India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మండల వ్యాప్తంగా సుమారు 30 మంది వాలంటీర్లు తమ వాలంటరీ పోస్టులకు రాజీనామా చేసినట్లు ఎంపీడీవో మల్లేశ్వరి తెలిపారు. మండల వ్యాప్తంగా సోమవారం పొడపాడు, హుస్సేనగరం, ముసాపురం, పెదకూరపాడు పరిసర ప్రాంతాల్లోని వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ వాలంటరీ పోస్ట్లకు రాజీనామా తెలిపినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని ఎలక్షన్ల సమయంలో అవ్వ తాతలకు అందించలేకపోయామనే బాధతో రాజీనామా చేస్తున్నామని తెలిపారు.

పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, సమీపంలోనే మహాలక్ష్మినగర్ కాలనీలో ఉన్న శ్రీచైతన్య పాఠశాల కేంద్రాలుగా స్పాట్ వాల్యుయేషన్ మొదలైంది. తొలిరోజు 7 సబ్జెక్టుల పేపర్ల మూల్యాంకనం చేపట్టారు. 1210 మంది హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సిబ్బంది మూల్యాంకనంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 8 రోజుల్లో పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.

ఇవాళ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్నారు. అలాగే వైఎస్ షర్మిల కడపలో పర్యటించనున్నారు. సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడితే.. షర్మిల కూడా ఇవాళ వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించి తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారో వెల్లడిస్తారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. షర్మిల కూడా ప్రచారాన్ని ఇడుపులపాయ నుంచే మొదలు పెట్టే అవకాశం ఉంది.

గుంతకల్లు నుంచి కాచిగూడకు వెళ్లే ప్యాసింజర్ రైలు(07671) సోమవారం నుంచి రద్దైనట్లు డోన్ రైల్వే అధికారి తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు రద్దు చేసినట్లు చెప్పారు. కాచిగూడ నుంచి గుంతకల్లుకు వెళ్లే ప్యాసింజర్ రైలు (07670) మంగళవారం నుంచి మే ఒకటో తేదీ వరకు రద్దు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ డివిజన్లోని మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల్లో రైల్వే డబ్లింగ్ పనులు జరుగుతుండటంతో రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

సామాజిక పింఛన్లను ఈనెల మూడవ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి సామాజిక పింఛన్లు గ్రామ వార్డు సచివాలయాలు సిబ్బంది పంపిణీ చేస్తారని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వలంటీర్ల వద్ద ఉన్న ఫోన్లు బయోమెట్రిక్ పరికరాలను పంచాయతీ కార్యదర్శిలకు వెంటనే అందజేయాలన్నారు.

ఉమ్మడి ప.గో జిల్లాలో 2019లో పోలింగ్ శాతం ఇలా ఉంది. కొవ్వూరు-86.4%, నిడదవోలు-82.7%, ఆచంట-79.6%, పాలకొల్లు-82.2%, నరసాపురం-81.1%, భీమవరం-77.9%, ఉండి-84.7%, తణుకు-81.1%, తాడేపల్లిగూడెం-80.3%, ఉంగుటూరు-86.8%, దెందులూరు-84.8%, ఏలూరు-67.6%, గోపాలపురం-85.9%, పోలవరం-86.8%, చింతలపూడి-82.9% పోలింగ్ నమోదయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేందుకు జిల్లా అధికారులు చేపట్టిన చర్యలు ఎలా ఉన్నాయి.

యువతిని ప్రేమ పేరుతో వంచించి ఆపై బెదిరించి అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై నున్న రూరల్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సుందరయ్య నగర్కు చెందిన యువతికి మునీంద్రా రెడ్డితో పరిచయం ఉంది. ప్రేమ పేరుతో అత్యాచారానికి పాల్పడ్డాడు. వారిద్దరూ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్ చేశారు.

తిరుపతి జిల్లాలోని తడ, నాయుడుపేటలో ఈనెల 4న తేదీన సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సిద్ధం సభ ఏర్పాట్లను కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డితో పాటు పలువుర నాయకులు కలిసి సభాప్రాంగణాన్ని పరిశీలించారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

విజయనగరం లోక్సభ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అప్పటి నుంచి 3 సార్లు ఎన్నికలు కాగా 3 విభిన్న పార్టీల అభ్యర్థులు గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి బొత్స ఝాన్సీ, 2014లో TDP నుంచి అశోక్ గజపతిరాజు, 2019లో YCP నుంచి బెల్లాన చంద్రశేఖర్ MPలుగా గెలిచారు. ఈ సారి YCP నుంచి బెల్లాన మరోసారి పోటీచేస్తుండగా, TDP ఉమ్మడి అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు బరిలో దిగారు. వీరిలో ఎవరు పైచేయి సాధిస్తారో కామెంట్ చేయండి.

గుంటూరు రైల్వే డివిజన్కు 2024 మార్చి నెలలో రూ.47.9 కోట్లు ఆదాయం వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అధికమన్నారు. 3.364 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా సరుకు రవాణాలో 21.6% వృద్ధి చెందిందన్నారు. దశాబ్దాల చరిత్ర తిరగరాసిందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.