Andhra Pradesh

News March 29, 2024

టీడీపీలోకి మల్లెల రాజేశ్ నాయుడు.?

image

చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయుడు మంగళగిరిలో లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన సన్నిహితులు, కార్యకర్తలతో టీడీపీ కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిలకలూరిపేట వైసీపీ టికెట్ మనోహర్ నాయుడికి ప్రకటించిన నేపథ్యంలో రాజేశ్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు అనుచరులు తెలిపారు. ఆయనతోపాటు పాటు 12మంది YCP కౌన్సిలర్లు TDP తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.

News March 29, 2024

అనంత: ఎనిమిది కాళ్లతో గొర్రె పిల్ల జననం

image

పుట్టపర్తి మండలలో శుక్రవారం వింత గొర్రె పిల్ల పుట్టింది. మండల పరిధిలోని సుబ్బరాయునిపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మూర్తికి చెందిన ఓ గొర్రె ఎనిమిది కాళ్లు, రెండు తలలతో కూడిన గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. కాగా కొద్ది సేపటికే గొర్రె పిల్ల మృతి చెందినట్లు గొర్రెల కాపారి తెలియజేశారు.

News March 29, 2024

విశాఖ మత్స్యకారులకు చిక్కిన పవర్ ఫిష్

image

విశాఖపట్నం సాగర్ నగర్ సముద్ర తీరంలో మత్స్యకారులకు సముద్ర కప్పలుగా పిలవబడే విభిన్న చేపలు లభించాయి. తిరిగారు ఈ తరహా జీవులను పవర్ ఫిష్ గా పిలుస్తారని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. సముద్రపు అట్టడుగు లోతుల్లో సంచరించే ఈ జీవులు దాడికి గురైన సమయంలో ఇలా బెలూన్ రూపంలో ఆకృతిని మార్చుకుంటాయని పేర్కొన్నారు. ఈ చేపలను చూడడానికి పలువురు ఆసక్తి చూపారు.

News March 29, 2024

చిలకలూరిపేట: అజ్ఞాతంలోకి 12 మంది YCP కౌన్సిలర్లు.?

image

చిలకలూరిపేట వైసీపీలో సంక్షోభం నెలకొందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ వ్యతిరేక, అనుకూల గ్రూపులుగా పట్టణ కౌన్సిలర్లు చీలిపోయినట్లు సమాచారం. కావటి మనోహర్‌కి సహకరించేది లేదని 12 మంది వైసీపీ కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మల్లెల రాజేశ్ నాయుడుకి వీళ్లు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. వీరంతా రాజేశ్ ఆధ్వర్యంలో పార్టీ మారనున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

News March 29, 2024

ముండ్లమూరు: రెండు బైకులు ఢీ.. స్పాట్ డెడ్

image

రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం వేంపాడు-పెద్ద రావిపాడులో జరిగింది. వేంపాడుకు చెందిన గోపనబోయిన రామారావు(40) తన మిర్చి పొలంలోని కూలీలకు టిఫిన్ తీసుకుని బైకుపై ముండ్లమూరు నుంచి వస్తున్నారు. అదే సమయంలో రావిపాడుకు చెందిన ఉలవ మల్లికార్జున తన బైకుపై వస్తూ మలుపు వద్ద ఇరువురు ఢీకొన్నారు. రామారావు చనిపోగా, మల్లికార్జున గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు.

News March 29, 2024

చిత్తూరుకు సీఎం జగన్ రాక

image

మదనపల్లికి ఏప్రిల్ 2న సీఎం జగన్ రానున్నట్లు ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్ రెడ్డితో కలిసి ‘మేము సిద్ధం ‘బహిరంగ సభకోసం టిప్పు సుల్తాన్ మైదానం శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఎంపీ మిథున్ రెడ్డి వెంట ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ మహమ్మద్, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, షమీం అస్లాం తదితరులు ఉన్నారు.

News March 29, 2024

గుంటూరు: పోలింగ్‌ ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభం

image

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. పోలింగ్‌లో పాల్గొనే ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాల విభజనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 1,884 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని కేంద్రాల్లో 1,300 కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాలు 31 వరకు ఉన్నట్టు జిల్లా అధికారులు గుర్తించారు.

News March 29, 2024

6 చోట్ల మహిళ MLAలే లేరు..!.. రాజ్యలక్ష్మి రికార్డ్ కొట్టేనా..?

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాలకు గానూ 6 నియోజకవర్గాల్లో ఇప్పటివరకు మహిళా MLAలుగా గెలిచిన వారే లేరు. అవే.. నిడదవోలు, పోలవరం, ఉంగుటూరు, తణుకు, ఏలూరు, భీమవరం. మిగతా 9 చోట్ల వేర్వేరు ఎన్నికల్లో అతివలు సత్తా చాటి పరిపాలన చేశారు. అయితే.. ఈసారి పోలవరం వైసీపీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మికి దక్కింది. ఆమె ఈ పోరులో గెలిచి పోలవరం చరిత్రలో నిలిచేనా చూడాలి.

News March 29, 2024

నెల్లూరుకు సీఎం జగన్ రాక

image

సీఎం జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 6న కావలి పట్టణానికి రానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు బస్సు యాత్ర ఏర్పాట్లు రూట్ మ్యాప్ ను పరిశీలించారు. బస్సు యాత్ర కార్యక్రమంతో వైసీపీకి విశేష ఆదరణ లభిస్తుందని ఎమ్మెల్యే రామిరెడ్డి అన్నారు. మరోసారి వైసీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

News March 29, 2024

అనంత: తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక సెల్

image

అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ హసన్‌బాషా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. సమస్య ఎక్కడ తలెత్తిన 08554-275892, 9390098329 నంబర్లకు ఫోన్‌ చేసి సమస్య తెలియజేయాలని కోరారు. అధికారులు వచ్చి సమస్య పరిష్కారం చేస్తారని తెలిపారు.