India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

‘సిద్ధం’ సభలో పాల్గొన్నారని 16మంది వాలంటీర్లపై అధికారులు వేటు వేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి, వాకలగరువు, ఇరుసుమండకు చెందిన 16మంది వాలంటీర్లను సస్పెండ్ చేస్తూ ఎంపీడీవో కె.లక్ష్మి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శుల నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి వైసీపీ సిద్ధం సభలో పాల్గొన్నందుకు వీరిపై చర్యలు తీసుకున్నామన్నారు.

పెదకూరపాడు గ్రామ 3వ సచివాలయం వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్న ఏటుకూరి గోపిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. మంగళవారం పెదకూరపాడులో జరిగిన TDP విస్తృతస్థాయి సమావేశంలో ఇతను భాష్యం ప్రవీణ్ సమక్షంలో టీడీపీలో చేరారు. విషయం తెలిసిన ఎన్నికల అధికారి కందుల శ్రీరాములు వాలంటీర్ను సస్పెండ్ చేస్తున్నట్లు సంబంధిత ఎంపీడీవో మల్లేశ్వరికి ఉత్తర్వులు జారీ చేశారు.

భీమవరం రైల్వే అవుట్ పోలీసు స్టేషన్ పరిధి లక్ష్మీనారాయణపురం రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు రైల్వే ఎస్సై పీటీవీ రమణ తెలిపారు. సుమారు 45 ఏళ్లు కలిగిన మహిళ.. నీలం రంగు చీర, గులాబీ రంగు జాకెట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే 70939 39777 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ చెక్ పోస్టులను G.O.MS-24 ప్రకారం మూసివేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న చింతూరు మండలంలోని రవాణా శాఖ చట్టి చెకపోస్ట్ను కూడా మూసివేయటం జరిగిందని జిల్లా రవాణాధికారి లీలా ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఇతర రాష్ట్ర వాహనదారులు పన్నులు, పర్మిట్లు ఇతర సేవలను ఆన్లైన్లో తీసుకోవాలని సూచించారు.

ఇటీవల చిలకలూరిపేట మండలంలో జరిగిన టీడీపీ-జనసేన-బీజేపీ ప్రజాగళం సభ విజయవంతమైందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాగళం సభతో వైసీపీకి ఓటమి ఖరారైందని అన్నారు. ప్రజాగళం సభ భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

మర్రిపూడి మండలం వెంకటక్రిష్ణాపురం వద్ద మంగళవారం రెండు బైక్లు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. మృతుడు కొండపి గ్రామానికి చెందిన బారెడ్డి ఏడుకొండలుగా పోలీసులు గుర్తించారు. మృతుడు ప్రతి రోజూ కొండపి నుంచి ధర్మవరం గ్రామానికి వచ్చి పాల వ్యాపారం చేస్తుంటాడని సమాచారం. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో బుధవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలోని కొన్ని చోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, మంగళవారం రాజాం, పలాస, సీతంపేట, టెక్కలి ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. రేపు పిడుగులు పడే ఆస్కారం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గోడలపై రాతలకు అనుమతి లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఎన్నికల అంశాలపై జిల్లా కలెక్టర్లతో మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లో, వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని ఆయన ఆదేశించారు.

పది పరీక్షలలో తెలుగుకు బదులు హిందీ పరీక్ష రాసిన విద్యార్థిని ప్రియాంకబాయికు న్యాయం చేసేందుకు ఉన్నతాధికారులు అంగీకరించారని మండల విద్యశాఖ అధికారులు రవికుమార్, కాంతారావులు తెలిపారు. కారంపూడి MEO ఆఫీస్లో వీళ్లు మాట్లాడుతూ.. పరీక్ష ఫీజు కట్టే సమయంలో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు బదులు హిందీ అని అప్లికేషన్లో సెలెక్ట్ చేశారన్నారు. దీనివల్ల హిందీ పేపర్ ఇచ్చారన్నారు. ఈనెల 31న తెలుగు పరీక్ష రాయిస్తామన్నారు.

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కాపు అయితే, నేనూ కాపు ఆడపడుచునే అని అన్నారు. 100 శాతం కాపుల మద్దతు తనకే ఉంటుందని, అన్ని కులాల్లో తనను అభిమానించేవారు ఉన్నారన్నారు. చుట్టం చూపుగా వచ్చి మాటలు చెప్పి వెళ్లిపోయే వారిని ప్రజలు నమ్మరని సెటైర్స్ వేశారు. పిఠాపురంలో కూటమి నుంచి జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.