India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జలదంకి మండల పరిధిలోని చిన్న కాక వద్ద అదుపుతప్పి గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ లారీలోనే చిక్కుకుపోవడంతో అటువైపుగా వెళ్తున్న వాహనదారులు రక్షించి బయటికి తీశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పంగా గాయపడిన డ్రైవర్ ను ఆసుపత్రిలో తరలించినట్లు స్థానికులు తెలిపారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించినట్టు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. పెనుకొండకు సబ్ కలెక్టర్, హిందూపురానికి జాయింట్ కలెక్టర్, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాలకు ఆయా ఆర్డీవోలు, మడకశిరకు అహుడా కార్యదర్శి గౌరీ శంకర్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. హిందూపురం పార్లమెంటుకు కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు.

బాపట్లలో సోమవారం సాయంత్రం రైలు కిందపడి మృతి చెందిన వ్యక్తి వివరాలను రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే ఎస్సై రాజకుమార్ తెలిపిన కథనం మేరకు.. విజయవాడకు చెందిన షేక్. సమ్మర్ (45) అనే వ్యక్తి రైలులో కాంట్రాక్ట్ పద్ధతిలో సమోసాలు విక్రయిస్తుంటాడు. సోమవారం సాయంత్రం పూరి- తిరుపతి ఎక్స్ప్రెస్ బాపట్లలో నిలపగా.. కాలకృత్యాలు తీర్చుకుని రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా జారిపడి మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపలవేట నిలిచిపోనుంది. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చేప పిల్లలు ఎదిగే సమయం కావడంతో ఏటా ఏప్రిల్-జూన్ మధ్య 61రోజుల పాటు చేపలవేటను నిషేధిస్తారు. ఏపీతోపాటు తీరప్రాంతం విస్తరించి ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు కానుంది. కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉందని మత్స్యశాఖ జేడీ విజయకృష్ణ తెలిపారు.

పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వాలంటీర్ను, విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆవుల గోపాలకృష్ణ అనే వాలంటీర్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కరపత్రాలను అందించిన క్రమంలో, అందిన ఫిర్యాదు మేరకు ఆర్డీవో సదరు వాలంటీర్ను విధులు నుంచి తొలగించారు. వాలంటీర్ దగ్గర నుంచి సెల్ ఫోను బయోమెట్రిక్ డివైస్ను స్వాధీనపరుచుకున్నారు.

బత్తలపల్లి సమీపంలోని నార్సింపల్లి రోడ్డు వద్ద సోమవారం పొలంలో విద్యుత్ తీగలు చోరీ చేయడానికి వచ్చి శ్రీరాములు(32) అనే వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందాడని బత్తలపల్లి ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. బాధితుడు పుట్టపర్తి మండలం ఎనుములపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించమన్నారు. కుటుంబ సభ్యులతో గొడవపడి గత ఆరు నెలలుగా ఇంటికి వెళ్లడం లేదన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కాకినాడ పట్టణ నియోజకవర్గానికి 1952- 2019 వరకు మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముత్తా గోపాలకృష్ణ కాంగ్రెస్‘ఐ’ అభ్యర్థి మల్లాడిస్వామిపై అత్యధికంగా 55631 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాకినాడ సిటీ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ. మళ్లీ అంత మెజారిటీ ఎప్పుడూ రాలేదు. మరి ఈ ఎన్నికల్లో ఇక్కడ గెలుపు ఎవరిదైనా.. ఆ నాటి మెజారిటీని కొల్లగొట్టేనా..?

తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపలవేట నిలిచిపోనుంది. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చేప పిల్లలు ఎదిగే సమయం కావడంతో ఏటా ఏప్రిల్-జూన్ మధ్య 61రోజుల పాటు చేపలవేటను నిషేధిస్తారు. ఏపీతోపాటు తీరప్రాంతం విస్తరించి ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు కానుంది. కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉందని మత్స్యశాఖ జేడీ విజయకృష్ణ తెలిపారు.

మచిలీపట్నంలో జర్నలిస్టుల హౌస్ సైట్స్కు సంబంధించిన, తీర్మాన ఫైల్ చెత్త<<12882516>> కుప్పలో దర్శనమివ్వడంపై<<>> జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ని ఆదేశించారు. నివేశన స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఫైల్ ఆన్లైన్లో బాగ్రత్తగా ఉంటుందని.. ఈ విషయంలో జర్నలిస్టులెవ్వరూ ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ భరోసానిచ్చారు.

కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద కృష్ణా నదిలో పెద్ద సంఖ్యలో జెల్లీ ఫిష్లు సందడి చేస్తున్నాయి. సముద్రపు జలాలు కృష్ణా నది బ్యాక్ వాటర్గా ప్రవహించే ఈ ప్రాంతంలోకి సముద్రపు జీవులైన జెల్లీ ఫిష్లు వేసవిలో వస్తుంటాయి. ఈసారి కూడా జెల్లీ ఫిష్లు నాగాయలంక తీరానికి రావటంతో సందర్శకులు అక్కడికి చేరుకుని తిలకిస్తున్నారు. పుష్కర ఘాట్ అవతలి లంకదిబ్బల మధ్య జలాల్లో ఫిష్లు అత్యధికంగా ఉన్నాయని సందర్శకులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.