Andhra Pradesh

News March 30, 2024

MLA రాచమల్లు ఒక ముళ్లు: చంద్రబాబు

image

ప్రొద్దుటూరు బహిరంగ సభలో చంద్రబాబు ఎమ్మెల్యే రాచమల్లుపై విమర్శలు గుప్పించారు. రాచమల్లు ఒక ముళ్లు అని ప్రజలను గుచ్చుతూనే ఉంటారని ఆరోపించారు. ప్రొద్దుటూరులో మట్కా, జూదం, ఇసుక, సెటిల్ మెంట్ లో, నకిలీ నోట్లు ఇలా అన్నింటిలో అవినీతిలో ఉన్నారని అన్నారు. టెక్నాలజీ దుర్మార్గుడి చేతిలో ఉంటే ప్రజలు ఆగం అవుతారన్నారు. రాజమల్లు రూ.2 వేల కోట్లు అవినీతితో సంపాదించారని ఆరోపించారు.

News March 30, 2024

తిరుపతిలో ఉరివేసుకొని వ్యక్తి మృతి

image

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే రక్షణ దళం విశ్రాంతి కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఉరివేసుకొని వ్యక్తి మృతి చెందారు. మృతుడు ఎస్ఆర్ పురం మండలం పాపిరెడ్డి పల్లికి చెందిన ఈదల రవి(55) గా గుర్తించారు. పుత్తూరు, తిరుపతి ప్రాంతాలలో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్య గీత, కుమారుడు బెంగుళూరులో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.

News March 30, 2024

గోపాలపురంలో గెలిచిన మహిళా అభ్యర్థులు వీరే

image

ప.గో జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు(1962-2019) 13సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 3సార్లు మహిళలు MLAలుగా గెలిచారు. 1978లో దాసరి సరోజినిదేవి(కాంగ్రెస్‘ఐ‘), 2004లో మద్దాల సునీత(కాంగ్రెస్‘ఐ’), 2009లో తానేటి వనిత(TDP) నుంచి గెలుపొందారు. ఇక్కడి నుంచి వనిత మరోసారి MLA అభ్యర్థిగా బరిలో ఉంటుండగా.. ఈసారి పార్టీ మాత్రం వేరు. ఆమె 2009లో TDP నుంచి పోటీ చేసి గెలవగా.. ఈసారి వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు.

News March 30, 2024

మచిలీపట్నం: ఈవీఎంల భద్రతను పరిశీలించిన కలెక్టర్

image

కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్‌ను కలెక్టర్ పి. రాజాబాబు పరిశీలించారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా గోడౌన్‌లో భద్రపర్చిన ఈవీఎంలను పరిశీలించిన ఆయన భద్రతా చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంలన్నీ పటిష్టమైన భద్రతా చర్యల మధ్య భద్రంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ పరిశీలనలో ఎలక్షన్ సెల్ అధికారులు ఉన్నారు. 

News March 30, 2024

నెల్లూరు: బొల్లినేని అడుగులు ఎటో !

image

ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు రాజకీయ అడుగులు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు పర్యటనలో మొక్కుబడిగా పాల్గొని కీలక సమావేశాలకు దూరంగా ఉండటం టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. 2012 ఉప ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆయన ఓడారు.2014 ఎన్నికల్లో గెలిచారు. 2019లో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆయనకు టికెట్ నిరాకరించింది. కాగా బీజేపీ జాతీయ నేతలతో బొల్లినేనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

News March 30, 2024

మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి రాజకీయ నేపథ్యం ఇదే..

image

ఎట్టకేలకు మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 2004లో కాంగ్రెస్ నుంచి తెనాలి ఎంపీగా విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ నుంచి నరసరావుపేట ఎంపీగా, 2014లో వైసీపీ తరఫున గుంటూరు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో వైసీపీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 

News March 30, 2024

తాడేపల్లి: లారీ ఢీకొని కానిస్టేబుల్ మృతి

image

కంటైనర్ లారీ ఢీకొని ఏఆర్ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఏఆర్ కానిస్టేబుల్ మోహన్ రావు గురువారం రాత్రి 11 గంటలకు విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళ్తున్నారు. కొలనుకొండ సాయిబాబా మందిరం సమీపంలో లారీ వెనక నుండి ఢీకొట్టింది. మోహన్ రావు లారీ చక్రాల కింద పడి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 30, 2024

రేపు మార్కాపురానికి చంద్రబాబు రాక

image

ప్రజా గళంలో భాగంగా ఈనెల 31వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మార్కాపురం పట్టణానికి రానున్నట్లు మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలో జరిగే సభలో పాల్గొని అక్కడినుంచి హెలికాప్టర్‌లో మార్కాపురం చేరుకుంటారు. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

News March 30, 2024

నేను లోకల్ వ్యక్తినే: డాక్టర్ పీవీ పార్థసారథి

image

ఆదోని MLA టికెట్ కూటమి బీజేపీ అభ్యర్థి డాక్టర్ పీవీ పార్థసారథికి ఖరారు అయిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో నాయకులు ఆయనను నాన్ లోకల్ అన్న విమర్శకు కౌంటర్ ఇచ్చారు. తాను లోకల్ వ్యక్తినే అని గత 10 ఏళ్లుగా ఇక్కడ డెంటల్ క్లినిక్ నిర్వహిస్తున్నానని అన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు తనకు బాగా తెలుసు అన్నారు. నాయకులు వారి రాజకీయ స్వలాభం కోసం చేస్తున్న విమర్శలు తన విజయాన్ని ఆపలేవు అన్నారు.

News March 30, 2024

విశాఖ జిల్లాలో ఆ ఒక్కటే మిగిలింది.!

image

ఉమ్మడి విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మినహా మిగిలిన చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ 9, జనసేన 3, బీజేపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. దక్షిణ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించగా, ఆ పార్టీ అధినేత పవన్ అభ్యర్థి విషయంలో కసరత్తు చేస్తున్నారు. నేడో, రేపో దక్షిణ నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.