Andhra Pradesh

News March 29, 2024

తిరువూరు: పోలీస్ గన్‌మెన్ మోహన్ మృతి

image

తిరువూరు మండలం కొమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోలీస్ గన్‌మెన్ మారిపోగు మోహన్ రోడ్డు ప్రమాదంలో గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. విజయవాడ లాండ్ ఆర్డర్ డీసీపీ వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న మోహన్ బైకు మీద తిరువూరు వైపు వస్తుండగా మంగళగిరి వడ్డేశ్వరం వద్ద వెనక నుంచి టిప్పర్ ఢీకొనడంతో మోహన్ మృతిచెందాడు. మోహన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 29, 2024

ఏలూరు: భర్త వేధింపులు తట్టుకోలేక భార్య SUICIDE

image

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెంకు చెందిన చినవెంకట సాంబమూర్తి RDO ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్. ఆయనకు ద్వారకాతిరుమల మండలం రామన్నగూడెంకు చెందిన రాధిక(31)తో 2010లో పెళ్లైంది. రెండ్రోజుల కింద రాధిక ఊరివేసుకొని మృతి చెందింది. అదనపుకట్నం తీసుకురావాలని తరచూ భర్త వేధించడం వల్లే తమ కూతురు ప్రాణాలు తీసుకుందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.

News March 29, 2024

రేపు ‘వారాహి విజయభేరి’ సభ.. పవన్ షెడ్యూల్ ఇదే

image

కాకినాడ జిల్లా పిఠాపురంలో రేపు ‘వారాహి విజయభేరి’ బహిరంగ సభ జరగనుంది. ఈ సభతోనే జనసేన అధినేత పవన్‌ ప్రచారం షురూ కానుంది. SAT 12.30 PMకు పవన్ గొల్లప్రోలు హెలిప్యాడ్‌‌లో దిగుతారు. పాదగయలో పూజలు.. పొన్నాడలోని బషీర్‌ బీబీ దర్గా దర్శనం.. పిఠాపురంలోని క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లతో ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం 4.30 PMకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు రామాలయం నుంచి ప్రచారాన్ని ఎన్నికల మొదలు పెట్టనున్నారు.

News March 29, 2024

విశాఖ: బీటెక్ విద్యార్థినికి వేధింపులు.. యువకుడిపై కేసు

image

మాకవరపాలెం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని వెంటపడి వేధిస్తున్నాడన్న ఆరోపణపై నర్సీపట్నం కొత్తవీధికి చెందిన యువకుడు వి.అయ్యప్పపై కేసు నమోద అయ్యింది. గురువారం కేసు నమోదు చేసినట్లు నర్సీపట్నం పట్టణ సీఐ కాంతికుమార్ తెలిపారు. ఈ యువకుడు కొద్దిరోజులుగా కళాశాల వరకు ఆమె వెంట పడటమే కాకుండా అటకాయించి కొట్టేందుకు ప్రయత్నించాడని వివరించారు.

News March 29, 2024

కుప్పంలో పాలిసెట్‌కు ఉచిత శిక్షణ

image

కుప్పం పట్టణంలోని డాక్టర్ వైసీ జేమ్స్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ ( PolyCET) – 2024 ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జగన్నాథం పేర్కొన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 24వ తేదీ వరకు శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అర్హులన్నారు.

News March 29, 2024

బత్తలపల్లి: టెన్త్ విద్యార్థిని సూసైడ్ 

image

పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన ఘటన గురువారం జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. బత్తలపల్లికి చెందిన సృజన ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కడుపు నొప్పి ఎక్కువై భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 29, 2024

VZM: అప్పుడే రాజమండ్రి నుంచి వచ్చి మృత్యు ఒడిలోకి

image

రామభద్రపురం మండలం కొట్టక్కి బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అందులో జన్నివలసకి చెందిన జొన్నాడ పురుషోత్తం రాజమండ్రి సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సొంత పనులు నిమిత్తం రాజమండ్రి నుంచి బైక్‌పై జన్నివలస గురువారం సాయంత్రమే వచ్చాడు, పనిమీద సాలూరు వెళ్లి వస్తుండగా చనిపోయాడు. మృత్యువు వెంటాడిందంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.

News March 29, 2024

10రోజుల కిందే కూతురు పెళ్లి.. అంతలోనే పెనువిషాదం

image

కుటుంబ కలహాలు ఓ ఇంట విషాదాన్ని నింపాయి. ఉండ్రాజవరానికి చెందిన వెంకట్(40)- పార్వతికి 20ఏళ్ల కింద పెళ్లైంది. కొడుకు, కుమార్తె సంతానం. గొడవలతో దూరంగా ఉంటున్న వీరిద్దరూ 10రోజుల కిందే కుమార్తె పెళ్లి చేశారు. రెండ్రోజుల కింద వెంకట్.. తాడేపల్లిగూడెంలోని పార్వతి ఇంటికి రాగా గొడవ జరిగింది. వెంకట్ కత్తితో కొడుకును పొడవగా.. పార్వతి భర్త తలపై ఇటుకతో కొట్టింది. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. వెంకట్ మరణించాడు.

News March 29, 2024

10రోజుల కిందే కూతురు పెళ్లి.. అంతలోనే పెనువిషాదం

image

కుటుంబ కలహాలు ఓ ఇంట విషాదాన్ని నింపాయి. ఉండ్రాజవరానికి చెందిన వెంకట్(40)- పార్వతికి 20ఏళ్ల కింద పెళ్లైంది. కొడుకు, కుమార్తె సంతానం. గొడవలతో దూరంగా ఉంటున్న వీరిద్దరూ 10రోజుల కిందే కుమార్తె పెళ్లి చేశారు. రెండ్రోజుల కింద వెంకట్.. తాడేపల్లిగూడెంలోని పార్వతి ఇంటికి రాగా గొడవ జరిగింది. వెంకట్ కత్తితో కొడుకును పొడవగా.. పార్వతి భర్త తలపై ఇటుకతో కొట్టింది. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. వెంకట్ మరణించాడు.

News March 29, 2024

రాయచోటి: విద్యుదాఘాతంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

image

చిన్నమండెం మండల పరిధిలోని పడమటికోన కమ్మపల్లెలో గురువారం విద్యుదాఘాతంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మట్లి మహేశ్ నాయుడు (30) మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. మహేశ్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా వర్క్ ఫ్రం హోంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తన స్వగ్రామంలో ప్లగ్ బాక్స్‌లో పిన్ మారుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైనట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.