Andhra Pradesh

News March 19, 2024

వెంకటగిరి: వరకట్న వేధింపు కేసులో ఉపాధ్యాయునికి మూడేళ్ల జైలు

image

ప్రభుత్వ ఉపాధ్యాయుడైన చెవిరెడ్డి సుధాకర్ రెడ్డి 2011లో స్వప్నను పెళ్లి చేసుకున్నారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని 2017లో ఆమె పోలీసులను ఆశ్రయించారు. విచారించిన వెంకటగిరి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించినట్లు ఏపీపీ ప్రకృతి కుమార్ తెలిపారు.

News March 19, 2024

జామి: మైనర్‌పై దాడి నిందుతుడికి జైలు శిక్ష

image

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ఏడేళ్ల జైలు, రూ.3,500 జరిమానా విధిస్తూ ప్రత్యేక పోక్సో న్యాయస్థానం సోమవారం తీర్పు ఇచ్చిందని విజయనగరం SP దీపిక ఎం.పాటిల్ తెలిపారు. జామి మండలంలో ఓ గ్రామానికి చెందిన ఆబోతుల సత్తిబాబు (45) మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా బాలిక తల్లి 20 సెప్టెంబర్ 2023న పిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన కోర్ట్ నిందుతుడికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిందని SP తెలిపారు.

News March 19, 2024

పులివెందుల: టైంకు అన్నం పెట్టలేదని హత్య

image

అన్నంలోకి కూరలు సకాలంలో తీసుకురాలేదని కోపంతో రెడ్డి బాబును(15) అతని చిన్నాన్న సురేశ్ దాడి చేసి హత్య చేశాడు. సురేశ్‌కు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఒక రూములో ఉంచి రోజు భోజనాలు పెట్టేవారు. సోమవారం చిన్నాన్నకు భోజనం పెట్టడంలో ఆలస్యం కావడంతో సురేశ్ ఆగ్రహంతో రెడ్డి బాబును తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలైన రెడ్డిబాబు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2024

ఒంగోలు: వైసీపీకి మేలు చేశారన్న అభియోగంపై టీచర్ రిలీవ్

image

రానున్న ఎన్నికలలో వైసీపీకి మేలు చేసేలా ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎం.ప్రసాద్ వ్యవహరిస్తుండడంతో ఆ బాధ్యత నుంచి రిలీవ్ చేశారు. ఒంగోలులో ఆయ‌న ప్రస్తుతం సిబ్బందికి ఎన్నికల విధులు వేసే పనిలో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయిస్తున్నట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

News March 19, 2024

GREAT: మన గోదారి బిడ్డకు.. ఆల్ ఇండియా 32 RANK

image

ఇటీవల నిర్వహించిన గేట్ పరీక్షల్లో ఏలూరుకు చెందిన కె.సాయి ఫణీంద్ర ఆలిండియాలో ఉత్తమ ర్యాంకు సాధించాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే చదువుకున్నానని ఫణీంద్ర తెలిపాడు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ ఫర్‌మేషన్ టెక్నాలజీ (సీఎస్) విభాగంలో పరీక్ష రాసి ఆలిండియా స్థాయిలో 921 మార్కులు సాధించి 32వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా అతడికి పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.

News March 19, 2024

తూర్పుగోదావరి: సెల్యూట్ ‘అమ్మ’❤

image

యానాంకు చెందిన కడలి మధు, మాధవ్ చిన్నతనంలోనే నాన్న ప్రేమకు దూరమయ్యారు. అయినా ధైర్యం కోల్పోకుండా వారి చదువు, బాగోగులు అన్నింటినీ వాళ్ల అమ్మే చూసుకుంది. ఇద్దరు కొడుకులను బాగా చదివించింది. ఈ క్రమంలో ఇద్దరూ కానిస్టేబుళ్లు అయ్యారు. ఇటీవల పుదుచ్చేరి పోలీస్ శాఖ ప్రకటించిన పదోన్నతులలో ఏఎస్సైలుగా బాధ్యతలు స్వీకరించారు. ఏఎస్సై యూనిఫాంలో ఇంటికి వచ్చి వారి అమ్మకు సెల్యూట్ చేస్తూ పొంగిపోయారు.
– GREAT కదా.

News March 19, 2024

గుంటూరు: ఎన్నికల షెడ్యూల్ దృష్ట్యా రైతులకు విజ్ఞప్తి

image

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారి సోమవారం ఒక ప్రకటన ద్వారా రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ సమయంలో ఆధారం లేకుండా అధిక మొత్తంలో నగదును తీసుకొని వెళ్లడం నేరం. మిర్చి యార్డులో మిర్చి అమ్ముకొని నగదు తీసుకొని వెళ్లేటప్పుడు రైతు సోదరులు నగదుకు సంబంధించిన రసీదును తప్పనిసరిగా తీసుకువెళ్లాలన్నారు. ఆ రసీదు మీకు ఆధారంగా ఉపయోగపడుతుందన్నారు.

News March 19, 2024

VZM: 50 ఏళ్ల వయసులో 10వ తరగతి పరీక్షకు హాజరు

image

చదువుకి వయసుతో సంబంధం లేదని గుమ్మలక్ష్మిపురం మండలానికి చెందిన పెద్దమ్మి నిరూపించింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మూలపాడుకి చెందిన 53 ఏళ్ల పెద్దమ్మి సోమవారం పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు. 7వ తరగతి వరకు చదివిన ఆమె అనివార్య కారణాలతో చదువు ఆపేశానాని, చదువుపై ఆసక్తితో మళ్లీ పరీక్షలు రాస్తున్నట్టు తెలిపింది. సోమవారం పరీక్ష రాసేందుకు భద్రగిరి ఏపీఆర్ కేంద్రానికి వచ్చారు.

News March 19, 2024

నెల్లూరు: కొత్త స్కూటర్ ఇవ్వాలని కోర్టు ఆదేశం

image

నెల్లూరుకు చెందిన సురేశ్ బాబు 2022లో ఓ ఎలక్ట్రికల్ స్కూటర్ కొన్నారు. మైలేజీ రాకపోగా పది రోజులకే సెన్సార్ పనిచేయలేదు. బ్రేకులు ఫెయిలయ్యాయి. మరమ్మతులు చేయాలని లేదా కొత్త స్కూటర్ ఇవ్వాలని పలుమార్లు బాధితుడు కోరినా కంపెనీ నుంచి స్పందించక పోవడంతో బాధితుడు  వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. 45 రోజుల్లో కొత్త స్కూటర్ ఇవ్వడంతో పాటు రూ.5 వేలు ఖర్చుల నిమిత్తం చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించింది.

News March 19, 2024

REWIND: అనంతపురం MPగా హైదరాబాద్ రాజు

image

హైదరాబాద్ రాజు మన అనంతపురం ఎంపీగా పని చేశారని మీకు తెలుసా? ఇది నిజమే. హైదరాబాద్ సంస్థానం 1948లో భారత దేశంలో విలీనమైంది. ఆ తర్వాత నిజాం చివరి పాలకుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్(6వ నిజాం) 1957లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కర్నూలు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అలాగే 1962లో అనంతపురం ఎంపీగా ఎన్నికయ్యారు. రానున్న ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో కామెంట్.