొత్త మొబైల్ అందజేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ సూచనలను పాటించాలని ఆదేశించారు.

సాధారణ ఎన్నికలు – 2024 కోసం ఎచ్చెర్ల మండలం శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూములను జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్, జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక ఇతర ముఖ్య అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈవిఎమ్, ఇతర అనుబంధ యూనిట్లు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు, 24 గంటలు కాస్టింగ్ జరిగేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

తనకు రావాల్సిన పింఛను కోసం తిరుపతి నుంచి వెంకటగిరిలోని బంగారు పేటకు 80 ఏళ్ల వృద్ధుడు వెంకటయ్య వచ్చాడు. పింఛన్ విషయం కనుక్కునేందుకు ఎండలో సచివాలయానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

చిన్నగంజాం టోల్ ప్లాజా వద్ద ఎస్సై శ్రీనివాసరావు మంగళవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఒంగోలు నుంచి చీరాల వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. సరైన బిల్లులు లేకుండా వాహనంలో తరలిస్తున్న రూ.3.20 లక్షల నగదును పట్టుకున్నారు. అనంతరం ఫ్లయింగ్ స్కాడ్తో కలిసి నగదును జిల్లా గ్రీవెన్స్కు అప్పగించారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు.

మదనపల్లెలోని టిప్పు సుల్తాన్ మైదానంలో ఏర్పాటు చేసిన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమం ముగిసింది. ఈ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థపైన మాట్లాడారు. అనంతరం వైసీపీ అభ్యర్థులను స్టేజీపైన ప్రకటించి వారిని గెలిపించాలని కోరారు. ఆయన సభ ముగిసిన తర్వాత నిమ్మనపల్లె క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది. అమ్మగారిపల్లెలో రాత్రి బసచేయనున్నారు.

కొమ్మాదిలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 28న విద్యార్థిని మృతి కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ మణికంఠ చందోలు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ నిర్వహించినట్లు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో కెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ ఎన్.శంకర్రావు, మేనేజ్మెంట్ సిబ్బంది శంకర్ వర్మ, కళాశాల ప్రిన్సిపల్ జి.భాను ప్రకాష్, హాస్టల్ వార్డెన్ వి.ఉషారాణి, ఆమె భర్త ప్రదీప్ కుమార్ ఉన్నారని పేర్కొన్నారు.

మదనపల్లెలో సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు గతంలో ప్రతి నగరంలో హైటెక్ సిటీని నిర్మిస్తానని అన్నారని, మదనపల్లెలో నిర్మించాడా అని విమర్శించారు. ‘అరుంధతి సినిమాలో పశుపతి లాగా.. వదల బొమ్మాళీ వదల.. అంటూ పేదల రక్తం పీల్చేందుకు కేకలు పెడుతున్నారు’ అని ఫైరయ్యారు.
Sorry, no posts matched your criteria.