Andhra Pradesh

News March 19, 2024

శ్రీకాకుళం: పది పరీక్షలకు 446 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 145 కేంద్రాల్లో పది పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు మంగళవారం ఒక తెలిపారు. మొత్తం 29,108 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 28,662 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. 446 మంది పరీక్షలకు హాజరుకానట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

News March 19, 2024

కృష్ణా: బీటెక్ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో చదువుతున్న బీటెక్ విద్యార్థులు హాజరు కావాల్సిన 8వ సెమిస్టర్ (2023-24 విద్యా సంవత్సరం) ప్రాక్టికల్/ వైవా పరీక్షలను ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మార్చి 25వ తేదీలోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నాయి. ఫీజు వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలన్నాయి.

News March 19, 2024

అనకాపల్లి: ఇద్దరు వాలంటీర్స్ తొలగింపు

image

గొలుగొండ మండలం కొత్తమల్లంపేటలో వాలంటర్లు వైసీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసింది. ఈ విషయంపై సోమవారం ఎంపీడీవో ఆధ్వర్యంలో గ్రామంలో విచారణ చేపట్టి, కలెక్టర్‌కి నివేదిక అందించారు. ఎన్నికల అధికారి జయరాం వాలంటీర్స్ ఓంకార విజయలక్ష్మి, సింగంపల్లి భవానీలను తొలగించినట్లు మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఉన్న వాలంటీర్స్ ఏ పార్టీ తరఫున ప్రచారం చేయకూడదని హెచ్చరించారు.

News March 19, 2024

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో  16మంది వాలంటీర్లపై వేటు

image

‘సిద్ధం’ సభలో పాల్గొన్నారని 16మంది వాలంటీర్లపై అధికారులు వేటు వేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి, వాకలగరువు, ఇరుసుమండకు చెందిన 16మంది వాలంటీర్లను సస్పెండ్ చేస్తూ ఎంపీడీవో కె.లక్ష్మి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శుల నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి వైసీపీ సిద్ధం సభలో పాల్గొన్నందుకు వీరిపై చర్యలు తీసుకున్నామన్నారు.

News March 19, 2024

పెదకూరపాడు వాలంటీర్ సస్పెండ్: ERO

image

పెదకూరపాడు గ్రామ 3వ సచివాలయం వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏటుకూరి గోపిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. మంగళవారం పెదకూరపాడులో జరిగిన TDP విస్తృతస్థాయి సమావేశంలో ఇతను భాష్యం ప్రవీణ్ సమక్షంలో టీడీపీలో చేరారు. విషయం తెలిసిన ఎన్నికల అధికారి కందుల శ్రీరాములు వాలంటీర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు సంబంధిత ఎంపీడీవో మల్లేశ్వరికి ఉత్తర్వులు జారీ చేశారు.

News March 19, 2024

భీమవరంలో రైలు ఢీకొని మహిళ మృతి

image

భీమవరం రైల్వే అవుట్ పోలీసు స్టేషన్ పరిధి లక్ష్మీనారాయణపురం రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు రైల్వే ఎస్సై పీటీవీ రమణ తెలిపారు. సుమారు 45 ఏళ్లు కలిగిన మహిళ.. నీలం రంగు చీర, గులాబీ రంగు జాకెట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే 70939 39777 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News March 19, 2024

అల్లూరి జిల్లాలోని చట్టి చెక్ పోస్టు మూసివేత

image

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ చెక్ పోస్టులను G.O.MS-24 ప్రకారం మూసివేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న చింతూరు మండలంలోని రవాణా శాఖ చట్టి చెకపోస్ట్‌‌ను కూడా మూసివేయటం జరిగిందని జిల్లా రవాణాధికారి లీలా ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఇతర రాష్ట్ర వాహనదారులు పన్నులు, పర్మిట్‌లు ఇతర సేవలను ఆన్‌లైన్‌లో తీసుకోవాలని సూచించారు.

News March 19, 2024

ప్రజాగళం సభతో వైసీపీకి ఓటమి భయం: గోరంట్ల

image

ఇటీవల చిలకలూరిపేట మండలంలో జరిగిన టీడీపీ-జనసేన-బీజేపీ ప్రజాగళం సభ విజయవంతమైందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాగళం సభతో వైసీపీకి ఓటమి ఖరారైందని అన్నారు. ప్రజాగళం సభ భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

News March 19, 2024

మర్రిపూడి: రెండు బైక్‌లు ఢీ.. ఒకరు మృతి

image

మర్రిపూడి మండలం వెంకటక్రిష్ణాపురం వద్ద మంగళవారం రెండు బైక్‌లు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. మృతుడు కొండపి గ్రామానికి చెందిన బారెడ్డి ఏడుకొండలుగా పోలీసులు గుర్తించారు. మృతుడు ప్రతి రోజూ కొండపి నుంచి ధర్మవరం గ్రామానికి వచ్చి పాల వ్యాపారం చేస్తుంటాడని సమాచారం. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2024

శ్రీకాకుళం జిల్లాలో రేపు పిడుగులతో భారీ వర్షాలు

image

ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో బుధవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలోని కొన్ని చోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, మంగళవారం రాజాం, పలాస, సీతంపేట, టెక్కలి ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. రేపు పిడుగులు పడే ఆస్కారం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.