India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. ఈనెల 24, 25న రెండు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తారని ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు వస్తారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో సమావేశమై ఎన్నికలపై దిశా నిర్దేశం చేస్తారన్నారు.

కామవరపుకోట మండలంలో ఓ మైనర్ బాలికపై దేవాదాయ శాఖ ఉద్యోగి లక్ష్మీ నరసింహారావు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు బంధువుల ఫిర్యాదు మేరకు గురువారం తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు ఎండోమెంట్ పరిధిలో నరసింహారావు ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఫోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఈనెల 18వ తేదీన పులివెందులలోని నగిరిగుట్టలో జరిగిన రెంటాల బాబు హత్య కేసులో ముద్దాయి రెంటాల సురేశ్ను అరెస్టు చేసినట్లు పులివెందుల అర్బన్ సీఐ శంకర్ రెడ్డి చెప్పారు. రెంటాల అనురాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి ముద్దాయిని మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. కూర వేయలేదనే కారణంతో బాబుని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడికి మతిస్థిమితం సరిగ్గా లేదని వివరించారు.

సంతమాగులూరుకు చెందిన బాలుడిపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. బెల్లంకొండ మండలంలోని వెంకటాయపాలేనికి పనుల నిమిత్తం సంతమాగులూరు నుంచి బాలుడి కుటుంబ సభ్యులు ఇటీవల వలస వెళ్లారు. ఈ క్రమంలో వెంకటాయపాలేనికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల వైసీపీకి దూరమైన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు తిరుపతి ఎంపీ పోటీకి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరిని కలిశారు. ఆయినప్పటికీ ఆయన సీటుపై ఎలాంటి భరోసా ఇవ్వలేదని సమాచారం. తాజాగా ఆయన ఢిల్లీ బాట పట్టారు. అక్కడ ఆయనకు ఉన్న పరిచయాలతో తిరుపతి బీజేపీ ఎంపీగా బరిలోకి దిగేందుకు లాబీ చేస్తున్నారని తెలుస్తోంది.

మైలవరంలో వైసీపీ అభ్యర్థిగా జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన సర్నాల తిరుపతిని బరిలోకి దించారు. 2019లో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన కృష్ణప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో జగన్ తిరుపతిని ఎంపిక చేశారు. 2014లో సైతం జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన జోగి రమేశ్కు మైలవరంలో అవకాశమివ్వగా ఆయన దేవినేని ఉమ చేతిలో ఓడిపోయారు. తాజాగా 2024లో మైలవరంలో ఎలాంటి ఫలితం వస్తుందోనని జిల్లా మొత్తం ఆసక్తి నెలకొంది.

టీడీపీ వచ్చాక పాలకొల్లులో 9 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు ఆ పార్టీ,2 సార్లు కాంగ్రెస్ గెలుపొందింది. ఈసారి పాలకొల్లులో విజయం ఏ పార్టీది అనే చర్చ సాగుతోంది. 1983,1985,1994,1999, 2004, 2014, 2019లలో టీడీపీ గెలిచింది. 1989, 2009లో కాంగ్రెస్ గెలిచింది. కాగా ప్రస్తుతం ఇక్కడ టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు, వైసీపీ నుంచి గుడాల గోపి పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారనే దానిపై మీ కామెంట్.

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటనపై గురువారం కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ అన్వర్ భాష తెలిపిన వివరాల మేరకు ఈనెల 19న సుమారు 45సంవత్సరాల వ్యక్తి జిజిహెచ్ ఆవరణలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని చెప్పారు. అతనిని పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారని తెలిపారు. మృతుని వివరాలు తెలిసినవారు కొత్తపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సీఐ కోరారు.

ఏర్పేడు సమీపంలోని తిరుపతి IITలో సీనియర్ రీసెర్చ్ ఫెలో-01, ప్రాజెక్టు అసిస్టెంట్-01 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. యూజీ, పీజీ ఇన్ కంప్యూటర్ సైన్స్, గేట్ పాసైన అభ్యర్థులు అర్హులు. ఇతర వివరాలకు www.iittp.ac.in వెబ్సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 05.

పల్నాడులో బాలుడిపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం గ్రామానికి మిర్చి పనుల నిమిత్తం సంతమాగులూరు నుంచి బాలుడి కుటుంబ సభ్యులు ఇటీవల వలస వచ్చారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన చందు, కోటేశ్వరరావు, కామేశ్వరరావులు ఆ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.