India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో బీపీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. అక్టోబర్ 23, 24, 25, 26 తేదీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి నవరాత్రుల మహోత్సవాలు ఈ నెల 3వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. కాగా మంగళవారం నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శరన్నవరాత్రుల మహోత్సవాల పోస్టర్ను మంగళవారం నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో 2024- జనవరిలో జరిగిన బీటెక్ 1, 3వ సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. రీవాల్యుయెషన్కై దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని కృష్ణా వర్సిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చూడాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.
శ్రీ సత్యసాయి జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టులను ఒప్పందం ప్రాతిపదికన, బోధ నేతర సిబ్బందిని పొరుగు సేవల ప్రాతిపదికన నిర్వహించుటకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల మహిళ అభ్యర్థులు పదవ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం మచిలీపట్నంలో పర్యటన వివరాలను సీఎం కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉండవల్లిలోని సీఎం స్వగృహం నుంచి ఉదయం 10 గంటలకు హెలిప్యాడ్ ద్వారా బయలుదేరి 10:20కు మచిలీపట్నం చేరుకుంటారన్నారు. అక్కడ 10:30 వరకు ప్రభుత్వ అధికారులతో సమావేశం అవుతారన్నారు. అనంతరం మచిలీపట్నంలోని పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.10కి తిరిగి ప్రయాణమవుతారని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం రాక ముందు టీడీపీ ప్రభుత్వంలో చివరిగా 2017 జూలైలో ప్రైవేట్ మద్యం షాపులు ఏర్పాటయ్యాయి. అప్పటి ఉమ్మడి విజయనగరం జిల్లాలో 210 షాపులకు టెండర్లు పిలవగా 3,636 దరఖాస్తులు వచ్చాయి. తద్వారా అప్లికేషను ఫీజు కింద ప్రభుత్వానికి రూ. 21 కోట్లు ఆదాయం వచ్చింది. అప్లికేషను ఫీజు కింద జనాభాను బట్టి రూ. 55 వేలు నుంచి 75 వేల వరకు నిర్ణయించారు. తాజాగా జిల్లాలో 153 షాపులకు టెండర్లు పిలిచారు.
బనగానపల్లెలోని మంగళవారం పేటకు చెందిన సలాం, నాయుమున్నిసా దంపతులు కుమారుడు కలీమ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన ఫేస్-2 ఫలితాల్లో మెడిసిన్ సీటు సాధించారు. దీంతో కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో అతనికి సీటు దక్కింది. కలీమ్ తల్లి SGT ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, తండ్రి స్వర్ణకారుడిగా పని చేస్తున్నారు. కాగా, కలీమ్ GOVT జూనియర్ కళాశాలలో చదివి సీటు సాధించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ED ఆఫీస్ దగ్గర కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న ధర్నాకి యాజమాన్యం దిగొచ్చింది. తొలగించిన 4290 మంది కాంట్రాక్ట్ కార్మికులకు బయోమెట్రిక్ గేట్ పాసులు యథావిధిగా కొనసాగిస్తామని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మంగళవారం రాత్రి హామి ఇచ్చింది. లిఖిత పూర్వకంగా తమకు హామీ ఇచ్చినట్లు యూనియన్ నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు వెల్లడించారు.
కన్న కూతురుపై తండ్రి అత్యాచారం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. సీఐ పాపారావు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళితవాడలో కూలి పనులు చేసుకునే తండ్రికి ముగ్గురు కుమార్తెలు. మద్యానికి బానిసైన తండ్రి సోమవారం రాత్రి ఎవరూ లేని సమయంలో పెద్ద కుమార్తె (12)ను ఇంట్లో బంధించి అత్యాచారం చేశాడు. తల్లి ఫిర్యాదుమేరకు తండ్రిని అరెస్ట్ చేశామన్నారు.
అక్టోబర్ నెల చివరి నాటికి శ్రీ సత్యసాయి జిల్లా లో ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ పూర్తి చేస్తామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. అమరావతిలోని సీసీఎల్ఏ కార్యాలయం నుంచి మంగళవారం రాత్రి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల చివరి నాటికి వెరిఫికేషన్ పూర్తి చేసి నివేదిక ఇస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.